Movie News

మైత్రి వారి చిరు, ప్రభాస్ ముచ్చట్లు


మైత్రీ మూవీ మేకర్స్.. ప్రస్తుతం టాలీవుడ్లో హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్. ఈ సంస్థ స్థాయిలో టాలీవుడ్లో మరే బేనర్ కూడా సినిమాలు నిర్మించట్లేదు. క్వాలిటీ, క్వాంటిటీ.. ఇలా ఏ రకంగా చూసినా మైత్రి వారికి సాటి వచ్చే బేనర్ ఇంకోటి కనిపించడం లేదు ప్రస్తుతం. టాలీవుడ్ టాప్ స్టార్లు, డైరెక్టర్లందరితోనూ సినిమాలు చేయడానికి ఆ సంస్థ సన్నాహాలు చేస్తోంది.

ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లతో సినిమాలు చేసిన ఆ సంస్థ ఇప్పుడు అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, చిరంజీవిల సినిమాలనూ లైన్లో పెట్టేసింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు కూడా ఒకరి తర్వాత ఒకరు ఈ సంస్థలో అడుగు పెడుతున్నారు. తాజాగా ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ‘సలార్’ తర్వాత తమ సంస్థలో ఓ సినిమా ఉంటుందని మైత్రీ అధినేతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది తారక్ అభిమానులను ఎగ్జైట్ చేస్తోంది. మరోవైపు ‘ఉప్పెన’ ఆడియో వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ.. బాబీ దర్శకత్వంలో తాను చేయబోయే సినిమా మైత్రీలోనే తెరకెక్కుతుందని ధ్రువీకరించాడు.

చిరుతో చేయబోయే సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మైత్రీ అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి మాట్లాడారు. చిరు కెరీర్లో బ్లాక్‌బస్టర్లుగా నిలిచిన ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, ముఠామేస్త్రి సినిమాల ఛాయలు ఇందులో ఉంటాయని.. వింటేజ్ చిరును ఇందులో చూస్తారని వారు చెప్పారు.

నవీన్ మాట్లాడుతూ.. తనకు బేసిగ్గా కమర్షియల్ సినిమాలంటే చాలా ఇష్టమని, చిరుతో పక్కా కమర్షియల్ సినిమా చేయాలనే అనుకున్నామని, అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా చిరు ఇందులో కనిపిస్తారని అన్నారు. మరోవైపు ప్రభాస్‌తో కూడా తమ సంస్థలో ఓ సినిమా ఉంటుందని మైత్రీ అధినేతలు చెప్పారు. ఇద్దరు ముగ్గురు దర్శకులతో ప్రభాస్‌కు కథలు చెప్పిస్తున్నామని, ఈ ఏడాది చివర్లోపు ఏదో ఒక కథ ఓకే అవుతుందని.. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న మూడు సినిమాలు పూర్తి కాగానే.. తమ సంస్థలోనే అతను సినిమా చేస్తాడని నవీన్ అన్నారు. ప్రభాస్ స్థాయికి తగ్గట్లే భారీ బడ్జెట్లో పాన్ ఇండియా లెవెల్లో సినిమా ఉంటుందని కూడా వారు స్పష్టం చేశారు.

This post was last modified on February 12, 2021 7:23 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

7 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

8 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

11 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

12 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

12 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

13 hours ago