ఈ మధ్య కాలంలో ఇంతకంటే క్రేజీ రూమర్ ఇంకోటి లేదేమో. టాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన జూనియర్ ఎన్టీఆర్ హాలీవుడ్ అరంగేట్రానికి సిద్ధమవుతున్నట్లుగా ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోందిప్పుడు. భారతీయ మూలాలున్న హాలీవుడ్ దర్శకుడు మనోజ్ నైట్ శ్యామలన్ తాను తీయబోయే కొత్త సినిమాలో ఓ పాత్ర కోసం తారక్ను సంప్రదించినట్లుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం బయటికి రావచ్చని అంటున్నారు.
ది సిక్స్త్ సెన్స్, అన్బ్రేకబుల్, సైన్స్, స్ప్లిట్ లాంటి చిత్రాలతో హాలీవుడ్లో మనోజ్ గొప్ప పేరే సంపాదించాడు. చివరగా ఆయన్నుంచి 2019లో గ్లాస్ అనే సినిమా వచ్చింది. గత ఏడాది నుంచి ఆయన కొత్త సినిమా కోసం ప్రిపేరవుతున్నాడు. ఆ సినిమాలో తారక్కు ఓ పాత్రను ఆఫర్ చేశాడని అంటున్నారు.
ఐతే ఈ వార్త ఎంత వరకు నిజం అన్నదే సందేహంగా ఉంది. స్టార్ హీరోల అభిమానులు.. తమ కథానాయకుడి గురించి సోషల్ మీడియాలో చర్చ జరగడం కోసం ఇలాంటి రూమర్లు పుట్టించడం మామూలే. అలాగే కొందరు యాంటీ ఫ్యాన్స్ సైతం ఇలాంటి వార్తలు పుట్టించి.. ఆ హీరో అభిమానులు అతి చేశాక, అది అబద్ధమంటూ గాలి తీయడానికి కూడా ఇలాంటివి చేస్తుంటారు. కాబట్టి ఈ వార్త నిజం అనుకోవడానికి లేదు.
నిజంగా తారక్.. హాలీవుడ్ సినిమాలో నటించేట్లయితే మాత్రం అది గొప్ప విషయమే. తారక్ ఆ సినిమా చేస్తాడో లేదో అన్నది తర్వాత.. మనోజ్ లాంటి దర్శకుడు తారక్ను అడిగాడన్నా కూడా విశేషంగా చెప్పుకోవాల్సిందే. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ప్రస్తుతం తారక్ ‘ఆర్ఆర్ఆర్’ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత అతను వరుసగా త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ల దర్శకత్వంలో నటించాల్సి ఉంది. మరి హాలీవుడ్ డెబ్యూ గురించి అసలు నిజమేంటో చూద్దాం.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…