తమ హీరో సినిమాకు అత్యధిక బిజినెస్ జరగాలని, రికార్డులు బద్దలైపోవాలని ఆశిస్తుంటారు సాధారణంగా అభిమానులు. కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానుల తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ‘వకీల్ సాబ్’ బిజినెస్ పరంగా రికార్డులేమీ బద్దలు కొట్టేయొద్దని వాళ్లు కోరుకుంటున్నారు. పవన్తో సినిమా అని అత్యాశకు పోవొద్దని, రీజనబుల్ రేట్లకే అమ్మాలని నిర్మాత దిల్ రాజుకు విన్నపాలు చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదేం చిత్రం అనిపించొచ్చు కానీ.. పవన్ గత సినిమాల అనుభవాల నేపథ్యంలో వారికి ఇలా అనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు.
పవన్తో సినిమా అంటే బంగారు బాతులా భావించే నిర్మాతలు ట్రేడ్లో ఉన్న క్రేజ్ను బట్టి అయినకాడికి రేట్లకు సినిమాను అమ్మడం సర్వ సాధారణం అయిపోయింది. సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు లాంటి మామూలు సినిమాలను కూడా విపరీతమైన రేట్లకు అమ్మారు. ఇక త్రివిక్రమ్తో చేసిన క్రేజీ మూవీ ‘అజ్ఞాతవాసి’ సంగతి చెప్పాల్సిన పనే లేదు. గత సినిమా ఎంత నిరాశ కలిగించినా తర్వాతి సినిమాకు రేట్లు పెరిగాయి తప్ప తగ్గలేదు. ఐతే ఈ సినిమాలేవీ అనుకున్న స్థాయిలో లేకపోవడంతో ఓపెనింగ్స్ వరకు మాత్రమే జోరు కనిపించలేదు. రికవరీ ఎంతమాత్రం సాధ్యపడలేదు. దీంతో బయ్యర్లకు భారీ నష్టాలు తప్పలేదు. ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్ అనిపించుకున్నాయి.
ఇప్పుడిక ‘వకీల్ సాబ్’ విషయానికి వస్తే ఇదొక రీమేక్ మూవీ, పైగా లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్. దర్శకుడు వేణు శ్రీరామ్ ఎంతగా హీరోయిజం టచ్ ఇచ్చినా కథాంశంపై ఉన్న అవగాహన మేరకు ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుందన్న అంచనాల్లేవు. పవన్కు ఇది రీఎంట్రీ మూవీ కావడంతో విపరీతమైన రేట్లకు సినిమాను అమ్మి ఆ మేరకు రికవరీ లేక ఫ్లాప్ అనే ముద్ర వేసుకుంటుందేమో అన్నది అభిమానుల ఆందోళన. పవన్ మీద ఈ అంచనాల భారాన్ని పెట్టకుండా ఓ మోస్తరు లాభాలతో రాజు సినిమాను అమ్మి దీనికి ‘హిట్’ స్టేటస్ వచ్చేలా చూడాలన్నది అభిమానుల ఆకాంక్ష.
This post was last modified on February 10, 2021 12:05 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…