ఒక కలల కాంబినేషన్కు తెరలేచినట్లు టాలీవుడ్ సర్కిల్స్లో ఇప్పుడు హాట్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కోలీవుడ్ మెగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోందట. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడట. నిన్న రాత్రి నుంచి టాలీవుడ్ సర్కిల్స్లో, సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్.
శంకర్ తెలుగులో ఓ సినిమా చేస్తానని ఎప్పట్నుంచో అంటున్నాడు. మన హీరోలు కూడా ఆయనతో పని చేయాలని తహతహలాడిన వాళ్లే. కానీ ఇంత వరకు అది సాధ్యపడలేదు. ఎట్టకేలకు రామ్ చరణ్ శంకర్తో పని చేసే అవకాశాన్నందుకున్నాడు. కెరీర్ ఆరంభంలో తీసిన జెంటిల్మ్యాన్, ప్రేమికుడు, భారతీయుడు సినిమాలతో శంకర్ తెలుగులో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించాడు. హీరో ఎవరన్నది సంబంధం లేకుండా అతడి పేరు మీద ఇక్కడ సినిమాలు ఆడటం మొదలైంది. ‘బాయ్స్’ సినిమా తమిళంలో ఫ్లాప్ అయి తెలుగులో హిట్టవడం ఇక్కడి జనాలకు ఆయనమీదున్న అభిమానానికి నిదర్శనం.
తెలుగులో తన సినిమాల విడుదలప్పుడు ఇక్కడి ప్రేక్షకుల అభిమానం గురించి ప్రత్యేకంగా మాట్లాడుతుంటాడు శంకర్. తెలుగులో సినిమా తీస్తా అని అంటుంటాడు. ఇప్పుడు ఎట్టకేలకు ఆ హామీని నెరవేర్చబోతున్నాడు. ప్రస్తుతం శంకర్ తమిళంలో ‘ఇండియన్-2’ తీస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం మొదలై రెండున్నరేళ్లు కావస్తోంది. వివిధ కారణాలతో ఆ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. చివరగా కరోనా కారణంగా సినిమాకు బ్రేక్ పడింది. త్వరలోనే షూటింగ్ పున:ప్రారంభించి.. కొన్ని నెలల్లోనే దాన్ని పూర్తి చేసి ఆ తర్వాత రామ్ చరణ్ సినిమాను శంకర్ మొదలుపెట్టాలనుకుంటున్నట్లు సమాచారం.
సంక్రాంతి తర్వాత వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్లో మళ్లీ కళ తెచ్చే సినిమా అవుతుందని అందరూ ‘పెద్ది’ మీదే ఆశలు పెట్టుకున్నారు.…
మలయాళంతో పాటు తెలుగులోనూ మంచి విజయం సాధించిన మూవీ ప్రేమలు. దీంట్లో జంటగా నటించిన నస్లెన్, మమిత బైజు ఎంత…
కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్ పట్టించుకోరని ప్రతి భాషలో రుజువవుతూనే ఉంది. మన దగ్గర బలగం,…
సాంకేతికంగా మనిషి ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. వాటిని తన జీవన విధానంలో భాగం చేసుకున్నాడు. సుఖమయ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే…
ఏపీలోని కూటమి సర్కారు ఇటీవలే నిర్వహించిన మెగా డీఎస్సీపై విపక్ష వైసీపీ బారీ అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.…
పెద్ది ప్రీమియర్ల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో క్లారిటీ వచ్చేసింది. రాత్రి 8…