‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఉన్నట్లుండి సినిమా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత కూడా పెద్దగా టైం తీసుకోకుండా సినిమాను మొదలుపెట్టేశారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. రెండో షెడ్యూల్లోకి వెళ్లబోతోంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి.
ఐతే ఈ సినిమా కథాంశం పట్ల ఎప్పటికప్పుడు రకరకాల ప్రచారాలు జరుగుతుండటం చర్చనీయాంశమవుతోంది. ముందు ఈ సినిమా ప్రశాంత్ తొలి చిత్రం ‘ఉగ్రం’కు రీమేక్ అని వార్తలొచ్చాయి. ఈ ప్రచారం గట్టిగానే సాగింది. ఐతే ఈ మధ్య ప్రశాంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సలార్’ ఏ చిత్రానికీ రీమేక్ కాదనేశాడు. ఇది ప్రభాస్ కోసమే తయారైన కథ అన్నాడు. అంతటితో రీమేక్ ప్రచారానికి తెరపడిందనే అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది.
‘కేజీఎఫ్’తో సంగీత దర్శకుడిగా గొప్ప పేరు సంపాదించి.. ‘సలార్’కు మ్యూజిక్ డైరెక్టర్గా ఎంపికైన రవి బస్రార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సలార్’ సినిమా ‘ఉగ్రం’కు రీమేకే అని స్పష్టం చేశాడు. ఈ చిత్రం ‘ఉగ్రం’కు రీమేక్ అంటున్నారు కదా, దానిపై ఏమంటారు అని ఓ యూట్యూబ్ ఛానెల్లో ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే.. ‘‘అది అందరికీ తెలిసిన విషయమే కదా’’ అనేశాడు రవి. దానికి కొనసాగింపుగా మాట్లాడుతూ.. ‘‘ఐతే ఈ సినిమాను ఇతనెలా (ప్రభాస్) చేస్తాడో చూడాలి’’ అన్నాడు.
రవి ఇంత క్యాజువల్గా ‘సలార్’ సినిమా ‘ఉగ్రం’కు రీమేక్ అనేయడంతో ప్రశాంత్ ఎందుకు అలా చెప్పాడనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ‘సలార్’ రేప్పొద్దున కన్నడలో సైతం విడుదలవుతుంది. అప్పుడైనా ‘ఉగ్రం’కు రీమేక్ అని తెలియకుండా ఉంటుందా.. అప్పుడు చూసిన సినిమానే మళ్లీ ప్రభాస్ హీరోగా చూస్తే కన్నడ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది ప్రశ్నార్థకం. బహుశా ‘ఉగ్రం’ ప్లాట్ తీసుకుని దాన్ని ప్రభాస్ ఇమేజ్కు తగ్గట్లుగా మార్చి పెద్ద స్కేల్లో ఈ సినిమా చేస్తుండొచ్చేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి.
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…
న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…
సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…
ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…
రాయలసీమను కూటమి ప్రభుత్వం పెట్టుబడుల సీమగా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ…