Movie News

ఇక్కడ పవన్.. అక్కడ మహేష్


టాలీవుడ్ టాప్ స్టార్లు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తమ కొత్త సినిమాలను చడీచప్పుడు లేకుండా మొదలుపెట్టేస్తున్నారు. మహేష్ మొదలుపెట్టాల్సిన కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ అన్న సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు ఏడాది తర్వాత మహేష్ మేకప్ వేసుకుంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ అనుకున్నదానికంటే ఆలస్యంగా ఇప్పుడే మొదలవుతోంది. ఐతే తొలి షాట్ తీస్తోంది ఇండియాలో కాదు.. ఫారిన్లో.

‘సర్కారు వారి పాట’ తొలి షెడ్యూల్ దుబాయ్‌లో ప్లాన్ చేసింది చిత్ర బృందం. అందుకోసం ఇప్పటికే చిత్ర బృందమంతా అక్కడికి చేరుకుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న కీర్తి సురేష్ దుబాయ్‌కి వెళ్తూ ఫ్లైట్ నుంచి ఫొటోలు కూడా పెట్టిన సంగతి తెలిసిందే. మహేష్ సైతం ఇప్పటికే అక్కడికి చేరుకున్నాడు. ‘గీత గోవిందం’ తర్వాత పరశురామ్ తీస్తున్న సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఉమ్మడిగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చడీచప్పుడు లేకుండా తన కొత్త సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లిపోయాడు. ఆ చిత్రమే.. అయ్యప్పనుం కోషీయుం రీమేక్. ఇటీవలే ‘వకీల్ సాబ్’ను పూర్తి చేసిన పవన్.. క్రిష్ దర్శకత్వంలో సినిమాను పున:ప్రారంభించాడు. ఆ షూటింగ్‌లో పాల్గొంటూనే.. అయ్యప్పనుం కోషీయుం రీమేక్‌ను కూడా పూర్తి చేయాలని పవన్ నిర్ణయించుకున్నాడు. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

రానా ఇందులో పవన్‌ను ఢీకొట్టే పాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సోమవారమే మొదలైంది. రాజకీయ కార్యక్రమాల కోసం కొన్ని రోజులు విరామం తీసుకున్న పవన్.. నేరుగా ఈ సినిమా షూటింగ్‌కు హాజరు కానున్నాడు. తర్వాత మళ్లీ బ్రేక్ తీసుకుని క్రిష్ సినిమా మీదికి వెళ్తాడు. త్రివిక్రమ్ ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న సంగతి తెలిసిందే.

This post was last modified on January 25, 2021 11:50 am

Share
Show comments

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago