మలయాళ సినిమా దృశ్యం-2లో చడీచప్పుడు లేకుండా విడుదలైంది. ప్రేక్షకుల అంచనాలు మించిపోయి అద్భుత స్పందన రాబట్టుకుంది. కొన్ని రోజులకే తెలుగు రీమేక్ ఖరారైపోయింది. ఇంతలోనే సినిమా పట్టాలెక్కేసింది. మంగళవారమే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 5 నుంచే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా కాస్ట్ అండ్ క్రూ గురించి కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఈ చిత్రంలో వెంకీ సరసన మీనానే నటించనుండగా.. చిన్నమ్మాయిగా ఒరిజినల్లో నటించిన ఎస్తేర్ అనిలే కనిపించనుంది. పెద్దమ్మాయి పాత్రకు కొత్త నటిని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దృశ్యంలో కృతిక జయకుమార్ ఆ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఒక తెలుగు దృశ్యంలో కీలక పాత్రల్లో కనిపించిన నదియా, నరేష్.. దృశ్యం-2లోనూ నటించనున్నారు.
ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. ఆశ్చర్యకరంగా అనూప్ రూబెన్స్ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. ఒకప్పుడు పెద్ద సినిమాలతో కొన్నేళ్ల పాటు హవా నడిపించిన అనూప్.. కొంత కాలంగా అంతగా ఫామ్లో లేడు. మధ్యలో ఒకట్రెండేళ్లు అతను కనిపించకుండా పోయాడు. ఈ మధ్య 30 రోజుల్లో ప్రేమించడం ఎలా లాంటి చిన్న సినిమాతో పర్వాలేదనిపించాడు. అతణ్ని ఇలాంటి థ్రిల్లర్ మూవీకి ఎంపిక చేయడం విశేషమే. మరి బ్యాగ్రౌండ్ స్కోర్ కీలకం అయిన ఈ సినిమా కోసం అనూప్ ఎలాంటి ఔట్ పుట్ ఇస్తాడో చూడాలి.
దృశ్యం-2 ఒరిజినల్ను నిర్మించిన ఆంటోనీ పెరుంబవూర్ తెలుగు వెర్షన్లోనూ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఆయనతో కలిసి సురేష్ బాబు, రాజ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. జూన్ నెలలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తున్నారు. నెలన్నరలో షూటింగ్ పూర్తి చేస్తారట.
This post was last modified on March 3, 2021 11:10 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…