తమ హీరో సినిమాకు అత్యధిక బిజినెస్ జరగాలని, రికార్డులు బద్దలైపోవాలని ఆశిస్తుంటారు సాధారణంగా అభిమానులు. కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానుల తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ‘వకీల్ సాబ్’ బిజినెస్ పరంగా రికార్డులేమీ బద్దలు కొట్టేయొద్దని వాళ్లు కోరుకుంటున్నారు. పవన్తో సినిమా అని అత్యాశకు పోవొద్దని, రీజనబుల్ రేట్లకే అమ్మాలని నిర్మాత దిల్ రాజుకు విన్నపాలు చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదేం చిత్రం అనిపించొచ్చు కానీ.. పవన్ గత సినిమాల అనుభవాల నేపథ్యంలో వారికి ఇలా అనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు.
పవన్తో సినిమా అంటే బంగారు బాతులా భావించే నిర్మాతలు ట్రేడ్లో ఉన్న క్రేజ్ను బట్టి అయినకాడికి రేట్లకు సినిమాను అమ్మడం సర్వ సాధారణం అయిపోయింది. సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు లాంటి మామూలు సినిమాలను కూడా విపరీతమైన రేట్లకు అమ్మారు. ఇక త్రివిక్రమ్తో చేసిన క్రేజీ మూవీ ‘అజ్ఞాతవాసి’ సంగతి చెప్పాల్సిన పనే లేదు. గత సినిమా ఎంత నిరాశ కలిగించినా తర్వాతి సినిమాకు రేట్లు పెరిగాయి తప్ప తగ్గలేదు. ఐతే ఈ సినిమాలేవీ అనుకున్న స్థాయిలో లేకపోవడంతో ఓపెనింగ్స్ వరకు మాత్రమే జోరు కనిపించలేదు. రికవరీ ఎంతమాత్రం సాధ్యపడలేదు. దీంతో బయ్యర్లకు భారీ నష్టాలు తప్పలేదు. ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్ అనిపించుకున్నాయి.
ఇప్పుడిక ‘వకీల్ సాబ్’ విషయానికి వస్తే ఇదొక రీమేక్ మూవీ, పైగా లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్. దర్శకుడు వేణు శ్రీరామ్ ఎంతగా హీరోయిజం టచ్ ఇచ్చినా కథాంశంపై ఉన్న అవగాహన మేరకు ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుందన్న అంచనాల్లేవు. పవన్కు ఇది రీఎంట్రీ మూవీ కావడంతో విపరీతమైన రేట్లకు సినిమాను అమ్మి ఆ మేరకు రికవరీ లేక ఫ్లాప్ అనే ముద్ర వేసుకుంటుందేమో అన్నది అభిమానుల ఆందోళన. పవన్ మీద ఈ అంచనాల భారాన్ని పెట్టకుండా ఓ మోస్తరు లాభాలతో రాజు సినిమాను అమ్మి దీనికి ‘హిట్’ స్టేటస్ వచ్చేలా చూడాలన్నది అభిమానుల ఆకాంక్ష.
This post was last modified on February 10, 2021 12:05 pm
సినిమాల్లోకి వచ్చే ముందు అందరు నటులకు అభిమాన తారలని ఉంటారు. వాళ్లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చినపుడు…
గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకా…
రామసహాయం రఘురాం రెడ్డి.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన పేరు ఇది. ఎంతో ఉత్కంఠ నెలకొన్న ఖమ్మం…
ఏపీ సీఎం జగన్ తాజాగా పులివెందులలో నిర్వహించిన సభలో సొంత చెల్లి.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్.. వైఎస్ షర్మిలపై తీవ్ర…
కరీంనగర్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని భావించిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్కు ఆ టికెట్ దక్కకపోయినా…
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఓ ఇంట్రస్టింగ్ పాయింట్ హాట్ టాపిక్గా మారింది. 20 ఏళ్లలో తొలిసారిగా కేసీఆర్ కుటుంబం…