బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో డిజాస్టర్. ఆ తర్వాత చేసిన రాధేశ్యామ్ మీద అంతగా అంచనాల్లేవు. దీంతో ప్రభాస్ స్టార్డమ్ పడిపోతోందన్న వ్యాఖ్యలు మొదలయ్యాయి. కానీ ఆ తర్వాత మూడు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులతో అందరి దృష్టినీ తన వైపు తిప్పుకున్నాడు యంగ్ రెబల్ స్టార్. వీటిలో ముందుగా ప్రకటించి చివరగా మొదలు కానున్న సినిమా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయబోయేదే.
ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ ప్రభాస్ అభిమానులను ఊరిస్తున్నాడు నాగ్ అశ్విన్. తన నిర్మాణంలో తెరకెక్కిన జాతిరత్నాలు సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇచ్చిన ఓ వీడియో ఇంటర్వ్యూ సందర్భంగా అశ్విన్.. ప్రభాస్తో తాను చేయబోయే సినిమా గురించి మాట్లాడాడు.
ఈ సినిమాలో ప్రభాస్ను నెవర్ బిఫోర్ లుక్లో చూడొచ్చని అశ్విన్ చెప్పాడు. ప్రభాస్ పోష్ లుక్లో కనిపిస్తాడని కూడా సంకేతాలిచ్చాడు. ప్రభాస్తో తాను చేయబోయే చిత్రం అంతర్జాతీయ సినిమాలకు ఏమాత్రం తగ్గని రీతిలో ఉంటుందన్నాడు. ఈ సినిమాలో ప్రభాస్తో పాటు దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద తారలు నటిస్తున్నప్పటికీ.. వాళ్లను మించిన ఆకర్షణలో ఈ సినిమా కథలో ఉన్నాయని అశ్విన్ తెలిపాడు.
ఈ సినిమా షూటింగ్ మొదలు కావడంలో ఆలస్యం అవుతుండటం గురించి స్పందిస్తే.. తాము ప్రి ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం కేటాయించే అవకాశం ప్రభాస్ కల్పించాడని చెప్పడం విశేషం. ఈ ఏడాదే ఈ చిత్ర షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నట్లు అశ్విన్ తెలిపాడు. అశ్విన్ మామ అశ్వినీదత్ వైజయంతీ మూవీస్ పతాకంపై దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించబోతుండటం విశేషం.
This post was last modified on March 2, 2021 10:19 am
తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…
తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని…
బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…
ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల నాటికి 4 నియోజకవర్గాలు చేజారి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.…
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…