ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి.. కెరీర్ ఆరంభంలో వరుసగా సూపర్ హిట్లు ఇచ్చిన నటుడు రాజ్ తరుణ్. అతడి తొలి చిత్రం ‘ఉయ్యాల జంపాల’తో పాటు.. మలి చిత్రాలు ‘సినిమా చూపిస్త మావ’, ‘కుమారి 21 ఎఫ్’ ఎంత పెద్ద విజయం సాధించాయో తెలిసిందే. కానీ ఆ విజయాల్ని నిలబెట్టుకపోయాడు రాజ్.
హడావుడిగా ఏ సినిమా పడితే ఆ సినిమా చేసేసి కెరీర్ను దెబ్బ తీసుకున్నాడు. మళ్లీ ఓ మంచి హిట్టు కొట్టి కెరీర్ను గాడిన పెట్టుకోవాలని చూస్తున్నాడు కానీ.. ఆ విజయమే దక్కట్లేదు. గత ఏడాది అతను నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమా ఓటీటీలో రిలీజవడంతో దాని ఫలితం పై ఒక అంచనాకు రాలేని పరిస్థితి. ఆ సినిమా తీసిన విజయ్ కుమార్ కొండాతోనే ఇప్పుడు ‘పవర్ ప్లే’ అనే సినిమాలో నటించాడు. శుక్రవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
ఐతే రాజ్కు సరైన విజయాలు లేకున్నా అవకాశాలకైతే లోటు లేదు. కొత్తగా అతను రెండు సినిమాల్లో నటిస్తుండటం విశేషం. వీటితో పాటు మరో రెండు కొత్త చిత్రాలు కూడా కమిటయ్యాడట. ఆ చిత్రాల విశేషాలను మీడియాతో పంచుకున్నాడు రాజ్. ఇంతకుముందు తనతో ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమా తీసిన శ్రీనివాస్ గవిరెడ్డితో రాజ్ మరోసారి జట్టు కట్టాడు. వీరి కలయికలో తెరకెక్కుతున్న సినిమా పూర్తి కావచ్చిందట. అలాగే తన తొలి చిత్ర దర్శకుడు విరించి వర్మతో మరో సినిమా చేస్తున్నానని.. అది 60 శాతం పూర్తయిందని రాజ్ వెల్లడించాడు.
ఇవి కాక శాంటో అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేయనున్నానని.. అలాగే విజయ్ కుమార్ కొండాతోనూ మరో సినిమా ఉంటుందని చెప్పాడు. హిందీలో విజయవంతం అయిన ‘డ్రీమ్ గర్ల్’ రీమేక్ కోసం తామిద్దరం మళ్లీ కలుస్తున్నట్లు అతను తెలిపాడు. హిందీలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బేనర్లో ఈ సినిమా చేయనున్నట్లు రాజ్ వెల్లడించాడు.
This post was last modified on March 5, 2021 11:41 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…