థియేటర్లు మూత పడ్డ లాక్ డౌన్ టైంలో కొత్త సినిమాలను నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేసేశారు నిర్మాతలు. దీనిపై థియేటర్ల యాజమాన్యాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ.. అవసరాలను బట్టి తమ సినిమాలను ఎక్కడ, ఎలా రిలీజ్ చేసుకోవాలన్నది తమ ఇష్టమన్నట్లుగా మాట్లాడారు నిర్మాతలు. ఐతే థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయా అని చూసి చూసి ఇక తప్పక కొందరు నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలకు ఇచ్చేసిన మాటా వాస్తవం.
ఐతే ఇప్పుడు థియేటర్లు తెరుచుకున్నాయి. వాటిలో బాగా ఆడుతున్న సినిమాలను పెద్దగా గ్యాప్ ఇవ్వకుండానే ఓటీటీల్లో రిలీజ్ చేసేస్తుండటం ఎగ్జిబిటర్లకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. సంక్రాంతికి వచ్చిన తమిళ సినిమా ‘మాస్టర్’ థియేటర్లలో విడుదలైన రెండు వారాలకే అమేజాన్ ప్రైమ్లో రిలీజైంది. ‘క్రాక్’ మూవీ సైతం మూడు వారాల్లోపే ఆహాలోకి రావాల్సింది. కానీ ఆ సినిమా థియేటర్లలో బాగా ఆడుతుండటంతో ఒక వారం ఆలస్యంగా, ఫిబ్రవరి 5న ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.
ఒకప్పుడు థియేటర్లలో విడుదలైన రెండు మూడు నెలల తర్వాత ఓటీటీల్లోకి వచ్చేవి కొత్త సినిమాలు. తర్వాత ఆ గ్యాప్ నెలన్నరకు, ఆపై నెల రోజులకు తగ్గింది. కానీ ఇప్పుడు రెండు మూడు వారాలకే కొత్త సినిమాలను ఓటీటీలకు ఇచ్చేస్తున్నారు. ఇలా థియేట్రికల్ రిలీజ్కు, డిజిటల్ రిలీజ్కు గ్యాప్ మరీ తగ్గిపోతుండటం పట్ల ఎగ్జిబిటర్లలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అసలే కరోనా ధాటికి థియేటర్ల వ్యవస్థ దారుణంగా దెబ్బ తిందని, ఇప్పుడు ఇలా కొత్త సినిమాలు థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీల్లో రిలీజ్ చేస్తే తమ పరిస్థితి ఏంటని వారు గగ్గోలు పెడుతున్నారు.
ఇదే విషయమై నిర్మాతలతో తాడో పేడో తేల్చుకోవాలని నిశ్చయించుకున్న ఎగ్జిబిటర్లు.. బుధవారం రామానాయుడు స్టూడియోలో నిర్మాతలతో సమావేశమయ్యారు. ఈ మీటింగ్లో డిస్ట్రిబ్యూటర్లు సైతం పాల్గొన్నారు. ఈ సమావేశం వాడి వేడిగానే సాగినట్లు సమాచారం. నిర్మాతల తీరును తీవ్రంగా తప్పుబట్టిన ఎగ్జిబిటర్లు ఇలా అయితే థియేటర్లను నడపలేమని తేల్చేశారట. ఇకపై పెద్ద సినిమా అయితే థియేటర్లలో విడుదలైన 6 వారాల తర్వాత చిన్న సినిమా అయితే 4 వారాల తర్వాత ఓటీటీల్లో విడుదల కావాలని తేల్చి చెప్పారని.. అలాగే మల్టీప్లెక్సుల మాదిరే సింగిల్ స్క్రీన్లకు కూడ పర్సంటేజ్ విధానం ఉండాలని డిమాండ్ చేశారని తెలిసింది. ఈ షరతులకు అంగీకరించకపోతే మార్చి 1 నుంచి థియేటర్లు మూసేస్తామని అల్లిమేటం విధించినట్లు సమాచారం. దీనిపై నిర్మాతలు ఏమంటారో చూడాలి.
This post was last modified on February 4, 2021 3:45 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…