మాస్ రాజాకు ఇంతకంటే లక్కీ టైం ఇప్పటిదాకా లేదేమో. ఆయన కొత్త సినిమా ‘క్రాక్’కు బాక్సాఫీస్ దగ్గర మామూలుగా కలిసి రావట్లేదు. సంక్రాంతికి ‘క్రాక్’తో పాటు ఇంకో మూడు సినిమాలు రిలీజయ్యాయి. ఆ మూడింటి మీదా మంచి అంచనాలే ఉన్నాయి. వాటికి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. కానీ ఆ తర్వాత సినిమాలు నిలబడలేదు. మిగతా మూడు సినిమాలు రావడానికి ముందు సోలోగా బాక్సాఫీస్ను రూల్ చేసింది ‘క్రాక్’.
సంక్రాంతి సమయంలో ఆ మూడు సినిమాల నుంచి పోటీ ఎదుర్కొంది కానీ.. పండుగ సందడి, వీకెండ్ ముగియగానే ఆ సినిమాలు జోరు తగ్గించేశాయి. ‘క్రాక్’ తిరుగులేని ఆధిపత్యాన్ని చాటింది. స్క్రీన్లు, షోలు పెంచడమే కాదు.. థియేటర్లలో ఎక్స్ట్రా చైర్స్ కూడా వేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ‘క్రాక్’ జోరు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
రెండు వారాల తర్వాతైనా ‘క్రాక్’ జోరు తగ్గుతుందనుకుంటే అదేమీ జరగలేదు. సంక్రాంతి సీజన్ తర్వాత రిలీజవుతున్న సినిమాలన్నీ తుస్సుమనిపిస్తున్నాయి. ‘క్రాక్’కు ఏమాత్రం బ్రేక్ వేయలేకపోతున్నాయి. గత వారం వచ్చిన ‘బంగారు బుల్లోడు’ అల్లరి నరేష్ ఫ్లాప్ స్ట్రీక్ను కంటిన్యూ చేసింది. కనీస స్థాయిలో కూడా ఆ సినిమా ప్రభావం చూపలేదు. అసలు దాన్నుంచి ‘క్రాక్’కు కొంచెం కూడా పోటీ లేకపోయింది.
ఇక ఈ వారం వచ్చిన ప్రదీప్ మాచిరాజు సినిమా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’కు డీసెంట్ బజ్ కనిపించింది. ‘నీలి నీలి ఆకాశం’ పాట అందుక్కారణం కావచ్చు. యూత్ ఈ సినిమాపై ఆసక్తిని ప్రదర్శించారు. కానీ వారి అంచనాలను అందుకోవడంలో సినిమా విఫలమైంది. నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో తొలి రోజు సెకండ్ షో సమయానికి సినిమా చల్లబడిపోయింది. దీంతో ‘క్రాక్’ జోరుకు ఈ వీకెండ్ కూడా బ్రేక్ పడనట్లే.
‘క్రాక్’ థియేటర్లలో మంచి కలెక్షన్ రాబడుతున్న నేపథ్యంలో ‘ఆహా’లో దాని డిజిటల్ రిలీజ్ను వారం వాయిదా వేశారు. కానీ ఈ వారాంతంలో ఆ సినిమా జోరు చూశాక ఇంకో వారం వాయిదా వేస్తే బాగుండని డిస్ట్రిబ్యూటర్లు అనుకుంటే ఆశ్ంచర్యం లేదు. కానీ అలా చేస్తే తమ ప్రయోజనాలకు గండి పడుతుంది కాబట్టి ‘ఆహా’ వారు అలా చేయకపోవచ్చు. ఫిబ్రవరి 5నే ఈ చిత్రాన్ని ఆహాలో స్ట్రీమ్ చేసే అవకాశముంది.
This post was last modified on January 30, 2021 2:25 pm
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…