టాలీవుడ్లో ఒకప్పుడు బాక్సాఫీస్ వార్ ప్రధానంగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ల మధ్యే నడిచేది. ఈ నలుగురిలో ఏ ఇద్దరి సినిమాలు ఒకేసారి విడుదలైనా మజా వచ్చేది. ఎక్కువగా చిరు, బాలయ్యల మధ్య హోరాహోరీ పోరు సాగింది. అలాగే చిరు, వెంకీ మధ్య కూడా బాక్సాఫీస్ వార్లు తక్కువగా ఏమీ లేవు.
కలియుగ పాండవులు-చంటబ్బాయ్, రౌడీ అల్లుడు-క్షణక్షణం, ఆపద్బాంధవుడు-సుందరకాండ, మాస్టర్-పెళ్లి చేసుకుందాం, అన్నయ్య-కలిసుందాం రా.. ఇలా చిరు, వెంకీ మధ్య బాక్సాఫీస్ పోరు చాలా సార్లే నడిచింది. ఐతే చివరగా మృగరాజు-దేవి పుత్రుడు 2001లో తలపడ్డాక ఈ ఇద్దరు సీనియర్ హీరోల మధ్య బాక్సాఫీస్ వార్ చూసే అవకాశం అభిమానులకు దక్కలేదు. అప్పుడు ఆ రెండు చిత్రాలూ డిజాస్టర్లే కావడం గమనార్హం.
మధ్యలో చిరు పదేళ్లకుపైగా విరామం తీసుకోవడం, వెంకీ జోరు తగ్గిపోవడం, యంగ్ హీరోల ఆధిపత్యం పెరిగిపోవడంతో ఈ ఇద్దరు సీనియర్ హీరోల మధ్య బాక్సాఫీస్ పోరు గురించి ఎప్పుడూ చర్చ కూడా లేకపోయింది. తన రీఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150ని బాలయ్య చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణితో పోటీకి నిలిపి పైచేయి సాధించాడు చిరు. ఇప్పుడు చిరు కొత్త సినిమా ఆచార్య.. వెంకీ మూవీ నారప్పతో పోటీ పడబోతుండటం విశేషం.
రెండు దశాబ్దాల విరామం తర్వాత మళ్లీ చిరు, వెంకీ బాక్సాఫీస్ పోరును ఈ వేసవిలో చూడబోతున్నాం. ఆచార్య, నారప్ప రిలీజ్ డేట్లు ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో ప్రకటించారు. ముందు నారప్ప చిత్రాన్ని మే 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించగా.. కాసేపటికే ఆచార్యను మే 13న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటన వచ్చింది. ఒక్క రోజు వ్యవధిలో విడుదల కాబోయే ఈ రెండు చిత్రాల్లో ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి మరి.
This post was last modified on January 30, 2021 10:34 am
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…