సందీప్ కిషన్ హీరోగా తొలి అడుగులు వేస్తున్న టైంలో మొదలైన సినిమా ‘డీకే బోస్’. సినిమా అంతా పూర్తయింది. థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజైంది. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. కానీ ఎందుకో తెలియదు. ఆ సినిమా అడ్రస్ లేకుండా పోయింది.
అందరూ దాని గురించి మరిచిపోయారు. ఇక ఆ చిత్రం చరిత్రలో కలిసిపోయిందనే అనుకున్నారు. కానీ ఇప్పుడు సినిమా మొదలైన ఏడేళ్ల తర్వాత ‘డీకే బోస్’ రిలీజ్కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అగ్ర దర్శకుడు హరీష్ శంకర్ ఈ మేరకు సంకేతాలిచ్చాడు.
కొన్ని సినిమాలకు ‘అహెడ్ ఆఫ్ టైమ్స్’ అని కామెంట్ వస్తుందని.. ‘డీకే బోస్’ అలాంటి సినిమానే అని.. మంచికో చెడుకో ఆ సినిమా విడుదల ఆలస్యం అయిందని.. ఆ కథను చెప్పడానికి ఇదే సరైన సమయం అని ట్వీట్ చేసిన హరీష్.. మే 7వ తేదీ వరకు అప్ డేట్ కోసం ఎదురు చూడాలని సస్పెన్సులో పెట్టాడు.
ఇన్నేళ్లు వాయిదా పడ్డ సినిమా థియేటర్లలోకి రావడం అంటే కష్టమే. అందులోనూ ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా మళ్లీ థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియట్లేదు. ఈ నేపథ్యంలో ‘డీకే బోస్’ను ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా డైరెక్ట్ ఆన్ లైన్ రిలీజ్ చేసే అవకాశముంది. దానికి సంబంధించిన అప్ డేటే ఇవ్వబోతున్నట్లున్నారు. ఈ చిత్రాన్ని ఆన్ బోస్ అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. సందీప్ సరసన కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ నటించింది. సంపత్ రాజ్ విలన్ పాత్రలో నటించాడు.
‘ఓయ్’ సినిమా దర్శకుడు ఆనంద్ రంగా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకడు. ఇది ఒక పోలీస్ స్టోరీ. చాలా అగ్రెసివ్గా ఉండే యువ పోలీస్కు, ఒక గూండాకు మధ్య సాగే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తే మరీ పాత పడ్డ చిత్రంలా అయితే కనిపించడం లేదు. మరి ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో చూడాలి.
This post was last modified on May 7, 2020 6:24 pm
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…