బాలీవుడ్లో ఓ ఆసక్తికర చిత్రానికి రంగం సిద్ధమవుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇప్పటిదాకా విలన్, క్యారెక్టర్ రోల్స్ మాత్రమే చేసిన సోనూ సూద్.. త్వరలోనే హీరో అవతారం ఎత్తుతున్నాడట. అతను హీరోగా తమిళ హిట్ మూవీ ‘ఇరుంబు తిరై’ను హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు చెబుతున్నారు. దీనికి దర్శకుడెవరో తెలియదు. రీమేక్ హక్కులను సోనూనే కొన్నట్లు సమాచారం.
తమిళంలో విశాల్ చేసిన మిలిటరీ మ్యాన్ పాత్రలో సోనూ కనిపించనున్నాడట. ఇంకో విశేషం ఏంటంటే.. తమిళంలో అర్జున్ చేసిన విలన్ పాత్రలో విశాల్ నటిస్తాడట. ఈ రకంగా బాలీవుడ్లోకి విలన్ పాత్రతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్నమాట విశాల్. ఒక భాషలో హీరోగా నటించి, ఆ సినిమాను వేరే భాషలో తీస్తుంటే విలన్గా నటించడమంటే చిత్రమైన విషయమే.
ఇంతకుముందు మణిరత్నం తీసిన ‘విలన్’ సినిమా విషయంలో ఇలాంటి చిత్రమే చోటు చేసుకుంది. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్రమ్ విలన్ పాత్ర పోషించాడు. కానీ హిందీలో ఇదే సినిమాలో విక్రమ్ హీరోగా చేశాడు. ఐతే ఆ సినిమా ప్రతికూల ఫలితాన్నందుకోవడం వేరే విషయం. ‘ఇరుంబు తిరై’ తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో విడుదలై ఇక్కడా మంచి ఫలితాన్నందుకుంది. సమంత కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని మిత్రన్ రూపొందించాడు. అతడికదే తొలి సినిమా.
‘ఇరుంబు తిరై’ హిందీ వెర్షన్లో సోనూ హీరో, విశాల్ విలన్ అని వినడానికైతే బాగుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. లాక్ డౌన్ టైంలో అనితర సాధ్యమైన రీతిలో సేవా కార్యక్రమాలు చేసి రియల్ హీరో అనిపించుకున్న సోనూను ఇకపై విలన్ పాత్రల్లో చూడటానికి ఇష్టపడట్లేదు. అతను కూడా హీరో పాత్రలపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు హిట్ ‘క్రాక్’ రీమేక్ హక్కులను సోనూ కొన్నాడని, హిందీలో అతనే హీరోగా నటిస్తాడని కూడా ప్రచారం నడుస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on February 1, 2021 4:48 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…