‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఉన్నట్లుండి సినిమా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత కూడా పెద్దగా టైం తీసుకోకుండా సినిమాను మొదలుపెట్టేశారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. రెండో షెడ్యూల్లోకి వెళ్లబోతోంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి.
ఐతే ఈ సినిమా కథాంశం పట్ల ఎప్పటికప్పుడు రకరకాల ప్రచారాలు జరుగుతుండటం చర్చనీయాంశమవుతోంది. ముందు ఈ సినిమా ప్రశాంత్ తొలి చిత్రం ‘ఉగ్రం’కు రీమేక్ అని వార్తలొచ్చాయి. ఈ ప్రచారం గట్టిగానే సాగింది. ఐతే ఈ మధ్య ప్రశాంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సలార్’ ఏ చిత్రానికీ రీమేక్ కాదనేశాడు. ఇది ప్రభాస్ కోసమే తయారైన కథ అన్నాడు. అంతటితో రీమేక్ ప్రచారానికి తెరపడిందనే అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది.
‘కేజీఎఫ్’తో సంగీత దర్శకుడిగా గొప్ప పేరు సంపాదించి.. ‘సలార్’కు మ్యూజిక్ డైరెక్టర్గా ఎంపికైన రవి బస్రార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సలార్’ సినిమా ‘ఉగ్రం’కు రీమేకే అని స్పష్టం చేశాడు. ఈ చిత్రం ‘ఉగ్రం’కు రీమేక్ అంటున్నారు కదా, దానిపై ఏమంటారు అని ఓ యూట్యూబ్ ఛానెల్లో ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే.. ‘‘అది అందరికీ తెలిసిన విషయమే కదా’’ అనేశాడు రవి. దానికి కొనసాగింపుగా మాట్లాడుతూ.. ‘‘ఐతే ఈ సినిమాను ఇతనెలా (ప్రభాస్) చేస్తాడో చూడాలి’’ అన్నాడు.
రవి ఇంత క్యాజువల్గా ‘సలార్’ సినిమా ‘ఉగ్రం’కు రీమేక్ అనేయడంతో ప్రశాంత్ ఎందుకు అలా చెప్పాడనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ‘సలార్’ రేప్పొద్దున కన్నడలో సైతం విడుదలవుతుంది. అప్పుడైనా ‘ఉగ్రం’కు రీమేక్ అని తెలియకుండా ఉంటుందా.. అప్పుడు చూసిన సినిమానే మళ్లీ ప్రభాస్ హీరోగా చూస్తే కన్నడ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది ప్రశ్నార్థకం. బహుశా ‘ఉగ్రం’ ప్లాట్ తీసుకుని దాన్ని ప్రభాస్ ఇమేజ్కు తగ్గట్లుగా మార్చి పెద్ద స్కేల్లో ఈ సినిమా చేస్తుండొచ్చేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి.
This post was last modified on February 12, 2021 7:19 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…