సుకుమార్ ఆస్థాన టెక్నీషియన్లలో ఒకడు రత్నవేలు. ఇద్దరి ప్రయాణం ‘ఆర్య’ సినిమాతో మొదలైంది. ఆయన సినిమాలకు సంగీత బాధ్యతలు దేవిశ్రీ ప్రసాద్ చూసుకుంటే.. ఛాయాగ్రహణం రత్నవేలు చూసుకుంటాడు. ఐతే కొన్నిసార్లు మాత్రం వేరే కమిట్మెంట్ల వల్ల సుక్కుతో పని చేయలేకపోయాడు రత్నవేలు. చివరగా వీళ్లిద్దరూ కలిసి చేసిన ‘రంగస్థలం’ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఆ తర్వాత ‘పుష్ప’ సినిమా అనుకున్న ప్రకారం మొదలై ఉంటే రత్నవేలు ఈ సినిమాకు పని చేసేవాడు.
కానీ ఈలోపే ‘ఇండియన్-2’ కోసం శంకర్ పిలవడం.. ‘పుష్ప’ ఆలస్యం కావడంతో ఈ ప్రాజెక్టుకు దూరం కాక తప్పలేదు. ఐతే ఇంత త్యాగం చేసినందుకు రత్నవేలుకు ఫలితం లేకపోయింది. రెండేళ్ల పాటు రత్నవేలు ఆ సినిమా కోసం సమయం కేటాయించి, సగం సినిమా మాత్రమే పూర్తి చేసి, ఇప్పుడు దాన్నుంచి తప్పుకుని వేరే ప్రాజెక్టులోకి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తినట్లు సమాచారం.
ఎప్పుడో 2018 చివర్లో మొదలైంది ‘ఇండియన్-2’. కానీ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక అడ్డంకే. ముందు కమల్కు మేకప్ సెట్ కాక, ఆ తర్వాత ఆయన పొలిటికల్ కమిట్మెంట్ల వల్ల, ఆపై సెట్స్లో జరిగిన ప్రమాదం వల్ల.. తర్వాత కరోనా కారణంగా.. చివరగా దర్శక నిర్మాతలు, హీరో మధ్య అభిప్రాయ భేదాల వల్ల.. ఇలా రకరకాల కారణాలతో ఆ సినిమా విపరీతంగా ఆలస్యమైంది.
ఐతే ఇంకెంతో కాలం ఈ సినిమా కోసం కేటాయించలేక, ఎంతకీ పున:ప్రారంభం కాని షూటింగ్ కోసం ఎదురు చూడలేక రత్నవేలు ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ‘రోబో’ లాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో తనను భాగం చేశాడన్న గౌరవంతో ఇన్నాళ్లు ఆగిన రత్నవేలు.. ఇక తన వల్ల కాదని ఆ చిత్రానికి గుడ్ బై చెప్పేశాడట. త్వరలో అతను సూర్య సినిమాకు పని చేయనున్నాడట. కొన్ని నెలల ముందే ఈ నిర్ణయం తీసుకుని ఉంటే ఈపాటికి ‘పుష్ప’ కోసం పని చేస్తుండేవాడు రత్నవేలు.
This post was last modified on February 10, 2021 12:10 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…