ఒక కొత్త హీరో.. ఒక కొత్త హీరోయిన్.. ఈ ఇద్దరినీ పెట్టి సినిమా తీసినవాడూ కొత్త దర్శకుడే. అతను చేసిందేమీ యాక్షన్ మూవీ కాదు. హీరోను పెద్ద మాస్ హీరోలాగానూ ప్రెజెంట్ చేయలేదు. అయినా సరే.. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనం రేపింది. ఎవ్వరూ ఊహించని స్థాయిలో వసూళ్ల మోత మోగించింది. కనీ వినీ ఎరుగని రికార్డులు సృష్టించింది. ఈ ఉపోద్ఘాతం ‘ఉప్పెన’ సినిమా గురించే అని అర్థమయ్యే ఉంటుంది.
విడుదలైన తొలి రోజు నుంచి సంచలనాలు రేపుతూ.. కొత్త కొత్త రికార్డులు నెలకొల్పుతూ సాగుతున్న ఈ చిత్రం.. ఇప్పుడు మరో అరుదైన ఘనతను అందుకుంది. వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా వెల్లడించింది. తమ చిత్రం వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లు వంద కోట్లను దాటాయని.. సముద్రమంత ప్రేమ చూపించినందుకు ధన్యవాదాలని ఆ సంస్థ ఈ పోస్టర్లో పేర్కొంది. హీరో వైష్ణవ్ తేజ్ రోరింగ్ లుక్తో కనిపించాడు ఈ పోస్టర్లో.
ఒక డెబ్యూ హీరో సినిమా నెలకొల్పిన అన్ని రికార్డులనూ తొలి మూణ్నాలుగు రోజుల్లోనే ‘ఉప్పెన’ బద్దలు కొట్టేసిన సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ లాంటి భారీ చిత్రాల స్థాయిలో వీకెండ్ తర్వాత అనూహ్యమైన షేర్ సాధిస్తూ దూసుకెళ్లిందీ చిత్రం. కొత్త సినిమాలు వస్తున్నాయి. పోతున్నాయి. కానీ ‘ఉప్పెన’ జోరు మాత్రం ఆగట్లేదు. శుక్రవారం కొత్త సినిమాల రిలీజ్తో కొంత జోరు తగ్గుతున్నా శని, ఆదివారాలు వచ్చేసరికి వాటిని వెనక్కి నెట్టి బాక్సాఫీస్ లీడర్గా నిలుస్తూ దూసుకెళ్తోందీ చిత్రం.
ఈ వారాంతంలో కూడా కొత్త సినిమాల కంటే ‘ఉప్పెన’కు ఎక్కువ షేర్ వస్తే ఆశ్చర్యమేమీ లేదు. ఇప్పటికే రూ.50 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ మార్కును ఈ చిత్రం దాటేసింది. ఇప్పుడు గ్రాస్ వసూళ్లు రూ.100 కోట్ల మార్కును అందుకున్నాయి. రొమాంటిక్ సినిమాల్లో అత్యధిక గ్రాస్, షేర్ కలెక్ట్ చేసిన ‘గీత గోవిందం’కు సమీపంగానే వెళ్లేలా కనిపిస్తోందీ చిత్రం.
This post was last modified on March 6, 2021 5:49 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…