Movie News

మహేష్, బాలయ్య సినిమాలపై రావిపూడి క్లారిటీ

గత కొన్నేళ్లలో టాలీవుడ్లో చాలా వేగంగా పెద్ద రేంజికి వెళ్లిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకడు. నందమూరి కళ్యాణ్ రామ్‌తో ‘పటాస్’ లాంటి మీడియం రేంజ్ సినిమాతో మొదలుపెట్టిన అతను.. వరుసగా హిట్లు ఇస్తూ ఐదో సినిమాకే మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్‌తో సినిమా చేసే అవకాశం అందుకున్నాడు. మహేష్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ‘సర్కారు వారి పాట’తో ఆయన కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ డెలివర్ చేశాడు అనిల్.

దీంతో అతడితో మరో సినిమా చేయడానికి ఇంతకుముందే మహేష్ హామీ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. కాగా ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’లో నటిస్తున్న మహేష్.. దీని తర్వాత రాజమౌళితో సినిమాను మొదలుపెట్టడానికి సమయం పడుతుంది కాబట్టి, మధ్యలో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. ఆ ఖాళీని అనిలే భర్తీ చేయబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే నందమూరి బాలకృష్ణతోనూ అనిల్ ఓ సినిమా చేయొచ్చనే ప్రచారమూ జరుగుతోంది.

తన కథతో, తన దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ‘గాలి సంపత్’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన అనిల్.. పై రెండు సినిమాల గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ రెండు సినిమాలు లైన్లోనే ఉన్నట్లు అతను స్పష్టం చేశాడు. ఐతే ప్రస్తుతం ఆ ప్రాజెక్టులు చర్చల దశలోనే ఉన్నాయని, ఏదీ ఖరారవ్వలేదని చెప్పాడు. ఆ హీరోలిద్దరితో సినిమాల కోసం కథల తయారీ కూడా జరుగుతున్నట్లు అతను వెల్లడించాడు. బహుశా ఆ ఇద్దరికీ అనిల్ ఇంకా స్క్రిప్టు వినిపించి ఉండకపోవచ్చు.

ఏ సినిమా ఎప్పుడు చేయాలన్న టైమింగ్ ఇంకా కుదిరి ఉండకపోవచ్చు. కానీ అనిల్‌తో పని చేయడానికి ఆ ఇద్దరు హీరోలూ ఆసక్తితోనే ఉండే అవకాశం ఉంది కాబట్టి ముందో వెనుకో ఆ ప్రాజెక్టులు పట్టాలెక్కడం ఖాయం అనుకోవచ్చు. మహేష్ లాంటి పెద్ద స్టార్‌తో సినిమా చేసినప్పటికీ.. బాలయ్యతో ఓ చిత్రం చేయాలన్నది అనిల్ కోరిక. ఇందుకోసం గతంలోనే ప్రయత్నించాడు కానీ.. వర్కవుట్ కాలేదు.

This post was last modified on March 10, 2021 8:09 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

5 hours ago