మైత్రీ మూవీ మేకర్స్.. ప్రస్తుతం టాలీవుడ్లో హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్. ఈ సంస్థ స్థాయిలో టాలీవుడ్లో మరే బేనర్ కూడా సినిమాలు నిర్మించట్లేదు. క్వాలిటీ, క్వాంటిటీ.. ఇలా ఏ రకంగా చూసినా మైత్రి వారికి సాటి వచ్చే బేనర్ ఇంకోటి కనిపించడం లేదు ప్రస్తుతం. టాలీవుడ్ టాప్ స్టార్లు, డైరెక్టర్లందరితోనూ సినిమాలు చేయడానికి ఆ సంస్థ సన్నాహాలు చేస్తోంది.
ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్లతో సినిమాలు చేసిన ఆ సంస్థ ఇప్పుడు అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, చిరంజీవిల సినిమాలనూ లైన్లో పెట్టేసింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు కూడా ఒకరి తర్వాత ఒకరు ఈ సంస్థలో అడుగు పెడుతున్నారు. తాజాగా ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ‘సలార్’ తర్వాత తమ సంస్థలో ఓ సినిమా ఉంటుందని మైత్రీ అధినేతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది తారక్ అభిమానులను ఎగ్జైట్ చేస్తోంది. మరోవైపు ‘ఉప్పెన’ ఆడియో వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ.. బాబీ దర్శకత్వంలో తాను చేయబోయే సినిమా మైత్రీలోనే తెరకెక్కుతుందని ధ్రువీకరించాడు.
చిరుతో చేయబోయే సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మైత్రీ అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి మాట్లాడారు. చిరు కెరీర్లో బ్లాక్బస్టర్లుగా నిలిచిన ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, ముఠామేస్త్రి సినిమాల ఛాయలు ఇందులో ఉంటాయని.. వింటేజ్ చిరును ఇందులో చూస్తారని వారు చెప్పారు.
నవీన్ మాట్లాడుతూ.. తనకు బేసిగ్గా కమర్షియల్ సినిమాలంటే చాలా ఇష్టమని, చిరుతో పక్కా కమర్షియల్ సినిమా చేయాలనే అనుకున్నామని, అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా చిరు ఇందులో కనిపిస్తారని అన్నారు. మరోవైపు ప్రభాస్తో కూడా తమ సంస్థలో ఓ సినిమా ఉంటుందని మైత్రీ అధినేతలు చెప్పారు. ఇద్దరు ముగ్గురు దర్శకులతో ప్రభాస్కు కథలు చెప్పిస్తున్నామని, ఈ ఏడాది చివర్లోపు ఏదో ఒక కథ ఓకే అవుతుందని.. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న మూడు సినిమాలు పూర్తి కాగానే.. తమ సంస్థలోనే అతను సినిమా చేస్తాడని నవీన్ అన్నారు. ప్రభాస్ స్థాయికి తగ్గట్లే భారీ బడ్జెట్లో పాన్ ఇండియా లెవెల్లో సినిమా ఉంటుందని కూడా వారు స్పష్టం చేశారు.
This post was last modified on February 12, 2021 7:23 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…