బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో డిజాస్టర్. ఆ తర్వాత చేసిన రాధేశ్యామ్ మీద అంతగా అంచనాల్లేవు. దీంతో ప్రభాస్ స్టార్డమ్ పడిపోతోందన్న వ్యాఖ్యలు మొదలయ్యాయి. కానీ ఆ తర్వాత మూడు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులతో అందరి దృష్టినీ తన వైపు తిప్పుకున్నాడు యంగ్ రెబల్ స్టార్. వీటిలో ముందుగా ప్రకటించి చివరగా మొదలు కానున్న సినిమా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయబోయేదే.
ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ ప్రభాస్ అభిమానులను ఊరిస్తున్నాడు నాగ్ అశ్విన్. తన నిర్మాణంలో తెరకెక్కిన జాతిరత్నాలు సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇచ్చిన ఓ వీడియో ఇంటర్వ్యూ సందర్భంగా అశ్విన్.. ప్రభాస్తో తాను చేయబోయే సినిమా గురించి మాట్లాడాడు.
ఈ సినిమాలో ప్రభాస్ను నెవర్ బిఫోర్ లుక్లో చూడొచ్చని అశ్విన్ చెప్పాడు. ప్రభాస్ పోష్ లుక్లో కనిపిస్తాడని కూడా సంకేతాలిచ్చాడు. ప్రభాస్తో తాను చేయబోయే చిత్రం అంతర్జాతీయ సినిమాలకు ఏమాత్రం తగ్గని రీతిలో ఉంటుందన్నాడు. ఈ సినిమాలో ప్రభాస్తో పాటు దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద తారలు నటిస్తున్నప్పటికీ.. వాళ్లను మించిన ఆకర్షణలో ఈ సినిమా కథలో ఉన్నాయని అశ్విన్ తెలిపాడు.
ఈ సినిమా షూటింగ్ మొదలు కావడంలో ఆలస్యం అవుతుండటం గురించి స్పందిస్తే.. తాము ప్రి ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం కేటాయించే అవకాశం ప్రభాస్ కల్పించాడని చెప్పడం విశేషం. ఈ ఏడాదే ఈ చిత్ర షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నట్లు అశ్విన్ తెలిపాడు. అశ్విన్ మామ అశ్వినీదత్ వైజయంతీ మూవీస్ పతాకంపై దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించబోతుండటం విశేషం.
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…