పెద్దగా అంచనాల్లేకుండా వచ్చి అనూహ్యమైన ఫలితాన్నందుకుంది ‘దృశ్యం-2’. ‘దృశ్యం’కు సీక్వెల్ అనగానే ఆ కథను పొడిగించడానికి ఇంకేముంది అనుకున్నారు. పైగా ఈ సినిమాను నెలన్నరలో పూర్తి చేసేయడం, థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడంతో దీనిపై అంచనాలు మరింత తగ్గాయి. ‘దృశ్యం’ సినిమాతో వచ్చిన పేరును క్యాష్ చేసుకోవడానికి చేసిన సినిమాలా కనిపించిందిది.
కానీ ‘దృశ్యం’కు ఏమాత్రం తీసిపోని రీతిలో ఈ చిత్రం ప్రేక్షకులను థ్రిల్ చేసి అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. అమేజాన్ ప్రైమ్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న ఇండియన్ సినిమాల్లో ఒకటిగా ‘దృశ్యం-2’ నిలవబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో జీతు జోసెఫ్ పేరు మరోసారి మార్మోగిపోయింది. ఆయన వరుసబెట్టి మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘దృశ్యం-3’ గురించి కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు జీతు.
‘దృశ్యం’ రిలీజైన టైంలో దీని సీక్వెల్ గురించి తాను ఆలోచించలేదని, అనుకోకుండా ఇప్పుడు ఆ సినిమా తీశానని.. ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచన లేకపోయినా భవిష్యత్తులో ఇలాగే ‘దృశ్యం-3’ తీసే అవకాశాలు లేకపోలేదని అన్నాడు జీతు. ఐతే కొన్ని రోజుల వ్యవధిలోనే ఆయన మాట మారిపోయింది. ఇప్పుడు తాజాగా మరో ఇంటర్వ్యూలో ‘దృశ్యం-3’ కచ్చితంగా ఉంటుందనే సంకేతాలు ఇచ్చారాయన. ‘దృశ్యం-3’కి తాను ఇప్పటికే క్లైమాక్స్ రాసేసినట్లు వెల్లడించి పెద్ద షాకే ఇచ్చాడు జీతు. కానీ ఈ సినిమా వెంటనే మాత్రం చేయబోనన్నాడు. పూర్తి స్క్రిప్టు తయారు చేయడానికి మూడేళ్లు పడుతుందని చెప్పాడు. సీక్వెల్కు ఆ మాత్రం గ్యాప్ కూడా అవసరమన్నాడు. 2025లో ‘దృశ్యం-3’ కార్యరూపం దాల్చే అవకాశమున్నట్లు చెప్పాడు.
ఐతే ‘దృశ్యం-2’ చూశాక మూడో భాగంపై భారీ అంచనాలు నెలకొనడం ఖాయం. ఆ కథ దీనికి భిన్నంగా ఏదైనా మలుపు తిరగాలి. మళ్లీ ఇదే స్టయిల్లో జార్జి కుట్టి పోలీసులను బురిడీ కొట్టిస్తే బాగుండదు. మరి ‘దృశ్యం-3’లో జీతు ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
This post was last modified on February 27, 2021 3:48 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…