లాక్డౌన్ కారణంగా అన్ని భాషల్లోనూ సినిమా షూటింగ్లన్నింటికీ బ్రేక్ పడింది. షూటింగ్ పూర్తిచేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా కంప్లీట్ చేసుకున్న చాలా సినిమాలు, రిలీజ్ డేట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. అయితే ఈ టైమ్లో తన కొత్త ప్రాజెక్ట్ను అనౌన్స్ చేసి, అందర్నీ ఆశ్చర్యంలో పడేశాడో యంగ్ హీరో.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కొత్త సినిమాను ప్రకటించాడంటే… మనోడు వరుస హిట్టుల్లో దూసుకుపోతూ సక్సెస్లో ఉన్నవాడేం కాదు, ఒకదాని తర్వాత మరొటి ఇలా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. ఇలాంటి టఫ్ టైమ్లో కూడా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం వెనక ఓ పర్ఫెక్ట్ ప్లాన్ ఉందంటున్నారు టాలీవుడ్ జనాలు.
ఓ పేరున్న సినిమా వ్యక్తి బ్యాకింగ్ తో సినిమాల్లోకి వచ్చిన సదరు హీరో, తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు తీస్తున్నాడు. ఎంతో కష్టపడితే ఈ కుర్రాడికి ఏడేళ్ల కిందట ఓ సక్సెస్ దక్కింది. తన కెరీర్కు ఊపునిచ్చిన ఆ సినిమా పేరుకు దగ్గరగా ఉండే టైటిల్తో కొత్త ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాడు ఈ యంగ్ హీరో.
తమిళ్లో హిట్టైన ఓ సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహారిస్తున్న యంగ్ హీరోకి ఆర్థిక కష్టాలు ఎదురయ్యాయి. దాంతో ఏం చేయాలో తెలియక సడెన్గా మరో కొత్త సినిమాను మొదలెట్టాడు. ప్రముఖ బ్యానర్లో రూపొందే ఈ సినిమా ద్వారా హీరోగారికి వచ్చే పారితోషకాన్ని తన సొంత ప్రాజెక్ట్కు ఉపయోగించబోతున్నాడట. నిజానికి ఇది చాలా పాత లాజిక్కే కాని, ఈ మద్య ఎవరూ ఇలాంటి చేయట్లేదు. బట్, మనోడికి తప్పట్లేదు.
ఏదేమైనా కూడా అదిరిపోయే ఐడియాతో రెండు సినిమాలను లైన్లో పెట్టిన ఈ యంగ్ హీరో ఈసారైనా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.
This post was last modified on May 11, 2020 10:47 pm
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…