కొత్త సినిమాల రిలీజ్, షూటింగ్ ముచ్చట్లు ఏమీ లేని ఈ టైంలో సినీ ప్రియులకు ట్విట్టర్లో కాలక్షేపానికి ఎంచుకుంటున్న ఓ మార్గం.. పాత సినిమాల వార్షికోత్సవాల్ని పురస్కరించుకుని ట్వీట్లు వేయడం, ట్రెండ్స్లో పాల్గొనడం, అప్పటి జ్ఞాపకాల్ని నెమరు వేసుకోవడం. మరీ ఖాళీగా ఉండేసరికి మామూలు సినిమాలకు కూడా వార్షికోత్సవాల పేరుతో హంగామా చేస్తున్నారు.
ఐతే ఇప్పుడు ఓ రెండు ఆల్ టైం హిట్ సినిమాల వార్షికోత్సవాలకు వేళైంది. ఆ రెండూ తెలుగు సినిమా చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిపోయిన.. ట్రెండ్ సెట్ చేసిన సినిమాలే. ఒకటి మెగాస్టార్ చిరంజీవి సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి కాగా.. ఇంకోటి విక్టరీ వెంకటేష్ నటించిన ప్రేమించుకుందాం రా. ఈ రెండు చిత్రాలూ మే 9నే రిలీజయ్యాయి.
జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజై 30 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో కొన్ని రోజుల కిందటి నుంచే సోషల్ మీడియాలో హంగామా నడుస్తోంది. ఈ సినిమాను నిర్మించిన వైజయంతీ మూవీస్ సంస్థ పాత జ్ఞాపకాలతో వీడియోలు కూడా రిలీజ్ చేస్తోంది. నాని వాయిస్ ఓవర్తో ఇప్పటికే రెండు వీడియోలొచ్చాయి. అసలే చిరంజీవి సినిమా.. పైగా ఆల్ టైం హిట్లలో ఒకటి. ఇక మెగా అభిమానుల సందడి గురించి చెప్పేదేముంది. ముందు రోజే *30 గ్లోరియస్ ఇయర్స్ ఫర్ ఇండస్ట్రీ హిట్ జేవీఏఎస్ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్వీట్లు గుప్పిస్తున్నారు.
వీరికి విక్టరీ ఫ్యాన్స్ కూడా తోడయ్యారు. వెంకీ కెరీర్లో ఒకానొక బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ప్రేమించుకుందాం రా విడుదలై శనివారానికి 23 ఏళ్లు పూర్తవుతున్నాయి. దీంతో ఆ సినిమా జ్ఞాపకాలు, దాని ప్రభంజనాన్ని గుర్తు చేసుకుంటూ వెంకీ అభిమానులు ట్విట్టర్లో సందడి చేస్తున్నారు. శనివారం ఈ రెండు సినిమాల హంగామా మరో స్థాయికి చేరే అవకాశముంది.
This post was last modified on May 9, 2020 5:28 pm
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…
గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…