లాక్ డౌన్ టైంలో చిన్నా పెద్దా అని తేడా లేకుండా చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. అప్పటికే ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్న చాలా సినిమాలను ఓటీటీలకు ఇచ్చేశారు. కానీ కొన్ని సినిమాలు మాత్రం పట్టుబట్టి థియేట్రికల్ రిలీజ్ కోసం ఆగాయి. అందులో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ఒకటి. ఈ చిన్న సినిమాను పది నెలలకు పైగా ఆపి ఈ వారాంతంలో ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.
ఐతే సినిమాకు ఆశించినంత టాక్ మాత్రం రాలేదు. చిత్ర బృందం ప్రచారం చేసుకున్నట్లు ఇందులో సూపర్ హిట్టయిన ‘నీలి నీలి ఆకాశం’ పాట అంత బాగా సినిమా లేదు. యావరేజ్ అన్న వాళ్లు కూడా కనిపించడం లేదు. ఐతే టాక్తో సంబంధం లేకుండా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’కు మంచి ఓపెనింగ్స్ మాత్రం వచ్చాయి. తొలి రోజు 1.7 కోట్ల రూపాయల దాకా షేర్ వచ్చిందట ఈ చిత్రానికి.
నైజాంలో 65 లక్షలు, ఆంధ్రాలో 80 లక్షలు, రాయలసీమలో రూ.25 లక్షల షేర్ రావడం విశేషం. ఈ సినిమా స్థాయికి ఇది పెద్ద మొత్తమే. సంక్రాంతి సినిమా ‘క్రాక్’ జోరు కొనసాగుతుండగా.. గత వారం వచ్చిన ‘బంగారు బుల్లోడు’ దాని ధాటికి ఏమాత్రం నిలబడలేకపోయింది. మినిమం ఓపెనింగ్స్ రాలేదు ఆ చిత్రానికి. కానీ ‘30 రోజుల్లో..’కు మాత్రం తొలి రోజు ఉన్నంతలో మంచి వసూళ్లే వచ్చాయి. థియేటర్ల దగ్గర కళ కనిపించింది.
సినిమాకు ఈ మాత్రం బజ్ వచ్చి ప్రేక్షకులు థియేటర్ల వైపు కదిలారంటే అందులో మేజర్ క్రెడిట్ గాయకుడు సిద్ శ్రీరామ్కే ఇవ్వాలి. అతను పాడిన ‘నీలి నీలి ఆకాశం’ ఎంతగా పాపులర్ అయిందో, యూట్యూబ్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఆ పాట వల్లే ఈ సినిమా గురించి ప్రేక్షకులకు తెలిసింది. ఇప్పుడు ఈ సినిమా చూద్దామని ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారన్నా ఆ పాటే కారణం. ఐతే ఈ పాట ఓపెనింగ్స్కు ఉపయోగపడింది కానీ.. సినిమాను మాత్రం నిలబెట్టడం కష్టమే.
రాజమౌళి, మహేష్ బాబుల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి సినిమాలో రామాయణం నేపథ్యంలో ఒక అరగంట యుద్ధ సన్నివేశాలు ఉంటాయని…
జూన్ 19 మా ఇంటి బంగారం విడుదలకు రెడీ అవుతోంది. శాకుంతలం, ఖుషి తర్వాత సమంతకు బాగా గ్యాప్ వచ్చేసింది.…
ఆ పాఠశాలలో సంప్రదాయ విద్యా విధానం లేదు.. సహచర విద్యార్థుల ద్వారానే పాఠాలు నేర్చుకుంటారు… ఈ ప్రత్యేకతలు ఉన్న పాఠశాలను…
తెలుగు సినిమాల్లో సాధారణంగా ఒక సినిమాలో ఐదారు పాటలు ఉంటాయి. కొన్ని చిత్రాల్లో ఒకట్రెండు తగ్గుతుంటాయి. కొన్నింట్లో పెరుగుతుంటాయి. థ్రిల్లర్…
సోషల్ మీడియాలోనే కాదు బయట కూడా పెద్దిలో జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఎన్నడూ లేనిది…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఉద్యమ సంఘం నాయకుడు అభిజీత్ దీప్కే ఇచ్చిన పిలుపు ఫలించింది. శనివారం ఉదయం 10 గంటల…