టాలీవుడ్లో ఒకప్పుడు బాక్సాఫీస్ వార్ ప్రధానంగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ల మధ్యే నడిచేది. ఈ నలుగురిలో ఏ ఇద్దరి సినిమాలు ఒకేసారి విడుదలైనా మజా వచ్చేది. ఎక్కువగా చిరు, బాలయ్యల మధ్య హోరాహోరీ పోరు సాగింది. అలాగే చిరు, వెంకీ మధ్య కూడా బాక్సాఫీస్ వార్లు తక్కువగా ఏమీ లేవు.
కలియుగ పాండవులు-చంటబ్బాయ్, రౌడీ అల్లుడు-క్షణక్షణం, ఆపద్బాంధవుడు-సుందరకాండ, మాస్టర్-పెళ్లి చేసుకుందాం, అన్నయ్య-కలిసుందాం రా.. ఇలా చిరు, వెంకీ మధ్య బాక్సాఫీస్ పోరు చాలా సార్లే నడిచింది. ఐతే చివరగా మృగరాజు-దేవి పుత్రుడు 2001లో తలపడ్డాక ఈ ఇద్దరు సీనియర్ హీరోల మధ్య బాక్సాఫీస్ వార్ చూసే అవకాశం అభిమానులకు దక్కలేదు. అప్పుడు ఆ రెండు చిత్రాలూ డిజాస్టర్లే కావడం గమనార్హం.
మధ్యలో చిరు పదేళ్లకుపైగా విరామం తీసుకోవడం, వెంకీ జోరు తగ్గిపోవడం, యంగ్ హీరోల ఆధిపత్యం పెరిగిపోవడంతో ఈ ఇద్దరు సీనియర్ హీరోల మధ్య బాక్సాఫీస్ పోరు గురించి ఎప్పుడూ చర్చ కూడా లేకపోయింది. తన రీఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150ని బాలయ్య చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణితో పోటీకి నిలిపి పైచేయి సాధించాడు చిరు. ఇప్పుడు చిరు కొత్త సినిమా ఆచార్య.. వెంకీ మూవీ నారప్పతో పోటీ పడబోతుండటం విశేషం.
రెండు దశాబ్దాల విరామం తర్వాత మళ్లీ చిరు, వెంకీ బాక్సాఫీస్ పోరును ఈ వేసవిలో చూడబోతున్నాం. ఆచార్య, నారప్ప రిలీజ్ డేట్లు ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో ప్రకటించారు. ముందు నారప్ప చిత్రాన్ని మే 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించగా.. కాసేపటికే ఆచార్యను మే 13న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటన వచ్చింది. ఒక్క రోజు వ్యవధిలో విడుదల కాబోయే ఈ రెండు చిత్రాల్లో ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి మరి.
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…
మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…
ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…
తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…
ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…