టాలీవుడ్లో ఒకప్పుడు బాక్సాఫీస్ వార్ ప్రధానంగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ల మధ్యే నడిచేది. ఈ నలుగురిలో ఏ ఇద్దరి సినిమాలు ఒకేసారి విడుదలైనా మజా వచ్చేది. ఎక్కువగా చిరు, బాలయ్యల మధ్య హోరాహోరీ పోరు సాగింది. అలాగే చిరు, వెంకీ మధ్య కూడా బాక్సాఫీస్ వార్లు తక్కువగా ఏమీ లేవు.
కలియుగ పాండవులు-చంటబ్బాయ్, రౌడీ అల్లుడు-క్షణక్షణం, ఆపద్బాంధవుడు-సుందరకాండ, మాస్టర్-పెళ్లి చేసుకుందాం, అన్నయ్య-కలిసుందాం రా.. ఇలా చిరు, వెంకీ మధ్య బాక్సాఫీస్ పోరు చాలా సార్లే నడిచింది. ఐతే చివరగా మృగరాజు-దేవి పుత్రుడు 2001లో తలపడ్డాక ఈ ఇద్దరు సీనియర్ హీరోల మధ్య బాక్సాఫీస్ వార్ చూసే అవకాశం అభిమానులకు దక్కలేదు. అప్పుడు ఆ రెండు చిత్రాలూ డిజాస్టర్లే కావడం గమనార్హం.
మధ్యలో చిరు పదేళ్లకుపైగా విరామం తీసుకోవడం, వెంకీ జోరు తగ్గిపోవడం, యంగ్ హీరోల ఆధిపత్యం పెరిగిపోవడంతో ఈ ఇద్దరు సీనియర్ హీరోల మధ్య బాక్సాఫీస్ పోరు గురించి ఎప్పుడూ చర్చ కూడా లేకపోయింది. తన రీఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150ని బాలయ్య చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణితో పోటీకి నిలిపి పైచేయి సాధించాడు చిరు. ఇప్పుడు చిరు కొత్త సినిమా ఆచార్య.. వెంకీ మూవీ నారప్పతో పోటీ పడబోతుండటం విశేషం.
రెండు దశాబ్దాల విరామం తర్వాత మళ్లీ చిరు, వెంకీ బాక్సాఫీస్ పోరును ఈ వేసవిలో చూడబోతున్నాం. ఆచార్య, నారప్ప రిలీజ్ డేట్లు ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో ప్రకటించారు. ముందు నారప్ప చిత్రాన్ని మే 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించగా.. కాసేపటికే ఆచార్యను మే 13న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటన వచ్చింది. ఒక్క రోజు వ్యవధిలో విడుదల కాబోయే ఈ రెండు చిత్రాల్లో ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి మరి.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…