ఒక కలల కాంబినేషన్కు తెరలేచినట్లు టాలీవుడ్ సర్కిల్స్లో ఇప్పుడు హాట్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కోలీవుడ్ మెగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోందట. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడట. నిన్న రాత్రి నుంచి టాలీవుడ్ సర్కిల్స్లో, సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్.
శంకర్ తెలుగులో ఓ సినిమా చేస్తానని ఎప్పట్నుంచో అంటున్నాడు. మన హీరోలు కూడా ఆయనతో పని చేయాలని తహతహలాడిన వాళ్లే. కానీ ఇంత వరకు అది సాధ్యపడలేదు. ఎట్టకేలకు రామ్ చరణ్ శంకర్తో పని చేసే అవకాశాన్నందుకున్నాడు. కెరీర్ ఆరంభంలో తీసిన జెంటిల్మ్యాన్, ప్రేమికుడు, భారతీయుడు సినిమాలతో శంకర్ తెలుగులో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించాడు. హీరో ఎవరన్నది సంబంధం లేకుండా అతడి పేరు మీద ఇక్కడ సినిమాలు ఆడటం మొదలైంది. ‘బాయ్స్’ సినిమా తమిళంలో ఫ్లాప్ అయి తెలుగులో హిట్టవడం ఇక్కడి జనాలకు ఆయనమీదున్న అభిమానానికి నిదర్శనం.
తెలుగులో తన సినిమాల విడుదలప్పుడు ఇక్కడి ప్రేక్షకుల అభిమానం గురించి ప్రత్యేకంగా మాట్లాడుతుంటాడు శంకర్. తెలుగులో సినిమా తీస్తా అని అంటుంటాడు. ఇప్పుడు ఎట్టకేలకు ఆ హామీని నెరవేర్చబోతున్నాడు. ప్రస్తుతం శంకర్ తమిళంలో ‘ఇండియన్-2’ తీస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం మొదలై రెండున్నరేళ్లు కావస్తోంది. వివిధ కారణాలతో ఆ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. చివరగా కరోనా కారణంగా సినిమాకు బ్రేక్ పడింది. త్వరలోనే షూటింగ్ పున:ప్రారంభించి.. కొన్ని నెలల్లోనే దాన్ని పూర్తి చేసి ఆ తర్వాత రామ్ చరణ్ సినిమాను శంకర్ మొదలుపెట్టాలనుకుంటున్నట్లు సమాచారం.
గత కొన్ని వారాలుగా రీ రిలీజుల ప్రహసనం మరీ ఎక్కువైపోయింది. హిట్టు ఫ్లాపు సంబంధం లేకుండా వరసబెట్టి దించేస్తున్నారు. అవి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… తన అభిమానుల విషయంలో ఏ రీతిన స్పందిస్తారన్న విషయాన్ని ఇప్పుడు…
రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం 3 స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు చాలా మంది థియేటర్లలో మిస్…
టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ…
మంచు విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప. విశేషం కేవలం…
విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…