స్టార్ హీరోల పుట్టిన రోజులో, ఇంకేవైనా మంచి సందర్భాలో వచ్చినపుడు ముందు రోజు నుంచే సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్రెండ్ చేయడం మొదలుపెడతారు. పోటీ పడి ట్వీట్లు వేస్తారు. దీన్నో ఉద్యమంలాగా కొనసాగిస్తారు. ఐతే ఒక కమెడియన్కు, అది కూడా వయసు మళ్లి, దాదాపు సినిమాలు మానేసి, లైమ్ లైట్లో లేని వ్యక్తికి ఇలా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే.
ఇప్పుడు అలాంటి గౌరవం దక్కించుకున్న వ్యక్తి మరెవరో కాదు.. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం. ఫిబ్రవరి 1న ఆయన పుట్టిన రోజు. ఈసారి ఆయనకు 65 ఏళ్లు నిండుతున్నాయి. ఐతే ఎన్నడూ లేని విధంగా బ్రహ్మి ఈ పుట్టిన రోజుకు సోషల్ మీడియాలో విపరీతమైన హంగామా కనిపిస్తోంది. ఇదేమీ ఎవరో వెనుక ఉండి చేయిస్తున్న హడావుడి కాదు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా మూడు దశాబ్దాలకు పైగా అన్ని రకాల ప్రేక్షకులను తన హాస్యంతో అలరించిన బ్రహ్మికి నేటి యువత ప్రేమతో అందిస్తున్న కానుక. ముందు రోజు మధ్యాహ్నం నుంచే #hbdbrahmanandam అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి నెటిజన్లు ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు.
బ్రహ్మి హావభావాలతో కూడిన ఫొటోలు, వీడియోలు, ఆయన అద్భుత రీతిలో కామెడీ పండించిన సన్నివేశాలతో సోషల్ మీడియాలో హోరెత్తించేస్తున్నారు. కొన్నేళ్ల నుంచి బ్రహ్మి పెద్దగా సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో ఆయన ఎప్పుడూ చర్చల్లోనే ఉంటారు. ఎవరు ఏ హావభావాన్ని వ్యక్తం చేయాలన్నా బ్రహ్మి ఫొటోనో, వీడియోనో, జీఐఎఫ్పో ఉండాల్సిందే.
తెలుగు వాళ్లే కాక వేరే భాషల వాళ్లు సైతం వివిధ రకాల ఎక్స్ప్రెషన్లకు బ్రహ్మినే వాడుకుంటున్నారు. ఇలా ఆయన కోట్లాది మంది గుండెల్లో స్థానం సంపాదించుకుని తన పాపులారిటీని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బ్రహ్మి పుట్టిన రోజు హ్యాష్ ట్యాగ్ ఇండియా లెవెల్లో ట్రెండ్ అవుతుండటం విశేషం.
This post was last modified on February 1, 2021 7:53 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…