‘సాహో’ సినిమా విషయంలో జనాల నుంచి వినిపించిన పెద్ద కంప్లైంట్ మ్యూజిక్కే. ముందు ఈ సినిమాకు శంకర్-ఎహ్సాన్-లాయ్లను సంగీత దర్శకులుగా ఎంచుకున్నారు. కానీ మధ్యలో ఏమైందో ఏమో వాళ్లు ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. సినిమా ఇంకో మూడు నెలల్లో విడుదల కాబోతుండగా ఈ చిత్రానికి మ్యూజిక్ ఎవరు చేస్తున్నారో తెలియని పరిస్థితి. విపరీతమైన సస్పెన్స్ తర్వాత.. హడావుడిగా ఐదుగురు సంగీత దర్శకులను తీసుకుని ఒక్కొక్కరితో ఒక్కో పాట చేయించుకున్నారు. జిబ్రాన్ ఆర్ఆర్ సమకూర్చాడు. దీంతో మ్యూజిక్ పరంగా పెద్ద కంగాళీ అయింది. సినిమాకు అది మైనస్సే అయ్యింది.
ప్రభాస్ కొత్త సినిమా ‘రాధేశ్యామ్’ విషయంలోనూ యువి క్రియేషన్స్ వాళ్లు ఇలాగే చేస్తున్న సంకేతాలు కనిపించాయి ముందు. సినిమా పూర్తవుతున్న దశలో కూడా సంగీత దర్శకుడిని ఖరారు చేయలేదు. ఐతే కొన్ని నెలల కిందటే ‘డియర్ కామ్రేడ్’ ఫేమ్ జస్టిన్ ప్రభాకరన్కు ఆ బాధ్యత అప్పగిస్తున్నట్లు ప్రకటన వచ్చింది.
ఇంతటిలో సస్పెన్సుకు తెరపడిందని.. అతనే పాటలు, నేపథ్య సంగీతం అందిస్తాడని అంతా ఓ నిర్ణయానికి వచ్చారు. కానీ ఇప్పుడు ఈ విషయంలో ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు సమాచారం. జస్టిన్ సినిమాలో అన్ని పాటలూ చేయట్లేదట. నేపథ్య సంగీతం బాధ్యత కూడా అతడిది కాదట. బాలీవుడ్లో హాఫ్ గర్ల్ ఫ్రెండ్, సనమ్ రే, శివాయ్, బాగి-2 లాంటి చిత్రాలకు సంగీతం సమకూర్చిన మిథూన్తో ఈ సినిమాకు వర్క్ చేయించుకుంటున్నారట.
జస్టిన్ మాత్రమే అయితే ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించడం కష్టమవుతుందన్న ఉద్దేశంతో ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్తో పాటు నేపథ్య సంగీత బాధ్యతలను మిథూన్కు అప్పగించినట్లు సమాచారం. ఐతే ‘సాహో’ అనుభవం నేపథ్యంలో ఇది మన జనాలకు అంతగా రుచించే విషయం కాదు. మరోసారి మ్యూజిక్ను కంగాళీ చేస్తారేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి యువి వాళ్ల ఉద్దేశమేంటో? ఫిబ్రవరి 14న ‘రాధేశ్యామ్’ టీజర్ రిలీజ్ కానుండగా.. జులై 30న సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
This post was last modified on February 9, 2021 9:49 am
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…
టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…
ఎవరు ఔనన్నా కాదన్నా టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎగ్జిబిటర్లు ప్లస్ వాళ్లలోనే ఉన్న నిర్మాతలు, ప్రొడ్యూసర్లు ప్లస్ వాళ్లలోనే…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు నిజంగానే ఉచ్చు బిగుస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.…
జైలు.. ఈ మాట వినగానే సామాన్యులకు వామ్మో అనిపిస్తుంది. అక్కడి పరిస్థితుల గురించి అనుభవం ఉన్న వాళ్లు చెబుతుంటే.. సినిమాల్లో…