చంద్రశేఖర్ యేలేటి లాంటి విలక్షణ దర్శకుడి దగ్గర శిష్యరికం చేసి.. ‘అందాల రాక్షసి’ లాంటి విభిన్నమైన సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు హను రాఘవపూడి. తొలి సినిమాతోనే మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నప్పటికీ.. ఇప్పటిదాకా నిఖార్సయిన కమర్షియల్ హిట్ మాత్రం ఇవ్వలేకపోయాడు హను.
ఉన్నంతలో ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ ఓ మోస్తరు ఫలితం అందుకుంది కానీ.. ఆ తర్వాత అతణ్ని నమ్మి భారీ బడ్జెట్లలో తీసిన ‘లై’, ‘పడి పడి లేచె మనసు’ సినిమాలు దారుణమైన ఫలితాలందుకుని నిర్మాతల్ని ముంచేశాయి. ముఖ్యంగా ‘పడి పడి..’తో హనుకు చాలా చెడ్డ పేరు వచ్చింది. ఈ సినిమా తర్వాత అతడికి అవకాశాలు రావడం కష్టమే అనుకున్నారంతా. కానీ వైజయంతీ మూవీస్ లాంటి పెద్ద సంస్థలో అతడికి తర్వాతి సినిమా చేసే అవకాశం వచ్చినట్లు కొన్ని రోజుల కిందట ప్రచారం జరిగింది.
ఈ వార్త నిజమే అంటూ వైజయంతీ అధినేత అశ్వినీదత్ ధ్రువీకరించారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా దత్ తన సంస్థలో తెరకెక్కనున్న కొత్త సినిమాల గురించి చెప్పుకొచ్చారు. ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమాతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ సినిమా ఉంటుందని ఆయన వెల్లడించారు.
నందిని రెడ్డి సైతం ఓ కథను రెడీ చేస్తోందని.. ఆ సినిమా కూడా త్వరలోనే ఓకే అవుతుందని ఆయన చెప్పారు. ఐతే హను లాంటి దర్శకుడిని నమ్మి దత్ అవకాశం ఇవ్వడం విశేషమే. ఆయన కూతుళ్లు స్వప్న, ప్రియాంకలకు యంగ్ డైరెక్టర్లపై మంచి గురి ఉంది.
హను టాలెంటెడ్ అన్న విషయం అందరికీ తెలుసు కానీ.. ఒక సంపూర్ణమైన, సంతృప్తికర సినిమాను డెలివర్ చేయలేడన్న విమర్శలున్నాయి. సక్సెస్ రేట్ చాలా దారుణంగా ఉన్నప్పటికీ వైజయంతీ లాంటి సంస్థలో అవకాశం దక్కడం ఆశ్చర్యమే. ఈ అవకాశాన్ని అతను ఉపయోగించుకోకపోతే అతడి కెరీర్ ముగిసినట్లే. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తారని సమాచారం.
This post was last modified on May 7, 2020 8:16 pm
పార్టీ కోసం కష్ట పడే వారికే పదవులు దక్కుతాయి. పార్టీని నమ్ముకున్నవారికి ఎన్నటికీ అన్యాయం జరగదు. ఈ మాటలు టీడీపీ…
తెలంగాణలో అధికార కాంగ్రెస్ తన ఖాతాలోని మూడు ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థులను ఆదివారం సాయంత్రం ప్రకటించింది. అంతా అనుకున్నట్లుగా పార్టీ…
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(శ్రీశైలం కుడి కాల్వ) టన్నెల్లో గత నెల 22న జరిగిన ప్రమాదంలో చిక్కుకు పోయిన.. ఆరుగురు…
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ మహిళలకు మరింత భద్రత లభించింది. ఈ మేరకు ఏపీలోని కూటమి సర్కారు నేతృత్వంలోని…
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో మొత్తం 5 స్థానాలు…
రాష్ట్రంలో మహిళా ఓటు బ్యాంకు ఎక్కువగా ఉందన్న విషయం తెలిసిందే. నగరాలు, పట్టణాలే కాదు.. గ్రామీణ స్థాయిలోనూ మహిళల ఓటు…