Movie News

మూడేళ్ల గ్యాప్.. 8 నెలల్లో మూడు సినిమాలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదలై మూడేళ్లు దాటిపోయింది. 2018లో ‘అజ్ఞాతవాసి’తో పలకరించిన అతను.. ఆ తర్వాత రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టిసారించడం, ఒక దశలో మళ్లీ సినిమాలు చేయనని ప్రకటన కూడా చేయడం.. 2019 ఎన్నికల తర్వాత కొన్ని నెలలకు మనసు మార్చుకుని రీఎంట్రీకి రెడీ అవడం, ముందుగా ‘వకీల్ సాబ్’ను మొదలుపెట్టడం తెలిసిన సంగతే.

కరోనా లేకుంటే గత ఏడాది వేసవిలోనే పవన్ రీఎంట్రీ మూవీ చూసేవాళ్లం. కానీ ఆ మహమ్మారి కారణంగా పవన్ పునరాగమనం ఇంకో ఏడాది ఆలస్యం అయింది. మూడేళ్లకు పైగా విరామం తర్వాత ఏప్రిల్లో ‘వకీల్ సాబ్’తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు పవర్ స్టార్. ఐతే మూడేళ్ల గ్యాప్ వల్ల అభిమానులు కోల్పోయిన ఆనందాన్ని వడ్డీతో కలిపి ఇచ్చేయడానికి పవన్ రెడీ అయినట్లే ఉంది. కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో పవన్ మూడు సినిమాలను థియేటర్లలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

‘వకీల్ సాబ్’ వచ్చిన నాలుగు నెలలకు మరో సినిమా, ఆ తర్వాత నాలుగు నెలలకు ఇంకో సినిమా పవన్ నుంచి రాబోతున్నాయన్న కబురు అభిమానులను ఎగ్జైట్ చేస్తోంది. ‘వకీల్ సాబ్’ను పూర్తి చేసిన కొన్ని రోజులకే, ఇటీవలే ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్‌ను పవన్ పట్టాలెక్కించాడు. దీంతో పాటుగా క్రిష్ సినిమాలో ఆయన నటించనున్నాడు. ‘అయ్యప్పనుం..’ రీమేక్‌ను మూణ్నాలుగు నెలల్లోనే పూర్తి చేసి ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ కానుకగా విడుదల చేస్తారని అంటున్నారు.

క్రిష్ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతున్నదే కానీ.. ఎంత భారీ చిత్రమైనప్పటికీ అతనేమీ రాజమౌళిలా ఏళ్లకు ఏళ్లు సినిమా తీయడు. ఈ ఏడాది చివరి లోపే ఆ సినిమా పూర్తయ్యే అవకాశాలున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ కూడా 2021లోనే పూర్తి చేసి 2022 సంక్రాంతి రేసులో ఈ చిత్రాన్ని నిలిపే అవకాశాలున్నాయని అంటున్నారు. అదే జరిగితే ఈ ఏప్రిల్ మధ్య నుంచి 2022 జనవరి మధ్య లోపు ఎనిమిది నెలల వ్యవధిలో పవన్ సినిమాలు మూడు రిలీజవుతాయన్నమాట.

Satya

Recent Posts

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

2 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

3 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

3 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

3 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

5 hours ago

అమ‌రావ‌తిలో అల‌జ‌డి… మళ్ళీ ఏం జరిగింది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో శ‌నివారం తెల్ల‌వారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహ‌రించారు. ఈ ప్రాంతంలో రాజ‌ధాని…

6 hours ago