టాలీవుడ్ లేటెస్ట్ నాన్-బాహుబలి హిట్ ‘అల వైకుంఠపురములో’ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా ‘పుష్ప’. దీని కంటే ముందు నాన్-బాహుబలి హిట్గా ఉన్న ‘రంగస్థలం’ తర్వాత సుకుమార్ చేస్తున్న చిత్రం కూడా ఇదే. ఇక ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పేదేముంది? టైటిల్, ఫస్ట్ లుక్తోనే సుకుమార్ ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెంచేశాడు. ఈ మధ్యే వచ్చిన రిలీజ్ డేట్ పోస్టర్ సైతం ఆసక్తిని ఇంకా పెంచింది. ఇక ఈ సినిమా టీజర్ ఎప్పుడు వస్తుందా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు బన్నీ-సుకుమార్ అభిమానులు.
ఐతే దానికి ముహూర్తం ఖరారైనట్లు తాజా సమాచారం. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ‘పుష్ప’ టీజర్ రిలీజ్ చేయాలని చిత్ర బృందం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసిందట. ఆగస్టు 13న సినిమా రిలీజ్ కావాల్సి ఉంది కాబట్టి బన్నీ పుట్టిన రోజుకు టీజర్ రిలీజ్ చేయడానికి పర్ఫెక్ట్ టైమింగ్ అని భావిస్తున్నారట.
ప్రస్తుతానికి టీజర్ ఎలా ఉండాలనే విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదు. ముహూర్తం మాత్రం ఖరారైంది. దానికి సంబంధించిన పని త్వరలో మొదలవుతుంది. ప్రస్తుతం సుకుమార్ తన కెరీర్లోనే అత్యంత వేగంగా ‘పుష్ప’ షూట్ సాగిస్తన్నట్లు సమాచారం. ఆగస్టు 13కు సినిమా ఫిక్స్ చేయడంతో సుకుమార్ తీవ్ర ఒత్తిడిలో పడ్డాడు. ఒకప్పట్లా మరీ సాగదీయకుండా సినిమాను చకచకా లాగించేస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే రంపచోడవరంలో రెండు షెడ్యూళ్లు జరిగాయి. హైదరాబాద్లోనూ ఓ షెడ్యూల్ చేశారు. దాదాపు సగం సినిమా పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిత్ర బృందం తమిళనాడులోని టెన్కాశిలో కొత్త షెడ్యూల్ చిత్రీకరణలో బిజీగా ఉంది. సుకుమార్ ఆ షెడ్యూల్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకుని తన కూతురి శారీ ఫంక్షన్లో పాల్గొని వెళ్లాడు. అక్కడి ఓ పల్లెటూరిలో హీరో కుటుంబానికి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది.
This post was last modified on March 1, 2021 11:03 am
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…