మలయాళ సినిమా దృశ్యం-2లో చడీచప్పుడు లేకుండా విడుదలైంది. ప్రేక్షకుల అంచనాలు మించిపోయి అద్భుత స్పందన రాబట్టుకుంది. కొన్ని రోజులకే తెలుగు రీమేక్ ఖరారైపోయింది. ఇంతలోనే సినిమా పట్టాలెక్కేసింది. మంగళవారమే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 5 నుంచే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా కాస్ట్ అండ్ క్రూ గురించి కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఈ చిత్రంలో వెంకీ సరసన మీనానే నటించనుండగా.. చిన్నమ్మాయిగా ఒరిజినల్లో నటించిన ఎస్తేర్ అనిలే కనిపించనుంది. పెద్దమ్మాయి పాత్రకు కొత్త నటిని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దృశ్యంలో కృతిక జయకుమార్ ఆ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఒక తెలుగు దృశ్యంలో కీలక పాత్రల్లో కనిపించిన నదియా, నరేష్.. దృశ్యం-2లోనూ నటించనున్నారు.
ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. ఆశ్చర్యకరంగా అనూప్ రూబెన్స్ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. ఒకప్పుడు పెద్ద సినిమాలతో కొన్నేళ్ల పాటు హవా నడిపించిన అనూప్.. కొంత కాలంగా అంతగా ఫామ్లో లేడు. మధ్యలో ఒకట్రెండేళ్లు అతను కనిపించకుండా పోయాడు. ఈ మధ్య 30 రోజుల్లో ప్రేమించడం ఎలా లాంటి చిన్న సినిమాతో పర్వాలేదనిపించాడు. అతణ్ని ఇలాంటి థ్రిల్లర్ మూవీకి ఎంపిక చేయడం విశేషమే. మరి బ్యాగ్రౌండ్ స్కోర్ కీలకం అయిన ఈ సినిమా కోసం అనూప్ ఎలాంటి ఔట్ పుట్ ఇస్తాడో చూడాలి.
దృశ్యం-2 ఒరిజినల్ను నిర్మించిన ఆంటోనీ పెరుంబవూర్ తెలుగు వెర్షన్లోనూ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఆయనతో కలిసి సురేష్ బాబు, రాజ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. జూన్ నెలలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తున్నారు. నెలన్నరలో షూటింగ్ పూర్తి చేస్తారట.
This post was last modified on March 3, 2021 11:10 am
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఎన్నికల గుర్తుల కేటాయింపు విషయంలో కొంత రిలీఫ్ దక్కింది. కానీ, ఇదేసమయంలో కూటమి పార్టీల…
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బయోపిక్ కి రంగం సిద్ధమవుతోంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్ వాలా భారీ బడ్జెట్…
వరుసగా ఫెయిల్యూర్లు ఎదురవుతున్నప్పటికీ టాలీవుడ్లో విజయ్ దేవరకొండ జోరైతే ఏమీ తగ్గట్లేదు. అతడితో సినిమా చేయడానికి దర్శకులు, నిర్మాతలు బాగానే…
వైసీపీ అధినేత, సీఎం జగన్కు ఆయన సోదరి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల లేఖ సంధించారు. దీని లో…
టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైం క్లాసిక్స్ గా ప్రత్యేకమైన చోటు దక్కించుకునే అల్లూరి సీతారామరాజు ఇవాళ 50 వసంతంలోకి అడుగు…
గౌతమీపుత్ర శాతకర్ణి ద్వారా పీరియాడిక్ సినిమాలను తాను ఎంత బాగా డీల్ చేయగలనో నిరూపించుకున్నాక దర్శకుడు క్రిష్ రూటే మారిపోయింది.…