Movie News

‘సాహో’ సుజీత్ కొత్త సినిమా ఖరారు

టాలీవుడ్ యువ దర్శకుడు సుజీత్‌ది విచిత్రమైన ప్రయాణం. ఎవరి దగ్గరా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయకుండా కేవలం షార్ట్ ఫిలిమ్స్ అనుభవంతో 24 ఏళ్ల వయసులో అతను దర్శకుడిగా అరంగేట్రం చేసేశాడు. తొలి ప్రయత్నంలోనే ‘రన్ రాజా రన్’ లాంటి సూపర్ హిట్ థ్రిల్లర్‌తో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాతో ఏకంగా ప్రభాస్‌ను డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన తొలి చిత్రం ఇదే.

తొలి సినిమాకు ఎన్నో రెట్ల బడ్జెట్లో, ఎంతో భారీగా ఈ సినిమా తీశాడు సుజీత్. కానీ ఈ చిత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది. తొలి సినిమా అందలాన్ని ఎక్కిస్తే.. రెండో సినిమా పాతాళానికి తొక్కేసింది. ‘సాహో’ రిలీజైన ఏడాదిన్నర తర్వాత కూడా తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టలేని స్థితికి చేరుకున్నాడతను. తెలుగులో ‘లూసిఫర్’ రీమేక్ అని, హిందీలో ‘ఛత్రపతి’ రీమేక్ అని.. మరొకటని సుజీత్ కొత్త సినిమా గురించి రకరకాల ప్రచారాలు జరిగాయి. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు.

ఐతే ఎట్టకేలకు సుజీత్ తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. అతను ఈసారి హిందీ సినిమా తీయబోతుండటం విశేషం. జీ స్టూడియోస్ లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థ అతడితో అసోసియేట్ అయింది. ఈ చిత్రానికి తారాగణం ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు. కానీ సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా తీయబోతున్నట్లు మాత్రం జీ స్టూడియోస్ అధికారికంగానే ప్రకటించింది. ఓ మీడియా సంస్థతో సుజీత్, జీస్టూడియోస్ సీఈవో షరీఖ్ పటేల్ మాట్లాడుతూ తమ కలయికలో సినిమా రాబోతున్నట్లు ధ్రువీకరించారు.

‘సాహో’ పూర్తి స్థాయి యాక్షన్ మూవీ అని, దాని తర్వాత తాను చేయబోయేది ఎమోషన్ మిక్స్ అయిన యాక్షన్ థ్రిల్లర్ అని సుజీత్ వెల్లడించాడు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలుపెడదామా అని ఎదురు చూస్తున్నట్లు సుజీత్ తెలిపాడు. సుజీత్ అద్భుతమైన స్క్రిప్టుతో తమను మెప్పించాడని, విజువల్‌గా ఈ సినిమా అద్భుతంగా ఉంటుందని, 2022లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని పటేల్ వెల్లడించాడు. త్వరలోనే ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ వివరాలు వెల్లడించనున్నారు.

This post was last modified on February 23, 2021 3:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తిరస్కరించిన సినిమాకు హడావిడి ఎందుకయ్యా

ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…

19 minutes ago

అప్పులు కట్టుకుంటున్న మంచు లక్ష్మీ

టాలీవుడ్లో ఘ‌న చ‌రిత్ర ఉన్న బేన‌ర్లో ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ ఒక‌టి. ఈ బేన‌ర్ మీద ప‌దుల సంఖ్య‌లో సినిమాలు తీశారు…

59 minutes ago

రెండో పెళ్లి మీద హీరోయిన్ ఆసక్తి

‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…

4 hours ago

మరోసారి కన్నీరు పెట్టిన ఎర్రబెల్లి

ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…

5 hours ago

మెరుగైన ఛాయిస్ కోసం రావిపూడి వేట

మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…

5 hours ago

సుప్రీం కోర్టు తీర్పుపై నటి తల్లి ఏమన్నారు?

24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…

6 hours ago