నితిన్కి ఓవర్సీస్ మార్కెట్ కాస్త బాగానే ఉంటుంది. ఎందుకంటే… తనది ఫన్, రొమాంటిక్ జోనర్. ఇలాంటి కథలు.. ఓవర్సీస్ ప్రేక్షకులకు ఈజీగా నచ్చేస్తాయి. అఆ, భీష్మ లాంటి సినిమాలతో అక్కడి మార్కెట్ ని మరింత పెంచుకున్నాడు నితిన్. రంగ్ దేమీద కూడా బాగానే ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాని ఓవర్సీస్లో మంచి రేటుకి అమ్మాలని చూస్తున్నారు నిర్మాతలు.
అయితే.. ఓవర్సీస్ మార్కెట్ ఇప్పుడు డీలాగా ఉంది. అమెరికా వసూళ్లపై ఆశలు పెట్టుకునే అవకాశమే లేదు. టోటల్ గా ఓవర్సీస్ మార్కెట్ ఢమాల్. కాకపోతే.. రంగ్ దే ఓవర్సీస్ రూపంలో కనీసం 2 కోట్లు రాబట్టాలన్నది నిర్మాతల ప్రయత్నం. కానీ.. అంత పలకడం లేదు. కోటి, కోటిన్నర అంటూ బేరాలు తీస్తున్నారు బయ్యర్లు.
ఇంకాస్త రేటు పలికితే.. ఈ డీల్ క్లోజ్ చేయాలని.. నిర్మాతలు భావిస్తున్నారు. మార్చి 26న రంగ్ దే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates