మోస్ట్ అవైటెడ్ టీజర్ రానే వచ్చింది. శుక్రవారం ‘ఆచార్య’ మెరుపులు చూశాం. మెగా అభిమానులకు అది గూస్ బంప్స్ ఇచ్చింది. చిరు లుక్స్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన షాట్స్, వాటిలో చిరు చురుకుదనం అన్నీ ఆకట్టుకున్నాయి. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకున్నాయి. ఐతే చివరికి ఇందులో కొత్తగా ఏముంది అని చూస్తే పెద్దగా ఏమీ కనిపించలేదు. చూడగా చూడగా ‘ఆచార్య’ టీజర్లో అసలు కొరటాల ముద్ర ఏముంది అనిపించింది. ముఖ్యంగా టీజర్లో యాక్షన్ పార్ట్ డామినేషన్ అందరికీ అంత రుచించలేదు. మొత్తం టీజర్ చూసి ఇది కొరటాల సినిమానా.. బోయపాటి సినిమానా అని చాలామందికి సందేహం కలిగి ఉంటే ఆశ్చర్యమేమీ లేదు.
సాధారణంగా బోయపాటి సినిమాల కథలు చాలా వరకు ఒకే తరహాలో ఉంటాయి. ఒక ప్రాంతంలో విలన్లు విచక్షణా రహితంగా మనుషుల్ని చంపుతుంటే హీరో రక్షకుడిలా అక్కడికి రావడం.. దుష్ట సంహారానికి దిగడం.. రక్తపాతం సృష్టించడం.. ఇదీ బోయపాటి సినిమాల వరస. ‘ఆచార్య’ టీజర్ చూస్తే అచ్చంగా ఇది అలాంటి కథలాగే ఉంది. కాకపోతే ధర్మస్థలి అంటూ కొంచెం డిఫరెంట్గా ఉండే సెటప్ ఎంచుకున్నారు. మూల కథ మాత్రం పైన చెప్పుకున్న తరహాలోనే ఉంది.
ధర్మస్థలిలో ధర్మాన్ని కాపాడుతున్న మనుషుల ప్రాణాలకు ఆపద వస్తే హీరో వచ్చి దుష్ట సంహారం చేయడం, వారికి అండగా నిలబడటమే కథలా ఉంది. ఇక టీజర్ మొత్తంలో హైలైట్ అయిందంతా వయొలెన్సే. రకరకాలుగా విలన్ బ్యాచ్ తాట తీయడం.. వారిని సంహరించడం తప్ప చిరు కొత్తగా చేసిందేమీ లేదు. కాకపోతే ఆయన లుక్, చివర్లో చెప్పిన డైలాగ్ భిన్నంగా అనిపించాయి. బోయపాటి సినిమాల్లో అయితే హీరో చాలా ఆవేశంగా ఫైనల్ పంచ్ ఇస్తాడు.
కానీ ఇక్కడ చిరు కొరటాల స్టయిల్లో సటిల్గా డైలాగ్ చెప్పాడు. అంతే తేడా. కొరటాల సినిమాల్లో వయొలెన్స్కు ప్రాధాన్యం ఉంటుంది కానీ.. ఇందులో డోస్ మరీ ఎక్కువైందేమో అనిపిస్తోంది. కథ కూడా కొత్తగా అనిపించడం లేదు. టీజర్ వరకైతే కలిగిన ఫీలింగ్ ఇది. సినిమాలో ఇంకేదైనా కొత్తగా ట్రై చేసి తన ముద్రను చూపిస్తాడేమో చూడాలి.
This post was last modified on January 30, 2021 2:26 pm
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…