ఫలానా నాయకుడికి కరోనా.. ఫలానా ఫిలిం సెలబ్రెటీకి పాజిటివ్ అనే వార్తలు ఈ మధ్య బాగా తగ్గిపోయాయి. దేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో రోజు వారీ కేసులెన్ని, మరణాలెన్ని అనే లెక్కల్ని పట్టించుకోవడం కూడా ఎప్పుడో మానేశాం. దేశంలో వైరస్ ప్రభావం చాలా వరకు తగ్గిన సంగతి స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడంతా వ్యాక్సినేషన్ హడావుడే నడుస్తోంది. ఇలాంటి సమయంలో తమిళ స్టార్ హీరో సూర్య కరోనా బారిన పడ్డాడన్న వార్త ఇప్పుడు అతడి అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.
తనకు కరోనా లక్షణాలు కనిపించడంలో పరీక్ష చేయించుకున్నానని, పాజిటివ్ వచ్చిందని సూర్య ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించాడు. వైరస్ ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, అందరూ జాగ్రత్తలు పాటించాలని సూర్య విజ్ఞప్తి చేశాడు. తనతో సన్నిహితంగా మెలిగిన వారు పరీక్షలు చేయించుకోవాలని సూర్య సూచించారు.
అభిమానులు ఆందోళన చెందవద్దని, తాను త్వరలోనే కోలుకుంటానని సూర్య ధీమా వ్యక్తం చేశాడు.
గత ఏడాది ఓటీటీ రిలీజ్ ఆకాశం నీ హద్దురాతో పెద్ద విజయాన్నే అందుకున్నాడు సూర్య. చాలా ఏళ్ల తర్వాత సూర్యకు దక్కిన హిట్ ఇది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలై ఉంటే ఇంకా బాగుండేది. భారీ విజయాన్నందుకునేది. ఈ చిత్రం వివిధ విభాగాల్లో ఆస్కార్ అవార్డులకు కూడా నామినేట్ కావడం విశేషం.
ప్రస్తుతం సూర్య పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో గ్యాంగ్ లీడర్ భామ ప్రియాంక అరుల్ మోహన్ కథానాయిక. బహుశా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటుండగానే సూర్య కరోనా బారిన పడి ఉండొచ్చని భావిస్తున్నారు.
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…
లెనిన్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ చాలా ఏరియాలలో బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాలు…
ఏపీ మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
‘సప్తసాగరాలు దాటి’ చిత్రంలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది రుక్మిణి వసంత్. ఆ సినిమాలో రుక్మిణిని చూసిన…