నటుడిగా ఒకప్పుడు పెద్ద పెద్ద విజయాలే అందుకున్నాడు జేడీ చక్రవర్తి. ముఖ్యంగా 90ల్లో ‘గులాబి’, ‘అనుకోకుండా ఒక రోజు’, ‘సత్య’ లాంటి చిత్రాలతో అతను రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. హీరోగా కొంచెం డౌన్ అవుతున్న సమయంలో అతను దర్శకత్వం వైపు అడుగులేశాడు. హిందీలో దర్వాజా బంద్ రఖో.. తెలుగులో హోమం, సిద్ధం లాంటి సినిమాలు తీశాడు. ఐతే ఒక దశ దాటాక అందులోనూ పట్టు కోల్పోవడంతో జేడీ కొన్నేళ్లు బ్రేక్ తీసుకున్నాడు. మధ్యలో అనుకృతి శర్మ అనే అమ్మాయిని పెళ్లాడటం ద్వారా వార్తల్లో నిలిచిన జేడీ.. తర్వాత కనిపించకుండా పోయాడు.
ఇప్పుడతను ‘ఎంఎంఓఎఫ్’ పేరుతో ఓ సినిమా చేశాడు. ఎన్.ఎస్.సి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమా శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మీడియాను కలిసిన జేడీ.. త్వరలో తన గురువు రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో తాను దర్శకుడిగా ఓ సినిమా రాబోతున్నట్లు వెల్లడించాడు.
తన మిత్రుడైన కృష్ణవంశీ దర్శకత్వంలో ‘నక్షత్రం’ సినిమాను నిర్మించిన వేణుగోపాల్తో కలిసి రామ్ గోపాల్ వర్మ తీయబోయే చిత్రానికి తాను దర్శకత్వం వహించనున్నానని, త్వరలోనే ఆ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తానని జేడీ చెప్పాడు. అలాగే తన స్వీయ నిర్మాణంలో తెలుగు, కన్నడ భాషల్లోనూ ఓ సినిమా చేయబోతున్నట్లు జేడీ తెలిపాడు. వర్మ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.. తనకు ఒక దారి చూపించిన గురువుగా ఆయన్ని భావిస్తానని చెప్పిన జేడీ.. తన మాటలు ఆర్జీవీ తరహాలో ఉంటాయి కానీ తమ ఇద్దరి జీవితాలు పూర్తి భిన్నమన్నాడు.
కుటుంబ బంధాల మీద విషయంలో తాను చాలా ఎమోషనల్ అని, వర్మ అలాంటి వాటికి దూరంగా ఉంటాడని.. సాయంత్రం 7 గంటలైతే వర్మ ఆఫీసు పార్టీలతో కళకళలాడిపోతుందని.. తాను మాత్రం 7 తర్వాత ఎవ్వరినీ కలవనని జేడీ చెప్పాడు. ఇక ‘ఎంఎంఓఎఫ్’ సినిమా గురించి చెబుతూ.. ఇందులో మల్టీప్లెక్సుల హవా నడుస్తున్న సమయంలో సింగిల్ థియేటర్లో పాత చిత్రాలు, బిట్ సినిమాలు నడుపుకునే వ్యక్తిగా తాను కనిపిస్తానని, ఆ థియేటర్లో అనుకోకుండా హత్యలు జరిగితే ఆ వ్యక్తి జీవితం ఎలా మారిందన్నదే ఈ సినిమా అని జేడీ వెల్లడించాడు.
This post was last modified on February 25, 2021 6:50 pm
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…
ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…
అదేంటో గానీ... ఉన్న రోగానికి మందేస్తే... ఆ రోగం సంగతేమో గానీ... కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా…
మన నిర్మాతలు ఈ మధ్య బౌండరీలు దాటేసి, వేరే ఇండస్ట్రీల సూపర్ స్టార్లతో సినిమాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్…