సినిమా నిర్మాణం మళ్ళీ తొందర్లోనే ట్రాక్ మీదకు రానుంది. జూన్ నుంచి గవర్నమెంట్ పర్మిషన్ వస్తుందని సమాచారం. అయితే వెంటనే షూటింగ్ కి వెళ్లిపోకుండా కరోనా రహిత భారతం అయ్యే వరకు ఏమి చెయ్యాలి, అలాగే ఇన్ని రోజుల నష్టాన్ని ఎలా భర్తీ చేయాలి అనే దానిపై కసరత్తు జరగనుంది.
ఆర్టిస్టులు, టెక్నిషియన్లు పారితోషికం తగ్గించుకోవాలనేది ఒక ప్రతిపాదన. అయితే దాంతో పాటు సెట్స్ లో జరిగే వేస్ట్ ఖర్చులు తగ్గించాలని డిసైడ్ అయ్యారు. ఒక్కో ముఖ్య ఆర్టిస్ట్ కి ఒక్కో ప్రత్యేక క్యారవాన్ ఇవ్వడం ఆనవాయితీ.
కానీ ఇకపై హీరో హీరోయిన్లకి కూడా పార్టిషన్ తో కూడిన క్యారవాన్ ఇవ్వాలని, అలాగే రెండొందల మంది క్రూ పని చేసే చోట వంద మందితోనే చెయ్యాలని, దీనికి చిన్న, పెద్ద సినిమాలు అతీతం కాదని, నిర్మాతలు కొన్ని నిబంధనలు సిద్ధం చేసుకుంటున్నారు. ముందు కాస్ట్ అఫ్ ప్రొడక్షన్ తగ్గించే మార్గాలని చూసుకుని అటుపై పారితోషికాల పరంగా ఎంత కొత్త విధించాలనేది నిర్ణయిస్తారు.
This post was last modified on May 8, 2020 9:41 pm
చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…
సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…
సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్కు…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. ఈ కల్తీ వ్యవహారంపై విచారణ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన..…
మెగాస్టార్ చిరంజీవి ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న, ఎంతగానో కోరుకున్న సందర్భం రానే వచ్చింది. ఆయనకు మనవడు పుట్టాడు. చిరంజీవి కుటుంబంలో…