Movie News

వుహాన్‌లో షూటింగ్ జరుపుకున్న సంపూ సినిమా!

స్పూఫులు, పేరడీలు చేసుకుంటూ కూడా సూపర్ పాపులర్ కావచ్చని.. ఈ స్టయిల్లో ఓ సినిమా కూడా తీసి హిట్టు కొట్టొచ్చని నిరూపించాడు సంపూర్ణేష్ బాబు. తనకు తాను బర్నింగ్ స్టార్ అని బిరుదు ఇచ్చుకుని ఒకప్పుడు అతను చేసిన హంగామా గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంపూను హీరోగా పెట్టి సాయి రాజేష్ (స్క్రీన్ నేమ్ స్టీఫెన్ శంకర్) తీసిన ‘హృదయ కాలేయం’ అప్పట్లో సూపర్ హిట్టయింది.

వీళ్ల కలయికలో గత ఏడాది వచ్చిన ‘కొబ్బరి మట్ట’ కూడా ఉన్నంతలో బాగానే ఆడింది. ఇప్పుడు సంపూనే హీరోగా పెట్టి సాయిరాజేష్ అండ్ టీమ్ ఇంకో సినిమా తీసింది. ఇది ప్రస్తుత కాలానికి సరిగ్గా సూటయ్యే సినిమా కావడం విశేషం. కరోనా నేపథ్యంలో సంపూను హీరోగా పెట్టి సినిమా తీశారు. శనివారం సంపూ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు.

ఈ సినిమాకు ఇంకా టైటిల్ పెట్టలేదు. టైటిల్ దగ్గర క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేశారు. అల్ట్రా స్టైలిష్ లుక్‌లో ఉన్న సంపూ ఓ గబ్బిలాన్ని పట్టుకుని కూర్చున్నాడు. కరోనా వైరస్‌ పుట్టిన చైనా నగరం వుహాన్‌లోని గబ్బిలాల మార్కెట్లో షూటింగ్ జరుపుకున్న చివరి సినిమా అంటూ పోస్టర్ మీద వేయడం విశేషం.

పోస్టర్ మీద కరోనా వైరస్ నమూనాలు కనిపిస్తుండటం.. వెనుక చైనీయులు, పెద్ద పెద్ద బిల్డింగులు దర్శనమిస్తుండటంతో కరోనాను అంతం చేయడానికి వెళ్లిన రక్షకుడి మీద తీసినట్లుగా ఉందీ చిత్రం. సంపూ సినిమా అంటే ఇలాంటి అతి వ్యవహారాలే ఉంటాయి. వీటితోనే అతను నెట్టుకొస్తున్నాడు. జనాలు కూడా సరదాగానే చూస్తారు అతడి సినిమాల్ని. ఈ సినిమా దర్శకుడి పేరు ‘నోలన్ మౌళి’ కావడం గమనార్హం.

సాయి రాజేష్ తన పేరును స్టీఫెన్ స్పీల్ బర్గ్, శంకర్‌ల నుంచి తీసుకున్నట్లే.. ఇతను క్రిస్టఫర్ నోలన్, రాజమౌళిల పేర్లను కలిపి తన స్క్రీన్ నేమ్ పెట్టుకున్నట్లున్నాడు. థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో ఇంకా క్లారిటీ రాకపోయినా.. జులై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి సంపూ కొత్త సినిమా దిగుతుందని పోస్టర్ మీద వేసేయడం విశేషం.

This post was last modified on May 10, 2020 8:43 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

32 minutes ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

55 minutes ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

1 hour ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

2 hours ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

2 hours ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

3 hours ago