Movie News

‘ఇండియన్-2’ను వదిలేసిన ఆ టెక్నీషియన్

సుకుమార్ ఆస్థాన టెక్నీషియన్లలో ఒకడు రత్నవేలు. ఇద్దరి ప్రయాణం ‘ఆర్య’ సినిమాతో మొదలైంది. ఆయన సినిమాలకు సంగీత బాధ్యతలు దేవిశ్రీ ప్రసాద్ చూసుకుంటే.. ఛాయాగ్రహణం రత్నవేలు చూసుకుంటాడు. ఐతే కొన్నిసార్లు మాత్రం వేరే కమిట్మెంట్ల వల్ల సుక్కుతో పని చేయలేకపోయాడు రత్నవేలు. చివరగా వీళ్లిద్దరూ కలిసి చేసిన ‘రంగస్థలం’ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఆ తర్వాత ‘పుష్ప’ సినిమా అనుకున్న ప్రకారం మొదలై ఉంటే రత్నవేలు ఈ సినిమాకు పని చేసేవాడు.

కానీ ఈలోపే ‘ఇండియన్-2’ కోసం శంకర్ పిలవడం.. ‘పుష్ప’ ఆలస్యం కావడంతో ఈ ప్రాజెక్టుకు దూరం కాక తప్పలేదు. ఐతే ఇంత త్యాగం చేసినందుకు రత్నవేలుకు ఫలితం లేకపోయింది. రెండేళ్ల పాటు రత్నవేలు ఆ సినిమా కోసం సమయం కేటాయించి, సగం సినిమా మాత్రమే పూర్తి చేసి, ఇప్పుడు దాన్నుంచి తప్పుకుని వేరే ప్రాజెక్టులోకి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తినట్లు సమాచారం.

ఎప్పుడో 2018 చివర్లో మొదలైంది ‘ఇండియన్-2’. కానీ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక అడ్డంకే. ముందు కమల్‌కు మేకప్ సెట్ కాక, ఆ తర్వాత ఆయన పొలిటికల్ కమిట్మెంట్ల వల్ల, ఆపై సెట్స్‌లో జరిగిన ప్రమాదం వల్ల.. తర్వాత కరోనా కారణంగా.. చివరగా దర్శక నిర్మాతలు, హీరో మధ్య అభిప్రాయ భేదాల వల్ల.. ఇలా రకరకాల కారణాలతో ఆ సినిమా విపరీతంగా ఆలస్యమైంది.

ఐతే ఇంకెంతో కాలం ఈ సినిమా కోసం కేటాయించలేక, ఎంతకీ పున:ప్రారంభం కాని షూటింగ్ కోసం ఎదురు చూడలేక రత్నవేలు ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ‘రోబో’ లాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో తనను భాగం చేశాడన్న గౌరవంతో ఇన్నాళ్లు ఆగిన రత్నవేలు.. ఇక తన వల్ల కాదని ఆ చిత్రానికి గుడ్ బై చెప్పేశాడట. త్వరలో అతను సూర్య సినిమాకు పని చేయనున్నాడట. కొన్ని నెలల ముందే ఈ నిర్ణయం తీసుకుని ఉంటే ఈపాటికి ‘పుష్ప’ కోసం పని చేస్తుండేవాడు రత్నవేలు.

This post was last modified on February 10, 2021 12:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

1 hour ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

4 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

7 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago