ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి.. కెరీర్ ఆరంభంలో వరుసగా సూపర్ హిట్లు ఇచ్చిన నటుడు రాజ్ తరుణ్. అతడి తొలి చిత్రం ‘ఉయ్యాల జంపాల’తో పాటు.. మలి చిత్రాలు ‘సినిమా చూపిస్త మావ’, ‘కుమారి 21 ఎఫ్’ ఎంత పెద్ద విజయం సాధించాయో తెలిసిందే. కానీ ఆ విజయాల్ని నిలబెట్టుకపోయాడు రాజ్.
హడావుడిగా ఏ సినిమా పడితే ఆ సినిమా చేసేసి కెరీర్ను దెబ్బ తీసుకున్నాడు. మళ్లీ ఓ మంచి హిట్టు కొట్టి కెరీర్ను గాడిన పెట్టుకోవాలని చూస్తున్నాడు కానీ.. ఆ విజయమే దక్కట్లేదు. గత ఏడాది అతను నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమా ఓటీటీలో రిలీజవడంతో దాని ఫలితం పై ఒక అంచనాకు రాలేని పరిస్థితి. ఆ సినిమా తీసిన విజయ్ కుమార్ కొండాతోనే ఇప్పుడు ‘పవర్ ప్లే’ అనే సినిమాలో నటించాడు. శుక్రవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
ఐతే రాజ్కు సరైన విజయాలు లేకున్నా అవకాశాలకైతే లోటు లేదు. కొత్తగా అతను రెండు సినిమాల్లో నటిస్తుండటం విశేషం. వీటితో పాటు మరో రెండు కొత్త చిత్రాలు కూడా కమిటయ్యాడట. ఆ చిత్రాల విశేషాలను మీడియాతో పంచుకున్నాడు రాజ్. ఇంతకుముందు తనతో ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమా తీసిన శ్రీనివాస్ గవిరెడ్డితో రాజ్ మరోసారి జట్టు కట్టాడు. వీరి కలయికలో తెరకెక్కుతున్న సినిమా పూర్తి కావచ్చిందట. అలాగే తన తొలి చిత్ర దర్శకుడు విరించి వర్మతో మరో సినిమా చేస్తున్నానని.. అది 60 శాతం పూర్తయిందని రాజ్ వెల్లడించాడు.
ఇవి కాక శాంటో అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేయనున్నానని.. అలాగే విజయ్ కుమార్ కొండాతోనూ మరో సినిమా ఉంటుందని చెప్పాడు. హిందీలో విజయవంతం అయిన ‘డ్రీమ్ గర్ల్’ రీమేక్ కోసం తామిద్దరం మళ్లీ కలుస్తున్నట్లు అతను తెలిపాడు. హిందీలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బేనర్లో ఈ సినిమా చేయనున్నట్లు రాజ్ వెల్లడించాడు.
This post was last modified on March 5, 2021 11:41 am
చిన్న సినిమా వెనుక అగ్ర నిర్మాతలు, హీరోలు ఉండటం వాటికి చాలా పెద్ద బలమవుతుంది. బలగంలో ఎంత గొప్ప కంటెంట్…
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…