సంక్రాంతికి నాలుగు మీడియం రేంజ్ సినిమాలతో కళకళలాడింది టాలీవుడ్ బాక్సాఫీస్. అందులో మూడు మంచి ఫలితాన్నందుకున్నాయి. ముఖ్యంగా ‘క్రాక్’ బ్లాక్బస్టరే అయింది. రూ.35 కోట్లకు పైగా ఆ చిత్రం షేర్ రాబట్టింది. ఐతే అందులో సగం మొత్తానికే ‘క్రాక్’ థియేట్రికల్ హక్కులు అమ్ముడవడం గమనార్హం. రవితేజ చేసిన గత నాలుగు సినిమాలూ డిజాస్టర్లు కావడం, సంక్రాంతికి మరో మూడు సినిమాలతో పోటీ పడటం, అలాగే అప్పటికి 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు నడుస్తుండటంతో మాస్ రాజా స్థాయికి తగ్గట్లుగా ఈ చిత్రానికి బిజినెస్ జరగలేదు.
ఐతే ఇప్పుడు వేలంటైన్స్ డే వీకెండ్లో రిలీజవుతున్న ‘ఉప్పెన’ సినిమాకు ‘క్రాక్’ను మించి థియేట్రికల్ బిజినెస్ జరగడం విశేషం. కొత్త హీరో, కొత్త హీరోయిన్, కొత్త దర్శకుడు కలిసి చేసిన ఈ చిత్ర థియేట్రికల్ హక్కులను దాదాపు రూ.22 కోట్లకు అమ్మినట్లు సమాచారం. 2021లో ఇప్పటిదాకా అత్యధిక బిజినెస్ చేసిన చిత్రం ఇదే కావడం విశేషం.
‘ఉప్పెన’ పాటల్లో ప్రతిదీ సూపర్ హిట్ రెస్పాన్స్ తెచ్చుకోవడం, టీజర్, ట్రైలర్, ఇతర ప్రోమోలన్నీ ఆకట్టుకోవడంతో ‘ఉప్పెన’కు మంచి హైపే వచ్చింది. ఇటీవల ఆ హైప్ మరింత పెరిగింది. ఈ చిత్రాన్ని ఓటీటీలకు ఇచ్చేయకుండా ఆపి మంచి పనే చేశారు. మంచి టైమింగ్ చూసి రిలీజ్ చేస్తుండటం కూడా కలిసొస్తోంది. అందుకే ట్రేడ్ నుంచి మంచి డిమాండే ఉన్నట్లు తెలుస్తోంది. కోస్తాంధ్ర హక్కులు మాత్రమే రేషియో పద్ధతిలో రూ.10 కోట్లకు అమ్ముడయ్యాయంటే ‘ఉప్పెన’ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మిగతా ఏరియాల్లోనూ మంచి రేట్లే పలికాయి.
ఐతే ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ నెలలో ఓ కొత్త హీరో సినిమా రూ.22 కోట్ల షేర్ రాబట్టడం అంటే అంత తేలిక కాదు. వైష్ణవ్ ముందు పెద్ద టార్గెట్ ఉన్నట్లే. ఐతే సినిమాకున్న హైప్ వల్ల ఓపెనింగ్స్కు ఢోకా ఉండవనే భావిస్తున్నారు. సంక్రాంతి సినిమాల తర్వాత మూడు వారాలు బాక్సాఫీస్ వెలవెలబోవడం, పెద్దగా పోటీ లేకుండా రిలీజవుతుండటం ‘ఉప్పెన’కు కలిసొచ్చే అంశాలు. మరి ఇన్ని పాజిటివ్స్ మధ్య రిలీజవుతున్న ‘ఉప్పెన’ బాక్సాపీస్ దగ్గర ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి.
This post was last modified on February 9, 2021 1:57 pm
ఇటీవలే కాంతారావు పురస్కారం అందుకున్న సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తమిళ లెజెండరీ నటులు ఎంజీఆర్ ని ఉద్దేశించి అన్న…
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…