తమిళం, హిందీ భాషల్లో పేరున్న సినిమాల్లో నటించిన మలయాళ లెజెండరీ యాక్టర్ మోహన్ లాల్ కొన్నేళ్ల కిందటి వరకు తెలుగులో మాత్రం నటించలేదు. ‘గాండీవం’లో ఒక పాటలో మెరిశాడు తప్పితే ఇక్కడ ఎలాంటి పాత్రనూ చేయలేదు. ఐతే ఆశ్చర్యకరంగా 2016లో ఆయన ఒకేసారి రెండు తెలుగు చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించి ఆశ్చర్యపరిచారు. అందులో ఒకటి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నటించిన ‘మనమంతా’. ఇంకోటి కొరటాల శివ రూపొందించిన ‘జనతా గ్యారేజ్’.
‘మనమంతా’ మంచి సినిమానే అయినా కొన్ని కారణాల వల్ల సరిగా ఆడలేదు. కానీ ‘జనతా గ్యారేజ్’ మాత్రం బ్లాక్బస్టర్ అయింది. ఆ సినిమాకు లాల్ పెద్ద బలంగా నిలిచాడు. హీరో పాత్రను మించి అందులో లాల్ పాత్ర హైలైట్ కావడం విశేషం. లాల్ను మరిన్ని తెలుగు సినిమాల్లో చూడాలని మనవాళ్లు ఆశించారు కానీ.. ఆయన మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. ఐతే కొంచెం గ్యాప్ తర్వాత మోహన్ లాల్ మళ్లీ తెలుగులో ఓ భారీ చిత్రంలో నటించే అవకాశాలున్నట్లు సమాచారం.
‘జనతా గ్యారేజ్’తో లాల్కు తెలుగులో మంచి అనుభవాన్నిచ్చిన కొరటాల శివనే మరోసారి ఆయనతో ఇక్కడ సినిమా చేయించే ప్రయత్నం చేస్తున్నాడట. ప్రస్తుతం ‘ఆచార్య’ పనిలో బిజీగా ఉన్న కొరటాల.. దీని తర్వాత చేయాల్సిన అల్లు అర్జున్ సినిమా కోసం కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశాలున్నాయి. పొలిటికల్ టచ్ ఉన్న ఈ సోషల్ మూవీలో ముఖ్యమంత్రి పాత్ర కీలకంగా ఉంటుందట. ఆ పాత్రను లాల్తో చేయించాలనే కొరటాల పట్టుదలతో ఉన్నాడట.
లాల్తో సంప్రదింపులు జరుపుతున్నాడని, ఈ సినిమాకు ఆయన అంగీకరించే అవకాశాలే ఎక్కువ అని అంటున్నారు. కొరటాల మిత్రుడైన సుధాకర్ మిక్కిలినేని అనే కొత్త నిర్మాత ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నాడు. 2022 ఆరంభంలో ఈ చిత్రం విడుదలవుతుందని అనౌన్స్మెంట్ టైంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ‘పుష్ప’ను పూర్తి చేసి ఈ సినిమా మీదికి రావాలని బన్నీ చూస్తున్నాడు.
This post was last modified on February 14, 2021 7:57 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…