Movie News

వైష్ణవ్ తేజ్.. జంగిల్ బుక్

‘ఉప్పెన’ సినిమాతో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్ పంజా. ఈ సినిమా అసాధారణ విజయాన్నందుకోవడంతో వైష్ణవ్‌కు బోలెడన్ని అవకాశాలు గ్యారెంటీ అనిపిస్తోంది. అతను అప్పుడే పారితోషకం కూడా పెంచేసినట్లు చెబుతున్నారు. విశేషం ఏంటంటే.. ‘ఉప్పెన’ విడుదల కావడానికి ముందే వైష్ణవ్ హీరోగా తన రెండో సినిమాను కూడా పూర్తి చేసేశాడు.

లాక్ డౌన్ టైంలో సీనియర్ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో అతనో సినిమాలో నటించాడు. రకుల్ ప్రీత్ ఇందులో కథానాయిక. ఈ చిత్రంలోనూ వైష్ణవ్ చేసింది డీగ్లామరస్ రోలే. ఈ చిత్రం పూర్తిగా అటవీ నేపథ్యంలో సాగుతుంది. వికారాబాద్ అడవుల్లోనే షూటింగ్ మొత్తం పూర్తి చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి ఇప్పుడు టైటిల్ కూడా ఖరారు చేసినట్లు సమాచారం. ‘జంగిల్ బుక్’ అనే పాపులర్ టైటిల్‌ను ఈ సినిమా కోసం వాడుకుంటున్నారట.

రాయలసీమకు చెందిన ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి రచించిన ‘కొండపొలం’ అనే నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. దాన్ని క్రిష్ తనదైన శైలిలో చిత్రానువాదం చేసినట్లు తెలుస్తోంది. ముందు ఈ సినిమాకు ‘కొండపొలం’ అనే టైటిలే పెట్టాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆలోచన మారిందని.. క్రిష్ ‘జంగిల్ బుక్’ అనే టైటిల్‌ను దీనికి ఖరారు చేశాడని అంటున్నారు. త్వరలోనే టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తారని అంటున్నారు. క్రిష్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. తక్కువ రోజుల్లో, పరిమిత బడ్జెట్లో సినిమా పూర్తయింది.

వైష్ణవ్‌కు ఇది మరో వైవిధ్యమైన సినిమా అవుతుందని, రకుల్‌కు కూడా మంచి పేరొస్తుందని అంటున్నారు. సీనియర్ సంగీత దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. దీని తర్వాత వైష్ణవ్ తేజ్.. అక్కినేని నాగార్జున నిర్మాణంలో ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయనున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.

This post was last modified on February 28, 2021 12:58 pm

Share

Recent Posts

`సెల్ఫీ ప్లీజ్`… అంటూ ముద్దు పెట్టేసింది!

కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుడు రాహుల్ గాంధీకి ఊహించ‌ని ఘ‌ట‌న ఎదురైంది. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న యువ‌త‌ను చేర‌దీసే ప‌నిలో ప‌డిన విష‌యం…

32 minutes ago

లిక్క‌ర్ కేసు… కారుమూరితోనే క‌థ అయిపోలేదు!

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన 3500 కోట్ల రూపాయ‌ల లిక్క‌ర్ కుంభ‌కోణం కేసు.. అనేక మ‌లుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీల‌క…

47 minutes ago

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

1 hour ago

త్రినాధ్ సంభవాన్ని తక్కువంచనా వేశారా

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…

1 hour ago

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

3 hours ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

4 hours ago