ఒక కలల కాంబినేషన్కు తెరలేచినట్లు టాలీవుడ్ సర్కిల్స్లో ఇప్పుడు హాట్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కోలీవుడ్ మెగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోందట. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడట. నిన్న రాత్రి నుంచి టాలీవుడ్ సర్కిల్స్లో, సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్.
శంకర్ తెలుగులో ఓ సినిమా చేస్తానని ఎప్పట్నుంచో అంటున్నాడు. మన హీరోలు కూడా ఆయనతో పని చేయాలని తహతహలాడిన వాళ్లే. కానీ ఇంత వరకు అది సాధ్యపడలేదు. ఎట్టకేలకు రామ్ చరణ్ శంకర్తో పని చేసే అవకాశాన్నందుకున్నాడు. కెరీర్ ఆరంభంలో తీసిన జెంటిల్మ్యాన్, ప్రేమికుడు, భారతీయుడు సినిమాలతో శంకర్ తెలుగులో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించాడు. హీరో ఎవరన్నది సంబంధం లేకుండా అతడి పేరు మీద ఇక్కడ సినిమాలు ఆడటం మొదలైంది. ‘బాయ్స్’ సినిమా తమిళంలో ఫ్లాప్ అయి తెలుగులో హిట్టవడం ఇక్కడి జనాలకు ఆయనమీదున్న అభిమానానికి నిదర్శనం.
తెలుగులో తన సినిమాల విడుదలప్పుడు ఇక్కడి ప్రేక్షకుల అభిమానం గురించి ప్రత్యేకంగా మాట్లాడుతుంటాడు శంకర్. తెలుగులో సినిమా తీస్తా అని అంటుంటాడు. ఇప్పుడు ఎట్టకేలకు ఆ హామీని నెరవేర్చబోతున్నాడు. ప్రస్తుతం శంకర్ తమిళంలో ‘ఇండియన్-2’ తీస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం మొదలై రెండున్నరేళ్లు కావస్తోంది. వివిధ కారణాలతో ఆ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. చివరగా కరోనా కారణంగా సినిమాకు బ్రేక్ పడింది. త్వరలోనే షూటింగ్ పున:ప్రారంభించి.. కొన్ని నెలల్లోనే దాన్ని పూర్తి చేసి ఆ తర్వాత రామ్ చరణ్ సినిమాను శంకర్ మొదలుపెట్టాలనుకుంటున్నట్లు సమాచారం.
This post was last modified on February 11, 2021 10:40 am
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…