బాలీవుడ్లో ఓ ఆసక్తికర చిత్రానికి రంగం సిద్ధమవుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇప్పటిదాకా విలన్, క్యారెక్టర్ రోల్స్ మాత్రమే చేసిన సోనూ సూద్.. త్వరలోనే హీరో అవతారం ఎత్తుతున్నాడట. అతను హీరోగా తమిళ హిట్ మూవీ ‘ఇరుంబు తిరై’ను హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు చెబుతున్నారు. దీనికి దర్శకుడెవరో తెలియదు. రీమేక్ హక్కులను సోనూనే కొన్నట్లు సమాచారం.
తమిళంలో విశాల్ చేసిన మిలిటరీ మ్యాన్ పాత్రలో సోనూ కనిపించనున్నాడట. ఇంకో విశేషం ఏంటంటే.. తమిళంలో అర్జున్ చేసిన విలన్ పాత్రలో విశాల్ నటిస్తాడట. ఈ రకంగా బాలీవుడ్లోకి విలన్ పాత్రతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్నమాట విశాల్. ఒక భాషలో హీరోగా నటించి, ఆ సినిమాను వేరే భాషలో తీస్తుంటే విలన్గా నటించడమంటే చిత్రమైన విషయమే.
ఇంతకుముందు మణిరత్నం తీసిన ‘విలన్’ సినిమా విషయంలో ఇలాంటి చిత్రమే చోటు చేసుకుంది. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్రమ్ విలన్ పాత్ర పోషించాడు. కానీ హిందీలో ఇదే సినిమాలో విక్రమ్ హీరోగా చేశాడు. ఐతే ఆ సినిమా ప్రతికూల ఫలితాన్నందుకోవడం వేరే విషయం. ‘ఇరుంబు తిరై’ తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో విడుదలై ఇక్కడా మంచి ఫలితాన్నందుకుంది. సమంత కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని మిత్రన్ రూపొందించాడు. అతడికదే తొలి సినిమా.
‘ఇరుంబు తిరై’ హిందీ వెర్షన్లో సోనూ హీరో, విశాల్ విలన్ అని వినడానికైతే బాగుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. లాక్ డౌన్ టైంలో అనితర సాధ్యమైన రీతిలో సేవా కార్యక్రమాలు చేసి రియల్ హీరో అనిపించుకున్న సోనూను ఇకపై విలన్ పాత్రల్లో చూడటానికి ఇష్టపడట్లేదు. అతను కూడా హీరో పాత్రలపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు హిట్ ‘క్రాక్’ రీమేక్ హక్కులను సోనూ కొన్నాడని, హిందీలో అతనే హీరోగా నటిస్తాడని కూడా ప్రచారం నడుస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on February 1, 2021 4:48 pm
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…