లాక్ డౌన్ టైంలో చిన్నా పెద్దా అని తేడా లేకుండా చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. అప్పటికే ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్న చాలా సినిమాలను ఓటీటీలకు ఇచ్చేశారు. కానీ కొన్ని సినిమాలు మాత్రం పట్టుబట్టి థియేట్రికల్ రిలీజ్ కోసం ఆగాయి. అందులో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ఒకటి. ఈ చిన్న సినిమాను పది నెలలకు పైగా ఆపి ఈ వారాంతంలో ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.
ఐతే సినిమాకు ఆశించినంత టాక్ మాత్రం రాలేదు. చిత్ర బృందం ప్రచారం చేసుకున్నట్లు ఇందులో సూపర్ హిట్టయిన ‘నీలి నీలి ఆకాశం’ పాట అంత బాగా సినిమా లేదు. యావరేజ్ అన్న వాళ్లు కూడా కనిపించడం లేదు. ఐతే టాక్తో సంబంధం లేకుండా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’కు మంచి ఓపెనింగ్స్ మాత్రం వచ్చాయి. తొలి రోజు 1.7 కోట్ల రూపాయల దాకా షేర్ వచ్చిందట ఈ చిత్రానికి.
నైజాంలో 65 లక్షలు, ఆంధ్రాలో 80 లక్షలు, రాయలసీమలో రూ.25 లక్షల షేర్ రావడం విశేషం. ఈ సినిమా స్థాయికి ఇది పెద్ద మొత్తమే. సంక్రాంతి సినిమా ‘క్రాక్’ జోరు కొనసాగుతుండగా.. గత వారం వచ్చిన ‘బంగారు బుల్లోడు’ దాని ధాటికి ఏమాత్రం నిలబడలేకపోయింది. మినిమం ఓపెనింగ్స్ రాలేదు ఆ చిత్రానికి. కానీ ‘30 రోజుల్లో..’కు మాత్రం తొలి రోజు ఉన్నంతలో మంచి వసూళ్లే వచ్చాయి. థియేటర్ల దగ్గర కళ కనిపించింది.
సినిమాకు ఈ మాత్రం బజ్ వచ్చి ప్రేక్షకులు థియేటర్ల వైపు కదిలారంటే అందులో మేజర్ క్రెడిట్ గాయకుడు సిద్ శ్రీరామ్కే ఇవ్వాలి. అతను పాడిన ‘నీలి నీలి ఆకాశం’ ఎంతగా పాపులర్ అయిందో, యూట్యూబ్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఆ పాట వల్లే ఈ సినిమా గురించి ప్రేక్షకులకు తెలిసింది. ఇప్పుడు ఈ సినిమా చూద్దామని ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారన్నా ఆ పాటే కారణం. ఐతే ఈ పాట ఓపెనింగ్స్కు ఉపయోగపడింది కానీ.. సినిమాను మాత్రం నిలబెట్టడం కష్టమే.
This post was last modified on January 30, 2021 6:47 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…