ఈ మధ్యే ‘బంగారు బుల్లోడు’ సినిమాతో పలకరించాడు అల్లరి నరేష్. కానీ అతడి ఫ్లాప్ స్ట్రీక్ను కంటిన్యూ చేస్తూ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. వీకెండ్లో కూడా కనీస ప్రభావం చూపలేక పోయిందీ చిత్రం. నిజానికి ఈ సినిమాపై నరేష్కు సైతం పెద్దగా ఆశల్లేనట్లే ఉంది. అతడి దృష్టంతా ‘నాంది’ చిత్రం మీదే ఉంది. చాలా ఏళ్ల తర్వాత ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి, ఇదేదో కొత్తగా ఉందే అనిపించిన నరేష్ సినిమా ఇది.
తన శైలికి భిన్నంగా నరేష్ ఇందులో సీరియస్ రోల్ చేశాడు. చేయని నేరానికి శిక్ష పడ్డ ఓ ఖైదీ.. తాను బయటికి రావడానికి చేసిన పోరాటం నేపథ్యంలో నడిచే కథ ఇది. విజయ్ కుమార్ కనకమేడల అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. గత ఏడాదే ఓటీటీలో ఈ సినిమా విడుదలవుతుందని ప్రచారం జరిగింది. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఐతే ఈ సినిమా విడుదలకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.
‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాను హోల్సేల్గా కొనేసిన జీ స్టూడియోస్ వాళ్లే ‘నాంది’ని కూడా కొన్నారట. రూ.8.5 కోట్లకు డీల్ క్లోజ్ అయినట్లు సమాచారం. త్వరలోనే అగ్రిమెంట్ పూర్తవుతుందని.. రిలీజ్ డేట్ ఇస్తారని సమాచారం. ఈ డీల్లో థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ హక్కులు కలిపి ఉంటాయి. ‘సోలో బ్రతుకే సో బెటర్’ తరహాలోనే ముందు థియేటర్లలో సినిమాను రిలీజ్ చేసి.. మరి కొన్ని రోజులకు డిజిటల్ స్ట్రీమింగ్కు వదులుతారు.
ఆపై జీ తెలుగులో సినిమాకు ప్రిమియర్స్ వేసుకుంటారు. ఇకపై ‘జీ’ వాళ్లు ఇదే ఒరవడిని కొనసాగించబోతున్నారని.. సినిమాలను హోల్సేల్గా కొనబోతున్నారని సమాచారం. ‘నాంది’ మీద ఉన్న అంచనాల ప్రకారం థియేటర్లలో రిలీజ్ చేసినా ఈ సినిమాకు మంచి ఫలితమే వచ్చే అవకాశముంది. కొంత రెవెన్యూ రాబట్టుకున్నాక ఓటీటీలో రిలీజ్ చేస్తే అక్కడా మంచి ఫలితం అందుకోవచ్చు.
This post was last modified on January 27, 2021 11:11 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…