‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఉన్నట్లుండి సినిమా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత కూడా పెద్దగా టైం తీసుకోకుండా సినిమాను మొదలుపెట్టేశారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. రెండో షెడ్యూల్లోకి వెళ్లబోతోంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి.
ఐతే ఈ సినిమా కథాంశం పట్ల ఎప్పటికప్పుడు రకరకాల ప్రచారాలు జరుగుతుండటం చర్చనీయాంశమవుతోంది. ముందు ఈ సినిమా ప్రశాంత్ తొలి చిత్రం ‘ఉగ్రం’కు రీమేక్ అని వార్తలొచ్చాయి. ఈ ప్రచారం గట్టిగానే సాగింది. ఐతే ఈ మధ్య ప్రశాంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సలార్’ ఏ చిత్రానికీ రీమేక్ కాదనేశాడు. ఇది ప్రభాస్ కోసమే తయారైన కథ అన్నాడు. అంతటితో రీమేక్ ప్రచారానికి తెరపడిందనే అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది.
‘కేజీఎఫ్’తో సంగీత దర్శకుడిగా గొప్ప పేరు సంపాదించి.. ‘సలార్’కు మ్యూజిక్ డైరెక్టర్గా ఎంపికైన రవి బస్రార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సలార్’ సినిమా ‘ఉగ్రం’కు రీమేకే అని స్పష్టం చేశాడు. ఈ చిత్రం ‘ఉగ్రం’కు రీమేక్ అంటున్నారు కదా, దానిపై ఏమంటారు అని ఓ యూట్యూబ్ ఛానెల్లో ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే.. ‘‘అది అందరికీ తెలిసిన విషయమే కదా’’ అనేశాడు రవి. దానికి కొనసాగింపుగా మాట్లాడుతూ.. ‘‘ఐతే ఈ సినిమాను ఇతనెలా (ప్రభాస్) చేస్తాడో చూడాలి’’ అన్నాడు.
రవి ఇంత క్యాజువల్గా ‘సలార్’ సినిమా ‘ఉగ్రం’కు రీమేక్ అనేయడంతో ప్రశాంత్ ఎందుకు అలా చెప్పాడనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ‘సలార్’ రేప్పొద్దున కన్నడలో సైతం విడుదలవుతుంది. అప్పుడైనా ‘ఉగ్రం’కు రీమేక్ అని తెలియకుండా ఉంటుందా.. అప్పుడు చూసిన సినిమానే మళ్లీ ప్రభాస్ హీరోగా చూస్తే కన్నడ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది ప్రశ్నార్థకం. బహుశా ‘ఉగ్రం’ ప్లాట్ తీసుకుని దాన్ని ప్రభాస్ ఇమేజ్కు తగ్గట్లుగా మార్చి పెద్ద స్కేల్లో ఈ సినిమా చేస్తుండొచ్చేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి.
This post was last modified on February 12, 2021 7:19 pm
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దాల పాటు నంబర్ వన్ హీరోగా నిలవడం కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంత…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కంగనా రనౌత్.. పరిశ్రమలో ఒక స్థాయి అందుకున్న దగ్గర్నుంచి తాను పని చేసే ఇండస్ట్రీలోనే…
రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…
ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…
స్థానిక ఎన్నికలపై జనసేన త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…