నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాకు రిలీజ్ డేట్ ఖరారైంది. ఆదివారం టాలీవుడ్ సర్కిల్స్లో ఇదే హాట్ టాపిక్. కాకపోతే దాన్ని బోయపాటి దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమాగానే సంబోధించాల్సి వస్తోంది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో ఇది మూడో సినిమా కావడంతో దీన్ని బీబీ3 అని కూడా పేర్కొంటున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ లుక్ వదిలారు. దాంతో పాటు రిలీజ్ డేట్ కూడా చెప్పారు.కానీ ఇప్పటికీ టైటిల్ మాత్రం ఖరారు చేయకపోవడం ఆశ్చర్యమే.
ఇంతకుముందు వీళ్లిద్దరి కలయికలో వచ్చిన రెండు సినిమాలకు చాలా ముందుగానే టైటిల్స్ ఖరారయ్యాయి. సింహా, లెజెండ్ అనే ఆ పవర్ ఫుల్ టైటిల్స్ వేగంగా జనాల్లోకి వెళ్లిపోయాయి. కానీ తమ కలయికలో కొత్త సినిమా విడుదల ఖరారయ్యాక కూడా పేరు పెట్టలేదు.
ఆదివారం రిలీజ్ డేట్ అప్డేట్ అన్నపుడే ఫస్ట్ లుక్, టైటిల్ కూడా రివీల్ అవుతుందని అభిమానులు ఆశించారు. కానీ బాలయ్య స్టైలిష్ ఫస్ట్ లుక్ అయితే వదిలారు కానీ.. పేరు మాత్రం పెట్టలేదు. బీబీ3 అని సంబోధిస్తూనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మరి ఇంకా ఈ సినిమా టైటిల్ విషయంలో ఒక అంచనాకు రాకపోవడం ఏంటి అన్నది అర్థం కావడం లేదు.
ఈ సినిమాకు రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ.. చివరికి మోనార్క్ అనే టైటిల్ ఖరారైనట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. మరి అదో మరొకటో కానీ.. ఇంకా పేరు పెట్టకపోవడమేంటో అర్థం కావడం లేదు. విడుదలకు ఇంకో నాలుగు నెలల కంటే తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఓ పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేసేస్తే సినిమా ప్రచారానికి ఉపయోగపడుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on February 1, 2021 10:16 am
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…