ఉప్పెన లాంటి విభిన్నమైన సినిమాతో కథానాయకుడిగా అరంగేట్రం చేసి తన ప్రత్యేకతను చాటుకున్నాడు వైష్ణవ్ తేజ్. అతను చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్లకు చిన్న మేనల్లుడు.. సాయిధరమ్ తేజ్కు తమ్ముడు అన్న సంగతి తెలిసిందే. మెగా వారసత్వాన్ని నిలబెడుతూ అతను తొలి సినిమాలో అన్ని రకాలుగా మెప్పించాడు. చిన్నతనంలోనే చిరు సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఓ కీలక పాత్రతో ఆకట్టుకున్న వైష్ణవ్ ఇప్పుడు హీరోగానూ తొలి సినిమాలో సత్తా చాటాడు.
మైత్రీ లాంటి పెద్ద బేనర్లో అతడి తొలి సినిమా కుదరడంలో మెగా ఫ్యామిలీ బ్యాకప్ లేకుండా ఏమీ లేదు. ముందు నుంచే వైష్ణవ్ను హీరోగా తయారు చేయడంలో పవన్ కళ్యాణ్, ఉప్పెన కథను మళ్లీ మళ్లీ విని అంతా ఓకే అనుకున్నాకే వైష్ణవ్ తొలి చిత్రానికి పచ్చ జెండా ఊపడంలో చిరు కీలక పాత్రే పోషించారట. ఈ విషయాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఉప్పెన విజయోత్సవ వేడుకలో వెల్లడించడం విశేషం.
వైష్ణవ్ హీరో కావడంలో చిరు, పవన్ అందించిన ప్రోత్సాహం అంతా ఇంతా కాదని చరణ్ చెప్పాడు. వైష్ణవ్ను హీరోగా సిద్ధం చేయడంలో పవన్ పాత్ర కీలకం అన్నాడు. అతణ్ని విదేశాలకు పంపి మరీ పలు రకాలుగా ట్రైనింగ్ ఇప్పించి హీరో కావడానికి సర్వ సన్నద్ధం చేయించింది పవనే అని చరణ్ తెలిపాడు. ఇక చిరు అందించిన ప్రోత్సాహం గురించి వివరిస్తూ ఉప్పెన కథను ఆయన నాలుగు సార్లు విని, అవసరమైన కరెక్షన్లు చెప్పారన్నాడు. అలాగే నిర్మాతలకు కూడా ఆయన ఎంతో అండగా నిలిచారన్నాడు.
తన సినిమాలకు కూడా ఎప్పుడూ లేనంతగా ఉప్పెన కోసం చిరు సమయం కేటాయించినట్లు చరణ్ వెల్లడించాడు. ఆ ఇద్దరి ప్రోత్సాహం ఉండటం వైష్ణవ్ అదృష్టం అని, అలాగే తామందరి కెరీర్ల వెనుక చిరు, పవన్ ఉండటం తాము చేసుకున్న అదృష్టమని చరణ్ ఉద్వేగంగా చెప్పాడు.
This post was last modified on February 18, 2021 8:02 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…