గత కొన్నేళ్లలో టాలీవుడ్లో చాలా వేగంగా పెద్ద రేంజికి వెళ్లిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకడు. నందమూరి కళ్యాణ్ రామ్తో ‘పటాస్’ లాంటి మీడియం రేంజ్ సినిమాతో మొదలుపెట్టిన అతను.. వరుసగా హిట్లు ఇస్తూ ఐదో సినిమాకే మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్తో సినిమా చేసే అవకాశం అందుకున్నాడు. మహేష్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ‘సర్కారు వారి పాట’తో ఆయన కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ డెలివర్ చేశాడు అనిల్.
దీంతో అతడితో మరో సినిమా చేయడానికి ఇంతకుముందే మహేష్ హామీ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. కాగా ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’లో నటిస్తున్న మహేష్.. దీని తర్వాత రాజమౌళితో సినిమాను మొదలుపెట్టడానికి సమయం పడుతుంది కాబట్టి, మధ్యలో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. ఆ ఖాళీని అనిలే భర్తీ చేయబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే నందమూరి బాలకృష్ణతోనూ అనిల్ ఓ సినిమా చేయొచ్చనే ప్రచారమూ జరుగుతోంది.
తన కథతో, తన దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ‘గాలి సంపత్’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన అనిల్.. పై రెండు సినిమాల గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ రెండు సినిమాలు లైన్లోనే ఉన్నట్లు అతను స్పష్టం చేశాడు. ఐతే ప్రస్తుతం ఆ ప్రాజెక్టులు చర్చల దశలోనే ఉన్నాయని, ఏదీ ఖరారవ్వలేదని చెప్పాడు. ఆ హీరోలిద్దరితో సినిమాల కోసం కథల తయారీ కూడా జరుగుతున్నట్లు అతను వెల్లడించాడు. బహుశా ఆ ఇద్దరికీ అనిల్ ఇంకా స్క్రిప్టు వినిపించి ఉండకపోవచ్చు.
ఏ సినిమా ఎప్పుడు చేయాలన్న టైమింగ్ ఇంకా కుదిరి ఉండకపోవచ్చు. కానీ అనిల్తో పని చేయడానికి ఆ ఇద్దరు హీరోలూ ఆసక్తితోనే ఉండే అవకాశం ఉంది కాబట్టి ముందో వెనుకో ఆ ప్రాజెక్టులు పట్టాలెక్కడం ఖాయం అనుకోవచ్చు. మహేష్ లాంటి పెద్ద స్టార్తో సినిమా చేసినప్పటికీ.. బాలయ్యతో ఓ చిత్రం చేయాలన్నది అనిల్ కోరిక. ఇందుకోసం గతంలోనే ప్రయత్నించాడు కానీ.. వర్కవుట్ కాలేదు.
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…