Movie News

లాంఛనంగా ప్రారంభమైన సందీప్ కిషన్, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్ష‌న్ చిత్రం

వైవిధ్యమైన కథా చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న యంగ్‌ హీరో సందీప్‌కిషన్‌ హీరోగా ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై వేద వ్యాస్‌ దర్శకత్వంలో మహేశ్‌ కోనేరు నిర్మాతగా కొత్త సినిమా వైజాగ్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రైటర్‌ కోన వెంకట్‌ క్లాప్‌కొట్టగా, కంకట్ల సిల్క్స్‌ మల్లిక్‌ కెమెరా స్విచ్ ఆన్‌ చేశారు. ఈ సంద‌ర్భంగా…

నిర్మాత మ‌హేశ్ కోనేరు మాట్లాడుతూ “ఈ ఏడాది సంక్రాంతికి మా ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌లో వ‌చ్చిన ‘మాస్ట‌ర్‌’తో మ‌రో సూప‌ర్ డూప‌ర్ హిట్‌ను సొంతం చేసుకోవ‌డం ఆనందంగా ఉంది. అదే ఉత్సాహంతో ఈరోజు వైజాగ్‌లో కొత్త సినిమాను స్టార్ట్ చేశాం. డిఫ‌రెంట్ మూవీస్ చేయ‌డానికి ప్రాధాన్య‌త ఇచ్చే సందీప్‌కిష‌న్‌తో మ‌రో డిఫ‌రెంట్ మూవీని మా బ్యాన‌ర్‌లో రూపొందించబోతున్నాం. తన పాత్ర చాలా కొత్త‌గా ఉంటుంది.

ఫిబ్రవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. వేద వ్యాస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రానికి ఛోటా కె.ప్ర‌సాద్ ఎడిటర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేస్తాం” అన్నారు.

This post was last modified on January 26, 2021 4:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నేరుగా వంటింటికే.. రైతు బజార్!

డిజిటల్ యుగానికి అనుగుణంగా ప్రభుత్వం ఆన్‌లైన్ రైతు బజార్‌ను ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్ట్‌గా విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ రైతు బజార్…

19 minutes ago

బాబు గారి పాలన… అంతా లైవ్ లోనే!

సాధారణంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశాలు మూసివున్న గదుల్లో, గోప్యంగా సాగుతుంటాయి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న కలెక్టర్ల…

1 hour ago

డెకాయిట్… డిఫరెంట్ అనిపిస్తున్నాడు

అడివి శేష్ తెరమీద కనిపించి రెండేళ్లు గడిచిపోయాయి. ఆ మధ్య నాని హిట్ 3 ది థర్డ్ కేస్ లో…

1 hour ago

విశాఖపట్నంలో వండర్‌లా.. తిరుపతిలో ఇమాజికా వరల్డ్!

ఆంధ్రప్రదేశ్‌ను ప్రముఖ టూరిస్ట్ గమ్యస్థానంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు చేపడుతోంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రెండు ప్రాంతాల్లో టూరిజం మౌలిక…

2 hours ago

ఉండి టాక్: రఘురామ సత్తా తెలుస్తోందా..?

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరిలోని ఉండి నియోజకవర్గం నుంచి సీటు దక్కించుకుని విజయం సాధించిన రఘురామకృష్ణరాజు ప్రస్తుతం…

2 hours ago

బోయపాటి సిలబస్ మారే టైమొచ్చింది

ఎవరు ఔనన్నా కాదన్నా అఖండ తాండవం 2 బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న వైనం స్పష్టం. కొన్ని ఏరియాల్లో డీసెంట్ గా…

2 hours ago