లక్ష్మీ భూపాల.. తెలుగు సినిమా రంగంలో ఉన్న మంచి రచయితల్లో ఒకరు. కాకపోతే ఆయన ప్రతిభకు తగ్గ పేరు రాలేదు. పెద్ద సినిమాలు, కమర్షియల్ ఎంటర్టైనర్లకు పని చేయకపోవడం వల్ల ఆయన టాలెంట్ ఏంటన్నది అందరికీ తెలియలేదు. మీడియాలో కూడా ఈ పేరు పెద్దగా నానలేదు. అలా మొదలైంది, కానీ చందమామ, మహాత్మ, కళ్యాణ వైభోగమే, నేనే రాజు నేనే మంత్రి, ఓ బేబీ.. ఈ సినిమాల వరుస చూస్తే, అందులోని డైలాగులు గుర్తు తెచ్చుకుంటే లక్ష్మీ భూపాల ఎంత మంచి రచయిత అనే విషయం అర్థమవుతుంది.
ఎక్కువగా నందిని రెడ్డి సినిమాలతో పేరు సంపాదించిన లక్ష్మీ భూపాలకు ఎట్టకేలకు కెరీర్కు పెద్ద బూస్టప్ ఇచ్చే అవకాశం అందింది. ఇప్పటిదాకా ఏ పెద్ద హీరోతో సినిమా చేయని లక్ష్మీ భూపాల ఒకేసారి ఏకంగా మెగాస్టార్ సినిమాకు మాటలు రాసే అవకాశం అందుకున్నారు.
చిరంజీవి హీరోగా బుధవారం లూసిఫర్ రీమేక్ ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంభాషణలు అందించనున్నది లక్ష్మీ భూపాలనే. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. తెలుగు వాడే అయిన తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. లూసిఫర్ను ఉన్నదున్నట్లు దించేయకుండా కొన్ని మార్పులు చేర్పులు కూడా చేస్తున్నాడు మోహన్ రాజా. స్క్రిప్టు చర్చల్లో భాగస్వామి అయిన లక్ష్మీ భూపాల సంభాషణలు కూడా అందిస్తున్నాడు.
కెరీర్లో తొలిసారి ఓ పెద్ద అవకాశం, అది కూడా మెగాస్టార్తో కావడంతో లక్ష్మీభూపాల తన టాలెంట్ చూపిస్తే ఇన్నేళ్లలో రానంత గుర్తింపు రావడం, ఆయన కెరీర్ మరో స్థాయికి చేరడం ఖాయం. ఈ చిత్రానికి సీనియర్ రచయిత సత్యానంద్ సైతం రచనా సహకారం అందిస్తుండటం విశేషం. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్స్తో కలిసి ఎన్వీ ప్రసాద్ లూసిఫర్ రీమేక్ను నిర్మిస్తున్నారు.
This post was last modified on January 21, 2021 9:24 am
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…