సినిమా నిర్మాణం మళ్ళీ తొందర్లోనే ట్రాక్ మీదకు రానుంది. జూన్ నుంచి గవర్నమెంట్ పర్మిషన్ వస్తుందని సమాచారం. అయితే వెంటనే షూటింగ్ కి వెళ్లిపోకుండా కరోనా రహిత భారతం అయ్యే వరకు ఏమి చెయ్యాలి, అలాగే ఇన్ని రోజుల నష్టాన్ని ఎలా భర్తీ చేయాలి అనే దానిపై కసరత్తు జరగనుంది.
ఆర్టిస్టులు, టెక్నిషియన్లు పారితోషికం తగ్గించుకోవాలనేది ఒక ప్రతిపాదన. అయితే దాంతో పాటు సెట్స్ లో జరిగే వేస్ట్ ఖర్చులు తగ్గించాలని డిసైడ్ అయ్యారు. ఒక్కో ముఖ్య ఆర్టిస్ట్ కి ఒక్కో ప్రత్యేక క్యారవాన్ ఇవ్వడం ఆనవాయితీ.
కానీ ఇకపై హీరో హీరోయిన్లకి కూడా పార్టిషన్ తో కూడిన క్యారవాన్ ఇవ్వాలని, అలాగే రెండొందల మంది క్రూ పని చేసే చోట వంద మందితోనే చెయ్యాలని, దీనికి చిన్న, పెద్ద సినిమాలు అతీతం కాదని, నిర్మాతలు కొన్ని నిబంధనలు సిద్ధం చేసుకుంటున్నారు. ముందు కాస్ట్ అఫ్ ప్రొడక్షన్ తగ్గించే మార్గాలని చూసుకుని అటుపై పారితోషికాల పరంగా ఎంత కొత్త విధించాలనేది నిర్ణయిస్తారు.
This post was last modified on May 8, 2020 9:41 pm
సంక్రాంతి, దసరా లాంటి పెద్ద పండుగలను పక్కన పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజవుతున్నపుడు చిన్న సినిమాలు పోటీలో ఉండడం…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…
ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…
సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…