ఫక్తు ఫార్ములా సినిమాలు చేస్తాడని.. వయొలెన్స్ శ్రుతి మించుతుందని.. లాజిక్కులు ఉండవని.. కథల్లో కొత్తదనం ఉండదని.. ఇలా బోయపాటి శ్రీను సినిమాలపై ఎన్ని విమర్శలు చేసినప్పటికీ.. ఆయన తెలుగులో మంచి డిమాండ్ ఉన్న దర్శకుల్లో ఒకడు. ఆయనకు మంచి సక్సెస్ రేట్ కూడా ఉంది. ‘వినయ విధేయ రామ’కు ముందు బోయపాటి ట్రాక్ రికార్డు బాగానే ఉంది.
ప్రస్తుతం ఆయన నందమూరి బాలకృష్ణతో ఓ భారీ యాక్షన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘వినయ విధేయ రామ’ ప్రభావం ఏమీ కనిపించకుండా టీజర్తో ఈ చిత్రంపై అంచనాలు పెంచగలిగాడు బోయపాటి. ఈ మూవీతో ఆయన బలంగా బౌన్స్ బ్యాక్ అవుతాడని అభిమానులు ఆశిస్తున్నారు. బాలయ్య చిత్రాన్ని పట్టాలెక్కించడంలో, పూర్తి చేయడంలో కొంచెం ఆలస్యమైన నేపథ్యంలో.. తన తర్వాతి సినిమా విషయంలో వేగం చూపించాలని బోయపాటి అనుకుంటున్నాడు.
ఐతే తెలుగులో పెద్ద హీరోలెవరూ ఆయనకు ఈ ఏడాది డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. అందరూ లాక్ అయి ఉన్నారు. పైగా బాలయ్య సినిమా ఫలితం చూశాక కానీ బోయపాటికి ఛాన్సిచ్చేలా లేరు. ఈ నేపథ్యంలో ఈ మాస్ డైరెక్టర్ దృష్టి ఎప్పట్నుంచో తెలుగులో సినిమా చేయాలని చూస్తున్న తమిళ స్టార్ హీరో సూర్య మీద పడ్డట్లు సమాచారం. సూర్య సైతం తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేయాలని ఎప్పట్నుంచో చూస్తున్నాడు.
తెలుగు ప్రేక్షకుల మీద ప్రత్యేక ప్రేమతో స్ట్రెయిట్ తెలుగు సినిమాల లాగే ఔట్ పుట్ తీసుకొచ్చినప్పటికీ.. నేరుగా ఇక్కడ సినిమా చేయని లోటు మాత్రం సూర్యకు అలాగే ఉంది. ఈ నేపథ్యంలోనే అతను బోయపాటితో జట్టు కట్టడానికి సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఎక్కువగా వైవిధ్యమైన సినిమాలు చేస్తూనే.. అప్పుడప్పుడూ హరి లాంటి దర్శకులతో ఊర మాస్ సినిమాలు కూడా చేస్తుంటాడు సూర్య. అదే తరహాలో బోయపాటితో ఓ ద్విభాషా చిత్రం చేయాలని సూర్య అనుకుంటున్నాడట. అన్నీ కుదిరితే ఈ ఏడాదే ఈ సినిమా కార్యరూపం దాల్చొచ్చని చెబుతున్నారు.
This post was last modified on January 23, 2021 11:56 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…