Movie News

అయ్యో.. ఆదిపురుష్ సెట్లో తొలి రోజే

ప్ర‌భాస్ హిందీలో చేస్తున్న తొలి చిత్రం ఆదిపురుష్ మంగ‌ళ‌వార‌మే ప్రారంభోత్స‌వం జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన తానాజీ చిత్రాన్ని రూపొందించిన ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ భారీ చిత్రం తెర‌కెక్కుతోంది. ముహూర్తం రోజే ఎంతో ఉత్సాహంగా షూటింగ్ కూడా మొద‌లుపెట్టింది చిత్ర బృందం. కానీ తొలి రోజు అనుకోని ఘ‌ట‌న ఆదిపురుష్ టీంను నిరాశ‌లో ముంచెత్తింది. ముంబ‌యిలోని గోరెగావ్‌లో ఆదిపురుష్ సినిమా కోసం తీర్చిదిద్దిన భారీ సెట్లో పెద్ద అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది.

ప్ర‌మాదానికి కార‌ణ‌మేంటో తెలియ‌దు కానీ.. సెట్లో భారీగా ఎగ‌సిప‌డుతున్న అగ్ని కీల‌ల‌కు సంబంధించిన ఫొటోలు బ‌య‌టికి వ‌చ్చాయి. ఐతే అదృష్ట‌వ‌శాత్తూ కాస్ట్ అండ్ క్రూలో ఎవ‌రికీ గాయాలు కాలేద‌ని తెలుస్తోంది. ఫైర్ ఇంజిన్లు వ‌చ్చి మంట‌ల‌ను అదుపు చేసే ప్ర‌య‌త్నంలో ప‌డ్డాయి. ఈ భారీ చిత్రానికి ప్రారంభోత్స‌వం జ‌రిపిన తొలి రోజే ఇలా జ‌ర‌గ‌డం చిత్ర బృందంతో పాటు ప్ర‌భాస్ అభిమానుల‌ను బాధ పెడుతోంది. రామాయ‌ణ గాథ‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు ఈ అప‌శ‌కునం ఏంటి అని కూడా చ‌ర్చించుకుంటున్నారు. నిన్న‌టిదాకా స‌లార్ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన్న ప్ర‌భాస్ ఆదిపురుష్ ప్రారంభోత్స‌వం కోస‌మే ఈ రోజు ముంబ‌యి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సీత‌గా ప్ర‌భాస్ స‌ర‌స‌న కృతి స‌న‌న్ న‌టించ‌నున్న‌ట్లు చెబుతున్నారు. రావ‌ణుడి పాత్ర‌లో సైఫ్ అలీఖాన్ క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ త‌ల్లి పాత్ర‌కు హేమ‌మాలిని పేరు ప్ర‌చారంలో ఉంది. గుల్ష‌న్ కుమార్, మ‌రో ముగ్గురు నిర్మాత‌ల‌తో క‌లిసి స్వ‌యంగా ఓం రౌతే ఆదిపురుష్‌ను నిర్మిస్తున్నాడు. దీని బ‌డ్జెట్ దాదాపు రూ.500 కోట్ల‌ని అంటున్నారు.

suman

Recent Posts

భాగ్యశ్రీ… ముచ్చటగా మూడో భాషలోకి

ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకునే కథానాయికలు చాలా కొద్ది మందే ఉంటారు. అందుకు వారి గ్లామర్, యాక్టింగ్ టాలెంట్‌తో…

1 hour ago

నిర్మాతకు 15 కండిషన్లు పెట్టిన కొత్త హీరోయిన్

తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు కనిపించడం అరుదు. కాస్త పేరున్న నిర్మాణ సంస్థల్లో తెరకెక్కే చిత్రాల్లో ఎక్కువగా పర భాషా…

2 hours ago

నవీన్ పొలిశెట్టి… 5500 కోట్ల ఫ్రేమ్

నవీన్ పొలిశెట్టి నటించిన గత కొన్ని చిత్రాల్లో తన పేరు వెనుక ‘స్టార్ ఎంటర్టైనర్’ అనే ట్యాగ్ పడుతున్న సంగతి…

3 hours ago

ఇదేం లాజిక్ ఎంపీ గారూ?

విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాయికృష్ణది లాకప్…

4 hours ago

ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు!… కొత్త చరిత్రే!

దక్షిణ భారత దేశంలో గురువారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి కనిపించారు. అంతేకాదండోయ్…తాము…

4 hours ago

OG యూనివర్స్ ఏం చూపించబోతోంది

ఎన్నడూ లేనిది పవన్ కళ్యాణ్ ఓజి 2 విషయంలో దూకుడు చూపిస్తున్నారు. సురేందర్ రెడ్డికి కమిటైన ప్రాజెక్టు పక్కనపెట్టి మరీ…

4 hours ago