Movie News

వైష్ణవ్ తేజ్.. జంగిల్ బుక్

‘ఉప్పెన’ సినిమాతో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్ పంజా. ఈ సినిమా అసాధారణ విజయాన్నందుకోవడంతో వైష్ణవ్‌కు బోలెడన్ని అవకాశాలు గ్యారెంటీ అనిపిస్తోంది. అతను అప్పుడే పారితోషకం కూడా పెంచేసినట్లు చెబుతున్నారు. విశేషం ఏంటంటే.. ‘ఉప్పెన’ విడుదల కావడానికి ముందే వైష్ణవ్ హీరోగా తన రెండో సినిమాను కూడా పూర్తి చేసేశాడు.

లాక్ డౌన్ టైంలో సీనియర్ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో అతనో సినిమాలో నటించాడు. రకుల్ ప్రీత్ ఇందులో కథానాయిక. ఈ చిత్రంలోనూ వైష్ణవ్ చేసింది డీగ్లామరస్ రోలే. ఈ చిత్రం పూర్తిగా అటవీ నేపథ్యంలో సాగుతుంది. వికారాబాద్ అడవుల్లోనే షూటింగ్ మొత్తం పూర్తి చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి ఇప్పుడు టైటిల్ కూడా ఖరారు చేసినట్లు సమాచారం. ‘జంగిల్ బుక్’ అనే పాపులర్ టైటిల్‌ను ఈ సినిమా కోసం వాడుకుంటున్నారట.

రాయలసీమకు చెందిన ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి రచించిన ‘కొండపొలం’ అనే నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. దాన్ని క్రిష్ తనదైన శైలిలో చిత్రానువాదం చేసినట్లు తెలుస్తోంది. ముందు ఈ సినిమాకు ‘కొండపొలం’ అనే టైటిలే పెట్టాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆలోచన మారిందని.. క్రిష్ ‘జంగిల్ బుక్’ అనే టైటిల్‌ను దీనికి ఖరారు చేశాడని అంటున్నారు. త్వరలోనే టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తారని అంటున్నారు. క్రిష్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. తక్కువ రోజుల్లో, పరిమిత బడ్జెట్లో సినిమా పూర్తయింది.

వైష్ణవ్‌కు ఇది మరో వైవిధ్యమైన సినిమా అవుతుందని, రకుల్‌కు కూడా మంచి పేరొస్తుందని అంటున్నారు. సీనియర్ సంగీత దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. దీని తర్వాత వైష్ణవ్ తేజ్.. అక్కినేని నాగార్జున నిర్మాణంలో ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయనున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.

This post was last modified on February 28, 2021 12:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

1 hour ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

5 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

6 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

7 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

7 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

9 hours ago