ప్రభాస్ హిందీలో చేస్తున్న తొలి చిత్రం ఆదిపురుష్ మంగళవారమే ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన తానాజీ చిత్రాన్ని రూపొందించిన ఓం రౌత్ దర్శకత్వంలో ఈ భారీ చిత్రం తెరకెక్కుతోంది. ముహూర్తం రోజే ఎంతో ఉత్సాహంగా షూటింగ్ కూడా మొదలుపెట్టింది చిత్ర బృందం. కానీ తొలి రోజు అనుకోని ఘటన ఆదిపురుష్ టీంను నిరాశలో ముంచెత్తింది. ముంబయిలోని గోరెగావ్లో ఆదిపురుష్ సినిమా కోసం తీర్చిదిద్దిన భారీ సెట్లో పెద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
ప్రమాదానికి కారణమేంటో తెలియదు కానీ.. సెట్లో భారీగా ఎగసిపడుతున్న అగ్ని కీలలకు సంబంధించిన ఫొటోలు బయటికి వచ్చాయి. ఐతే అదృష్టవశాత్తూ కాస్ట్ అండ్ క్రూలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నంలో పడ్డాయి. ఈ భారీ చిత్రానికి ప్రారంభోత్సవం జరిపిన తొలి రోజే ఇలా జరగడం చిత్ర బృందంతో పాటు ప్రభాస్ అభిమానులను బాధ పెడుతోంది. రామాయణ గాథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఈ అపశకునం ఏంటి అని కూడా చర్చించుకుంటున్నారు. నిన్నటిదాకా సలార్ చిత్రీకరణలో పాల్గొన్న ప్రభాస్ ఆదిపురుష్ ప్రారంభోత్సవం కోసమే ఈ రోజు ముంబయి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సీతగా ప్రభాస్ సరసన కృతి సనన్ నటించనున్నట్లు చెబుతున్నారు. రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించనున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ తల్లి పాత్రకు హేమమాలిని పేరు ప్రచారంలో ఉంది. గుల్షన్ కుమార్, మరో ముగ్గురు నిర్మాతలతో కలిసి స్వయంగా ఓం రౌతే ఆదిపురుష్ను నిర్మిస్తున్నాడు. దీని బడ్జెట్ దాదాపు రూ.500 కోట్లని అంటున్నారు.
This post was last modified on February 2, 2021 10:29 pm
ఇంకా నాలుగు నెలలు ఉండగానే 2027 సంక్రాంతి గురించి ఇండస్ట్రీ వర్గాలు, డిస్ట్రిబ్యూటర్లలో విపరీతమైన చర్చలు మొదలయ్యాయి. నేనంటే నేనంటూ…
భారత పోరుగు దేశం, దేవభూమి నేపాల్లో ఒక్కసారిగా సంభవించిన జల ప్రళయం.. ప్రజలను అతలాకుతలం చేసింది. ఒక్కసారిగా ఉప్పొంగిన కోశీ…
మూడు సంవత్సరాల క్రితం టాలీవుడ్ లో కొత్త రికార్డులు తిరగరాస్తూ హనుమాన్ ఎంత సంచలన విజయం సాధించిందో మూవీ లవర్స్…
వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరవుతున్న టైంలో రవితేజకు ఇరుముడి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. విజయం ఊహించిందే కానీ మరీ రికార్డులు బద్దలు…
తెలుగు దర్శకుల్లో కొందరు మాత్రమే ఒక జనరేషన్ ని ప్రభావితం చేసే స్థాయిలో సినిమాలు తీస్తారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో…
ఏ పార్టీ అయినా.. తీసుకునే నిర్ణయాలు.. చేసే ప్రకటనల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. సమయం వచ్చిందనో.. సందర్భం చిక్కిందనో…