కోన వెంకట్.. ఒకప్పుడు రచయితగా వైభవం చూసిన ఈ వ్యక్తి కొన్నేళ్లుగా ప్రొడక్షన్కు పరిమితం అవుతున్నాడు. మంచి కాంబినేషన్లలో సినిమాలు సెట్ చేసి, అందుకు ప్రతిఫలంగా సినిమాలో వాటా పొందడం, ప్రొడక్షన్ చూసుకోవడం.. ఇలా నడుస్తోంది ఆయన కెరీర్. ‘నిశ్శబ్దం’ లాంటి ఒకట్రెండు సినిమాలకు మాత్రమే ఆయన గత కొన్నేళ్లలో రచన బాధ్యతలు తీసుకున్నారు. అది కూడా పూర్తి స్థాయిలో కాదు. రచయితగా కోన మార్కు చూసి చాలా కాలం అయిపోయింది. ఆయన్నో రచయితగానే గుర్తించట్లేదు ఈ మధ్య.
ఐతే చాలా గ్యాప్ తర్వాత ఓ భారీ చిత్రానికి కోన వెంకట్ రచన చేస్తున్నట్లు సమాచారం. అది మెగాస్టార్ చిరంజీవి ప్రాజెక్టు కావడం విశేషం. ఆయనతో కోన శిష్యుడు అనదగ్గ కె.ఎస్.రవీంద్ర (బాబీ) ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఇటీవలే ఆ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుందని అధికారికంగా ప్రకటించాడు మెగాస్టార్. ఈ చిత్రానికి స్క్రిప్టు పూర్తి కావస్తున్నట్లు సమాచారం. దీనికి కోన వెంకట్ రచనా సహకారం అందిస్తున్నాడట. అలాగే ‘పంతం’ సినిమాతో దర్శకుడిగా మారిన చక్రవర్తి కూడా ఈ సినిమాకు పని చేస్తున్నాడట. బాబీ ఇంతకుముందు చేసిన పవర్, జై లవకుశ సినిమాలకు కోన రచయితగా పని చేశాడు. బాబీ దర్శకుడిగా మారడంలో కోన సహకారం కూడా ఎంతో ఉంది. ఆయన్ని తన గురువులా భావిస్తాడు బాబీ.
వివిధ కారణాలతో గత కొన్నేళ్లలో రచన బాగా తగ్గించేసిన కోన.. చిరు సినిమాకు బాబీ విజ్ఞప్తి మేరకు స్క్రిప్టులో భాగమయ్యారట. ఐతే గతంతో పోలిస్తే కోన కలం పదును బాగా తగ్గిపోయినట్లు అనిపిస్తున్న నేపథ్యంలో చిరు సినిమాలో ఆయన ఏమాత్రం మెరుపులు మెరిపిస్తారో చూడాలి. ఈ సినిమాలో ఆయన రచన క్లిక్ అయితే మళ్లీ రైటర్గా బిజీ అవుతారేమో చూడాలి.
This post was last modified on February 10, 2021 10:57 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…