ఈ మధ్య కాలంలో ఇంతకంటే క్రేజీ రూమర్ ఇంకోటి లేదేమో. టాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన జూనియర్ ఎన్టీఆర్ హాలీవుడ్ అరంగేట్రానికి సిద్ధమవుతున్నట్లుగా ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోందిప్పుడు. భారతీయ మూలాలున్న హాలీవుడ్ దర్శకుడు మనోజ్ నైట్ శ్యామలన్ తాను తీయబోయే కొత్త సినిమాలో ఓ పాత్ర కోసం తారక్ను సంప్రదించినట్లుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం బయటికి రావచ్చని అంటున్నారు.
ది సిక్స్త్ సెన్స్, అన్బ్రేకబుల్, సైన్స్, స్ప్లిట్ లాంటి చిత్రాలతో హాలీవుడ్లో మనోజ్ గొప్ప పేరే సంపాదించాడు. చివరగా ఆయన్నుంచి 2019లో గ్లాస్ అనే సినిమా వచ్చింది. గత ఏడాది నుంచి ఆయన కొత్త సినిమా కోసం ప్రిపేరవుతున్నాడు. ఆ సినిమాలో తారక్కు ఓ పాత్రను ఆఫర్ చేశాడని అంటున్నారు.
ఐతే ఈ వార్త ఎంత వరకు నిజం అన్నదే సందేహంగా ఉంది. స్టార్ హీరోల అభిమానులు.. తమ కథానాయకుడి గురించి సోషల్ మీడియాలో చర్చ జరగడం కోసం ఇలాంటి రూమర్లు పుట్టించడం మామూలే. అలాగే కొందరు యాంటీ ఫ్యాన్స్ సైతం ఇలాంటి వార్తలు పుట్టించి.. ఆ హీరో అభిమానులు అతి చేశాక, అది అబద్ధమంటూ గాలి తీయడానికి కూడా ఇలాంటివి చేస్తుంటారు. కాబట్టి ఈ వార్త నిజం అనుకోవడానికి లేదు.
నిజంగా తారక్.. హాలీవుడ్ సినిమాలో నటించేట్లయితే మాత్రం అది గొప్ప విషయమే. తారక్ ఆ సినిమా చేస్తాడో లేదో అన్నది తర్వాత.. మనోజ్ లాంటి దర్శకుడు తారక్ను అడిగాడన్నా కూడా విశేషంగా చెప్పుకోవాల్సిందే. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ప్రస్తుతం తారక్ ‘ఆర్ఆర్ఆర్’ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత అతను వరుసగా త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ల దర్శకత్వంలో నటించాల్సి ఉంది. మరి హాలీవుడ్ డెబ్యూ గురించి అసలు నిజమేంటో చూద్దాం.
This post was last modified on February 22, 2021 1:37 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…