తమిళం, హిందీ భాషల్లో పేరున్న సినిమాల్లో నటించిన మలయాళ లెజెండరీ యాక్టర్ మోహన్ లాల్ కొన్నేళ్ల కిందటి వరకు తెలుగులో మాత్రం నటించలేదు. ‘గాండీవం’లో ఒక పాటలో మెరిశాడు తప్పితే ఇక్కడ ఎలాంటి పాత్రనూ చేయలేదు. ఐతే ఆశ్చర్యకరంగా 2016లో ఆయన ఒకేసారి రెండు తెలుగు చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించి ఆశ్చర్యపరిచారు. అందులో ఒకటి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నటించిన ‘మనమంతా’. ఇంకోటి కొరటాల శివ రూపొందించిన ‘జనతా గ్యారేజ్’.
‘మనమంతా’ మంచి సినిమానే అయినా కొన్ని కారణాల వల్ల సరిగా ఆడలేదు. కానీ ‘జనతా గ్యారేజ్’ మాత్రం బ్లాక్బస్టర్ అయింది. ఆ సినిమాకు లాల్ పెద్ద బలంగా నిలిచాడు. హీరో పాత్రను మించి అందులో లాల్ పాత్ర హైలైట్ కావడం విశేషం. లాల్ను మరిన్ని తెలుగు సినిమాల్లో చూడాలని మనవాళ్లు ఆశించారు కానీ.. ఆయన మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. ఐతే కొంచెం గ్యాప్ తర్వాత మోహన్ లాల్ మళ్లీ తెలుగులో ఓ భారీ చిత్రంలో నటించే అవకాశాలున్నట్లు సమాచారం.
‘జనతా గ్యారేజ్’తో లాల్కు తెలుగులో మంచి అనుభవాన్నిచ్చిన కొరటాల శివనే మరోసారి ఆయనతో ఇక్కడ సినిమా చేయించే ప్రయత్నం చేస్తున్నాడట. ప్రస్తుతం ‘ఆచార్య’ పనిలో బిజీగా ఉన్న కొరటాల.. దీని తర్వాత చేయాల్సిన అల్లు అర్జున్ సినిమా కోసం కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశాలున్నాయి. పొలిటికల్ టచ్ ఉన్న ఈ సోషల్ మూవీలో ముఖ్యమంత్రి పాత్ర కీలకంగా ఉంటుందట. ఆ పాత్రను లాల్తో చేయించాలనే కొరటాల పట్టుదలతో ఉన్నాడట.
లాల్తో సంప్రదింపులు జరుపుతున్నాడని, ఈ సినిమాకు ఆయన అంగీకరించే అవకాశాలే ఎక్కువ అని అంటున్నారు. కొరటాల మిత్రుడైన సుధాకర్ మిక్కిలినేని అనే కొత్త నిర్మాత ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నాడు. 2022 ఆరంభంలో ఈ చిత్రం విడుదలవుతుందని అనౌన్స్మెంట్ టైంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ‘పుష్ప’ను పూర్తి చేసి ఈ సినిమా మీదికి రావాలని బన్నీ చూస్తున్నాడు.
This post was last modified on February 14, 2021 7:57 pm
ఏప్రిల్ చివరి వారం అంటే పీక్ సమ్మర్.. ఈ టైంలో పెద్ద పెద్ద సినిమాలతో థియేటర్లు కళకళలాడుతుండాలి. రెండు గంటలు…
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని…