ఉప్పెన.. ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్లో ఈ సినిమా గురించి చర్చలన్నీ. పది నెలల ముందు విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా దెబ్బకు పది నెలలు ఆలస్యంగా ఈ నెల 13న విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తే.. ఒక పెద్దింటి అమ్మాయి, ఒక పేదింటి కుర్రాడు ప్రేమలో పడితే.. అమ్మాయి తండ్రి అడ్డం పడటం.. ఈ క్రమంలో ఆ జంట పడే కష్టాలు.. చివరికి వాళ్లిద్దరి ప్రేమ నిలబడిందా లేదా అనే నేపథ్యంలో సినిమా నడిచేలా కనిపించింది. ఈ కోవలో వందల్లో సినిమాలు వచ్చాయి. కొత్తగా ‘ఉప్పెన’లో ఏం చూపించారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సినిమాలో లవ్ ఫీల్, ఎమోషన్లకు ఢోకా లేనట్లే కనిపించింది, సాంకేతిక ఆకర్షణలు బాగానే తోడైనట్లూ అనిపించింది.
కానీ ఇంకేదో బలమైన పాయింట్ లేకుండా ఈ సినిమాకు చిరు సహా మెగా ఫ్యామిలీ ఆమోద ముద్ర వేసేది కాదు. మైత్రీ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ అంత ఖర్చు పెట్టి సినిమా తీసేది కాదు. సుకుమార్ ఈ ప్రాజెక్టుకు అండగా నిలిచేవాడు కాదు. అన్నింటికీ మించి విజయ్ సేతుపతి లాంటి మేటి నటుడు ఈ సినిమాలో నటించేవాడు కాదు. ఈ నేపథ్యంలో ‘ఉప్పెన’లోని ఆ స్పెషల్ పాయింట్ ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది. ఐతే ఇండస్ట్రీలో ఆ పాయింట్ ఏంటన్నది ఆల్రెడీ లీక్ అయినట్లే చెబుతున్నారు. తన కూతురిని ప్రేమించాడన్న కోపంతో విజయ్ సేతుపతి హీరోకు చేసిన నష్టం ఏంటి అన్నది ఆ పాయింట్ అని సమాచారం.
‘ఉప్పెన’ ప్రి రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ.. ‘డేంజర్ పాయింట్’ అని పేర్కొన్నది దాని గురించి. అలాగే ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ వంగ సైతం ఇన్డైరెక్ట్గా ఆ పాయింట్ గురించి మాట్లాడాడు. ఇలాంటి ఐడియా తనకెందుకు రాలేదా అనిపించిందన్నాడు. సుకుమార్ సైతం ఆ పాయింట్ గురించి చూచాయిగా చెప్పాడు. సినిమాలో ప్రేక్షకులను ఆ పాయింట్ షాక్కు గురి చేస్తుందని, ఒకప్పటితో పోలిస్తే తెలుగు ప్రేక్షకుల అభిరుచి ఎంతో మారి, ప్రయోగాలకు చేయూతనిస్తున్న నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు ధైర్యంగా ఈ పాయింట్ను డీల్ చేశాడని, అతడికి అందరూ సపోర్ట్ ఇచ్చారని తెలుస్తోంది.
This post was last modified on February 8, 2021 8:16 am
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటిస్తే.. అది అమలు కావాల్సిందే!. అది గిరిజన ప్రాంతమైనా.. మైదాన ప్రాంతమైనా.. చెప్పినట్టు…
గత ఏడాది మలయాళంలో ఎవ్వరూ ఊహించని స్థాయిలో భారీ హిట్ అయింది మార్కో మూవీ. తెలుగులో జనతా గ్యారేజ్, భాగమతి…
నిజమే, ఈ రెండు మూగజీవాల కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేశాయి. నిహిలిస్ట్ పెంగ్విన్ : ఒక డాక్యుమెంటరీలో…
కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…