అల్లు వారి ఓటీటీ ‘ఆహా’లో ఈ రోజే విడుదలైంది ‘సూపర్ ఓవర్’ సినిమా. నవీన్ చంద్ర, చాందిని చౌదరి, రాకేందు మౌళి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మంచి టాకే వచ్చింది. యువ దర్శకుడు సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఆ సినిమా దగ్గర్నుంచి అతడికి అసిస్టెంట్గా పని చేస్తూ వచ్చిన ప్రవీణ్ వర్మ ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
ఐతే తన తొలి సినిమాకు వస్తున్న స్పందన చూసి సంతోషించడానికి అతను జీవించి లేడు. ఈ సినిమా మేకింగ్ టైంలోనే అతను ప్రాణాల కోల్పోవడం విచారకరం. ‘సూపర్ ఓవర్’ చాలా వరకు రాత్రి పూట సాగే కథ. చిత్రీకరణ కూడా రాత్రిపూటే ఎక్కువగా సాగింది. సినిమాలో కార్ చేజింగ్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. ఐతే ఈ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుని ప్రవీణ్ వర్మ చనిపోయాడట. సినిమా చివరి దశలో ఉండగా అతను ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
మిగతా పనంతా సుధీర్ వర్మ దగ్గరుండి చూసుకుని సినిమాను పూర్తి చేయించాడు. పరిశ్రమలో ఇన్నేళ్లు పని చేసి, మంచి పేరు సంపాదించి, చివరికి దర్శకుడు కావాలన్న తన కలను నెరవేర్చుకునే సమయంలో ప్రవీణ్ వర్మ చనిపోవడం బాధాకరం. ‘సూపర్ ఓవర్’కు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమంలో ప్రవీణ్ను తలుచుకుని సుధీర్, నవీన్, చాందిని చౌదరి ఉద్వేగం ఆపుకోలేకపోయారు. కన్నీటి పర్యంతం అయ్యారు. అతణ్ని తలుచుకుంటూనే, అతడి ఆకాంక్షలకు తగ్గట్లుగానే సినిమాలో బ్యాలెన్స్ పార్ట్ తీశామని చెప్పారు.
‘సూపర్ ఓవర్’ సినిమా చివర్లోనూ ప్రవీణ్ వర్మకు నివాళి అర్పించింది చిత్ర బృందం. ‘మిస్ యూ’ అంటూ అతడి ఫొటో వేసి, మేకింగ్ టైంలో అతడి ఫొటోలను ప్రదర్శించారు. అది చూసి ప్రేక్షకులు షాకవుతున్నారు. యాక్షన్ ఘట్టాల చిత్రీకరణలో కాస్ట్ అండ్ క్రూ ఎంత జాగ్రత్తగా ఉండాలనడానికి ఇది తాజా ఉదాహరణ.
This post was last modified on January 23, 2021 10:09 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…