ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది ‘ఆర్ఆర్ఆర్’ సినిమా. 2020 జులై 30న రావాల్సిన సినిమాను.. ఆ సమయానికి రెడీ చేయలేమని 2021 జనవరి 8కి వాయిదా వేయించాడు దర్శకుడు రాజమౌళి. ఆ దిశగా ప్రణాళికలతో వెళ్తుండగా.. కరోనా వచ్చి అంతా నాశనం చేసేసింది. కరోనా బ్రేక్ తర్వాత షూటింగ్ పున:ప్రారంభించిన కొన్ని నెలలకు అన్ని విషయాలూ చూసుకుని దసరా కానుకగా అక్టోబరు 13న ఈ చిత్రానికి విడుదల చేయడానికి ముహూర్తం నిర్ణయించారు. ఈ డేట్కు ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా రావాల్సిందే అని, మార్చేందుకు అవకాశమే లేదని అంతా అనుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ తేదీని అందుకోవడంపై చిత్ర బృందంలో సందేహాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం.
ముందు అనుకున్న ప్రకారం అయితే ఈపాటికి షూటింగ్ దాదాపు పూర్తయి ఉండాలి. కానీ రాజమౌళి తనదైన చెక్కుడు చెక్కుతూ వెళ్తుండటం, కొన్ని షెడ్యూళ్లు అనుకున్న ప్రకారం ముగియకపోవడం, చరణ్ ‘ఆచార్య’ కోసం బ్రేక్ తీసుకోవడం వల్ల షూటింగ్ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ఇంకా నెలా నెలన్నర దాకా షూట్ కోసం కేటాయించాల్సి ఉందట. ఆ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ పని ఉంది. ఇతర పోస్ట్ ప్రొడక్షన్.. వివిధ భాషల్లో డబ్బింగ్ పనులన్నీ ముగించి అక్టోబరుకు సినిమాను రెడీ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డెడ్ లైన్ అందుకోవడానికి ముందు గట్టిగా ప్రయత్నించి, కుదరని పక్షంలో వాయిదా వేద్దామని చూస్తున్నారట. మరి కొన్ని రోజుల తర్వాత ఈ విషయమై ఒక క్లారిటీ వస్తుందని, దాన్ని బట్టి నిర్ణయం తీసుకుందామని చూస్తున్నారట. దసరా మిస్ అయిందంటే ఇక వచ్చే సంక్రాంతికే ఈ సినిమాను రిలీజ్ చేయాల్సి ఉంటుంది. మరీ 2022 వేసవి దాకా అయితే ఎదురు చూడలేరు. ‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతిని టార్గెట్ చేసేట్లయితే మహేష్ మూవీ ‘సర్కారు వారి పాట’ దసరాకు ప్రి పోన్ చేయొచ్చని అంటున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ దసరాకు ఫిక్సవడంతోనే ఈ చిత్రాన్ని సంక్రాంతికి షెడ్యూల్ చేశారు. ఈ సినిమా షూటింగ్ జోరుగానే సాగుతుండటంతో దసరాకు సిద్ధం చేయడం కష్టమేమీ కాదనుకుంటున్నారు. మరి పవన్-క్రిష్ సినిమా పరిస్థితేంటో చూడాలి. ‘ఆర్ఆర్ఆర్’తో అది కూడా పోటీ పడకపోవచ్చు. దీపావళి లేదా క్రిస్మస్ సీజన్కు దాన్ని ప్రిపోన్ చేసే అవకాశాలున్నాయి.
స్టార్ హీరోయిన్లు ఏదైనా రామాయణ లాంటి పెద్ద సినిమాలో నటించినపుడు వారి ఇమేజ్కు తగ్గ పాత్రలు లేకపోతే.. అభిమానులు ఫీలవడం…
ఏపీలో కూటమి పాలనకు అప్పుడే రెండేళ్లు పూర్తి అయిపోయింది. ఇంకో మూడేళ్లు ఉంటే మరో ఎన్నికలకు కూటమి పార్టీలు సన్నద్ధం కావాల్సిన పరిస్థితి.…
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మావిగన్ పై ఓ రేంజిలో చర్చ నడుస్తోంది. వైసీపీ అదినేత వైఎస్ జగన్…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…