సినిమా నిర్మాణం మళ్ళీ తొందర్లోనే ట్రాక్ మీదకు రానుంది. జూన్ నుంచి గవర్నమెంట్ పర్మిషన్ వస్తుందని సమాచారం. అయితే వెంటనే షూటింగ్ కి వెళ్లిపోకుండా కరోనా రహిత భారతం అయ్యే వరకు ఏమి చెయ్యాలి, అలాగే ఇన్ని రోజుల నష్టాన్ని ఎలా భర్తీ చేయాలి అనే దానిపై కసరత్తు జరగనుంది.
ఆర్టిస్టులు, టెక్నిషియన్లు పారితోషికం తగ్గించుకోవాలనేది ఒక ప్రతిపాదన. అయితే దాంతో పాటు సెట్స్ లో జరిగే వేస్ట్ ఖర్చులు తగ్గించాలని డిసైడ్ అయ్యారు. ఒక్కో ముఖ్య ఆర్టిస్ట్ కి ఒక్కో ప్రత్యేక క్యారవాన్ ఇవ్వడం ఆనవాయితీ.
కానీ ఇకపై హీరో హీరోయిన్లకి కూడా పార్టిషన్ తో కూడిన క్యారవాన్ ఇవ్వాలని, అలాగే రెండొందల మంది క్రూ పని చేసే చోట వంద మందితోనే చెయ్యాలని, దీనికి చిన్న, పెద్ద సినిమాలు అతీతం కాదని, నిర్మాతలు కొన్ని నిబంధనలు సిద్ధం చేసుకుంటున్నారు. ముందు కాస్ట్ అఫ్ ప్రొడక్షన్ తగ్గించే మార్గాలని చూసుకుని అటుపై పారితోషికాల పరంగా ఎంత కొత్త విధించాలనేది నిర్ణయిస్తారు.
This post was last modified on May 8, 2020 9:41 pm
తిరుమలపై మరో దుష్ప్రచారం జరగడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దుష్ప్రాచారానికి కారణం ఎవరు? ఎక్కడ నుంచి జరిగింది?…
ప్రధాన ప్రతిపక్ష హోదా కోరుకుంటున్న మాజీ సీఎం.. వైసీపీ అధినేత జగన్.. దానికి తగిన విధంగా పనిచే స్తున్నారా? అనేది…
తనపై వైసీపీ నాయకులు సహా.. ఆ పార్టీ అధినేత జగన్ చేస్తున్న విమర్శలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. క్రికెట్…
నటీనటుల నుంచి అద్భుతమైన పెర్ఫామెన్స్ రాబట్టుకోవడంలో ఇండియాలో మణిరత్నంను మించిన దర్శకుడు లేడంటే అతిశయోక్తి కాదు. మొదట్నుంచి ఆయన సినిమాలను గమనిస్తే…
దురంధర్ తర్వాత బాలీవుడ్ లో స్పై సినిమాలను చూసే దృక్పథం మారిపోయింది. నమ్మశక్యం కాని ఫైట్లు, ఫిజిక్స్ ని ఛాలెంజ్…
సహజంగా భర్త ఎంత సంపాయిస్తున్నాడో.. ఏం చేస్తున్నాడో.. తెలుసుకునేందుకు భార్యలు ఆసక్తి చూపుతారు. ఈ విషయం తెలుసుకునేందుకు వారు ఉత్సాహం…