అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో ‘బంగార్రాజు’ సినిమా గురించి చర్చ ఈనాటిది కాదు. ఐదేళ్ల కిందట ‘సోగ్గాడే చిన్నినాయనా’ సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్నందుకున్న కొన్ని రోజులకే ఆ చిత్రంలో ప్రధాన పాత్రను ఆధారంగా చేసుకుని ‘బంగార్రాజు’ సినిమా తీసే విషయమై చర్చ మొదలైంది. ఈ సినిమా స్క్రిప్టు మీద దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల ఏళ్లకు ఏళ్లు కష్టపడ్డాడు. కానీ స్క్రిప్టుకు పచ్చ జెండా ఊపి సెట్స్ మీదికి తీసుకెళ్లే విషయంలో మాత్రం నాగార్జున బాగా ఆలస్యం చేశాడు. ఇదిగో అదిగో అనుకుంటూనే చాలా ఏళ్లు గడిచిపోయాయి.
ఐతే ఎట్టకేలకు నాగ్ పచ్చ జెండా ఊపేశాడని, త్వరలోనే షూటింగ్ మొదలు కాబోతోందని వార్తలొస్తున్నాయి. ఐతే ఈ చిత్రంలో ముందు నుంచి అనుకుంటున్నట్లు నాగచైతన్య నటించబోవట్లేదని తాజాగా వార్తలు వస్తుండటం గమనార్హం.
‘బంగార్రాజు’లో తాను నటిస్తానని ఇంతకుముందు స్వయంగా చైతూనే ధ్రువీకరించాడు. ఐతే అతను ఖాళీగా ఉన్న సమయంలో ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు చైతూ చాలా బిజీ అయిపోయాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్ యు’ సినిమా చేస్తున్నాడు. వేరే కమిట్మెంట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ‘బంగార్రాజు’ షెడ్యూల్స్కు అనుగుణంగా డేట్లు ఇవ్వలేని స్థితిలో ఉన్నాడట. నాగ్ ఏమీ చైతూనే ఈ సినిమాలో నటించాలని పట్టుబట్టడం లేదట. వేరే యువ కథానాయకుడిని తీసుకుంటే సినిమాకు కొంచెం భిన్నమైన లుక్ కూడా వస్తుందని ఆలోచిస్తున్నాడట.
చైతూ కోసం అనుకున్న పాత్రకు రామ్ లేదా నాగశౌర్యను తీసుకోవాలనుకుంటున్నట్లు ప్రచారం నడుస్తోంది. మీడియాలో కూడా దీనిపై వార్తలొస్తున్నాయి. ఇదెంత వరకు నిజమో చూడాలి. నాగ్ చివరగా ‘వైల్డ్ డాగ్’ సినిమాలో నటించాడు. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో నేరుగా రిలీజ్ కానుంది. త్వరలోనే ‘బంగార్రాజు’ చిత్రీకరణను నాగ్ మొదలుపెట్టనున్నాడట. ఆ తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది అక్కినేని హీరో.
This post was last modified on February 3, 2021 3:55 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…