Movie News

ఆ సినిమా రిలీజ్‌‌పై ఎంత సస్పెన్సో

నెంజం మరప్పుదిల్లై.. కొన్ని రోజుల నుంచి తమిళ సినీ ప్రేక్షకుల చర్చలన్నీ ఈ సినిమా చుట్టూనే తిరుగుతున్నాయి. 7/జి బృందావన కాలనీ సహా కొన్ని సంచలన చిత్రాలు తీసిన విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ రూపొందించిన చిత్రమిది. మూణ్నాలుగేళ్ల కిందటే ఈ సినిమా పూర్తయింది. కానీ నిర్మాతలకు, ఫైనాన్షియర్లకు ఉన్న గొడవలు, ఇతర సమస్యల వల్ల ఈ సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోయింది. ఒక దశలో ఈ చిత్రం అసలు విడుదలే కాదన్న అభిప్రాయానికి వచ్చేశారందరూ. ఇలాంటి తరుణంలో అనూహ్యంగా కొన్ని రోజుల కిందట ఈ చిత్రాన్ని విడుదలకు ముస్తాబు చేశారు. ఆసక్తికర ప్రోమోలు కూడా వదిలారు.

డైరెక్టర్ టర్న్డ్ యాక్టర్ ఎస్.జె.సూర్య ఇందులో సైకో పాత్రలో నటించాడు. తాజాగా ‘నెంజం మరప్పుదిల్లై’ నుంచి స్నీక్ పీక్ వీడియో ఒకటి వదలగా.. అందులో సూర్య పాత్ర చూసి జనాలు జడుసుకున్నారు. అంత షాకింగ్‌గా అనిపించిందా స్నీక్ పీక్.

‘నెంజం మరప్పుదిల్లై’ విడుదలకు సమయం పెరిగే కొద్దీ అంచనాలు పెరిగిపోతుంటే.. మరోవైపు ఈ సినిమాను ఎప్పట్నుంచో వెంటాడుతున్న వివాదం తిరిగి రాజుకోవడంతో విడుదలపై సందేహాలు నెలకొన్నాయి. నిర్మాతల్ని ముందు నుంచి అడ్డుకుంటున్న వర్గాలు మళ్లీ గొడవకు దిగాయి. సెటిల్మెంట్ కోసం పట్టుబట్టాయి. రెండు మూడు రోజులుగా ఈ రగడ నడుస్తోంది. ఒక దశలో సినిమా అనుకున్నట్లుగా విడుదలయ్యే అవకాశాలు లేవని కూడా వార్తలొచ్చాయి. కానీ కోలీవుడ్ పెద్దలు రంగంలోకి దిగి వివాదాన్ని సెటిల్ చేసినట్లున్నారు. గురువారం సాయంత్రం సమస్య పరిష్కారమైనట్లు ఇరు వర్గాల నుంచి ఉమ్మడిగా ప్రకటన వచ్చింది.

తెలుగులో సంక్రాంతికి రిలీజైన ‘క్రాక్’ సినిమాను కూడా ఇలాంటి వివాదమే వెంటాడింది. కానీ ముందు సమస్యను పరిష్కరించుకోలేదు. రిలీజ్ రోజు గొడవ మొదలై సెకండ్ షోలకు కానీ బొమ్మ పడలేదు. కానీ ‘నెంజం మరప్పుదిల్లై’ విషయంలో ముందు రోజే ఇష్యూ సెటిలైపోయింది. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. రెజీనా, నందిత శ్వేత కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను త్వరలోనే తెలుగులో కూడా రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.

This post was last modified on March 5, 2021 6:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మగాళ్లను కుక్కలతో పోల్చిన నటి

కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…

8 hours ago

`పీపీపీ`కి కేంద్రం అండ‌… బాబుకు భ‌రోసా… !

ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…

9 hours ago

మిథున్ రెడ్డి ఆస్తులు ఎలా పెరిగాయ్.. హాట్ టాపిక్..!

వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…

10 hours ago

లేడీ డైరెక్టర్ వేసిన డేరింగ్ స్టెప్

టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…

13 hours ago

ఎవరెస్ట్ బరువు మోస్తున్న మారుతీ సాబ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…

14 hours ago

రవితేజ వారి ‘మంచు’ పంచ్ చూశారా?

ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…

14 hours ago