మోస్ట్ అవైటెడ్ టీజర్ రానే వచ్చింది. శుక్రవారం ‘ఆచార్య’ మెరుపులు చూశాం. మెగా అభిమానులకు అది గూస్ బంప్స్ ఇచ్చింది. చిరు లుక్స్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన షాట్స్, వాటిలో చిరు చురుకుదనం అన్నీ ఆకట్టుకున్నాయి. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకున్నాయి. ఐతే చివరికి ఇందులో కొత్తగా ఏముంది అని చూస్తే పెద్దగా ఏమీ కనిపించలేదు. చూడగా చూడగా ‘ఆచార్య’ టీజర్లో అసలు కొరటాల ముద్ర ఏముంది అనిపించింది. ముఖ్యంగా టీజర్లో యాక్షన్ పార్ట్ డామినేషన్ అందరికీ అంత రుచించలేదు. మొత్తం టీజర్ చూసి ఇది కొరటాల సినిమానా.. బోయపాటి సినిమానా అని చాలామందికి సందేహం కలిగి ఉంటే ఆశ్చర్యమేమీ లేదు.
సాధారణంగా బోయపాటి సినిమాల కథలు చాలా వరకు ఒకే తరహాలో ఉంటాయి. ఒక ప్రాంతంలో విలన్లు విచక్షణా రహితంగా మనుషుల్ని చంపుతుంటే హీరో రక్షకుడిలా అక్కడికి రావడం.. దుష్ట సంహారానికి దిగడం.. రక్తపాతం సృష్టించడం.. ఇదీ బోయపాటి సినిమాల వరస. ‘ఆచార్య’ టీజర్ చూస్తే అచ్చంగా ఇది అలాంటి కథలాగే ఉంది. కాకపోతే ధర్మస్థలి అంటూ కొంచెం డిఫరెంట్గా ఉండే సెటప్ ఎంచుకున్నారు. మూల కథ మాత్రం పైన చెప్పుకున్న తరహాలోనే ఉంది.
ధర్మస్థలిలో ధర్మాన్ని కాపాడుతున్న మనుషుల ప్రాణాలకు ఆపద వస్తే హీరో వచ్చి దుష్ట సంహారం చేయడం, వారికి అండగా నిలబడటమే కథలా ఉంది. ఇక టీజర్ మొత్తంలో హైలైట్ అయిందంతా వయొలెన్సే. రకరకాలుగా విలన్ బ్యాచ్ తాట తీయడం.. వారిని సంహరించడం తప్ప చిరు కొత్తగా చేసిందేమీ లేదు. కాకపోతే ఆయన లుక్, చివర్లో చెప్పిన డైలాగ్ భిన్నంగా అనిపించాయి. బోయపాటి సినిమాల్లో అయితే హీరో చాలా ఆవేశంగా ఫైనల్ పంచ్ ఇస్తాడు.
కానీ ఇక్కడ చిరు కొరటాల స్టయిల్లో సటిల్గా డైలాగ్ చెప్పాడు. అంతే తేడా. కొరటాల సినిమాల్లో వయొలెన్స్కు ప్రాధాన్యం ఉంటుంది కానీ.. ఇందులో డోస్ మరీ ఎక్కువైందేమో అనిపిస్తోంది. కథ కూడా కొత్తగా అనిపించడం లేదు. టీజర్ వరకైతే కలిగిన ఫీలింగ్ ఇది. సినిమాలో ఇంకేదైనా కొత్తగా ట్రై చేసి తన ముద్రను చూపిస్తాడేమో చూడాలి.
This post was last modified on January 30, 2021 2:26 pm
బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…
ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల నాటికి 4 నియోజకవర్గాలు చేజారి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.…
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…