Movie News

పవన్‍ కళ్యాణ్‍ మార్కు చేసేసిన త్రివిక్రమ్‍!

‘అయ్యప్పనుమ్‍ కోషియుమ్‍’ చిత్రాన్ని అమెజాన్‍లో చూసిన తెలుగువారిలో ఎవరూ కూడా పవన్‍కళ్యాణ్‍ను అయ్యప్ప నాయర్‍ పాత్రలో ఊహించుకోలేదు. నిజానికి ఆ సినిమా హక్కులు తీసుకున్న వాళ్లు కూడా బాలకృష్ణ లేదా రవితేజ లేదా వెంకటేష్‍ అనుకున్నారు. అయితే పవన్‍కళ్యాణ్‍ స్వయంగా ముచ్చటపడి ఆ పాత్ర చేయడానికి ముందుకొచ్చాడు. పవన్‍ రాకతో ఆ సినిమా స్వరూపం మారిపోయింది. పవన్‍ ఇమేజ్‍కు అనుగుణంగా మార్పు చేర్పులు చేయాల్సి వచ్చింది. అందుకు చేయి తిరిగిన త్రివిక్రమ్‍ సాయం తీసుకున్నారు.

మలయాళం సినిమా సోల్‍ చెడకుండా, పవన్‍ కళ్యాణ్‍ చేస్తోన్న పాత్ర ఔచిత్యం దెబ్బ తినకుండా త్రివిక్రమ్‍ మార్పులు చేసాడట. ఆ మార్పులు పవన్‍కి, రానాకి అలాగే ఆ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తోన్న సాగర్‍ చంద్రకు కూడా చాలా కన్విన్సింగ్‍గా అనిపించాయట. అసలు పవన్‍ కళ్యాణ్‍ ఇందులో ఎలా ఫిట్‍ అవుతాడనే ప్రశ్న పోయి ఇది అచ్చంగా పవన్‍ కళ్యాణ్‍ సినిమానే అన్నట్టుగా త్రివిక్రమ్‍ తన మాయాజాలం చూపించాడట. దబంగ్‍ చూసిన వారికి గబ్బర్‍సింగ్‍ ఎంత డిఫరెంట్‍గా కనిపించాడో ఈ చిత్రం కూడా అంతే కొత్తగా అనిపిస్తుందని, ఇది పవన్‍ కళ్యాణ్‍ ట్రేడ్‍ మార్కు సినిమా అంటారనేది ఇండస్ట్రీ మాట.

This post was last modified on January 26, 2021 12:09 am

Share
Show comments
Published by
suman

Recent Posts

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…

44 minutes ago

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

2 hours ago

సెలబ్రెటీ పెళ్లిళ్లు.. హడావుడి తగ్గించాలా?

పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…

2 hours ago

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

4 hours ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

5 hours ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

6 hours ago