లక్ష్మీ భూపాల.. తెలుగు సినిమా రంగంలో ఉన్న మంచి రచయితల్లో ఒకరు. కాకపోతే ఆయన ప్రతిభకు తగ్గ పేరు రాలేదు. పెద్ద సినిమాలు, కమర్షియల్ ఎంటర్టైనర్లకు పని చేయకపోవడం వల్ల ఆయన టాలెంట్ ఏంటన్నది అందరికీ తెలియలేదు. మీడియాలో కూడా ఈ పేరు పెద్దగా నానలేదు. అలా మొదలైంది, కానీ చందమామ, మహాత్మ, కళ్యాణ వైభోగమే, నేనే రాజు నేనే మంత్రి, ఓ బేబీ.. ఈ సినిమాల వరుస చూస్తే, అందులోని డైలాగులు గుర్తు తెచ్చుకుంటే లక్ష్మీ భూపాల ఎంత మంచి రచయిత అనే విషయం అర్థమవుతుంది.
ఎక్కువగా నందిని రెడ్డి సినిమాలతో పేరు సంపాదించిన లక్ష్మీ భూపాలకు ఎట్టకేలకు కెరీర్కు పెద్ద బూస్టప్ ఇచ్చే అవకాశం అందింది. ఇప్పటిదాకా ఏ పెద్ద హీరోతో సినిమా చేయని లక్ష్మీ భూపాల ఒకేసారి ఏకంగా మెగాస్టార్ సినిమాకు మాటలు రాసే అవకాశం అందుకున్నారు.
చిరంజీవి హీరోగా బుధవారం లూసిఫర్ రీమేక్ ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంభాషణలు అందించనున్నది లక్ష్మీ భూపాలనే. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. తెలుగు వాడే అయిన తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. లూసిఫర్ను ఉన్నదున్నట్లు దించేయకుండా కొన్ని మార్పులు చేర్పులు కూడా చేస్తున్నాడు మోహన్ రాజా. స్క్రిప్టు చర్చల్లో భాగస్వామి అయిన లక్ష్మీ భూపాల సంభాషణలు కూడా అందిస్తున్నాడు.
కెరీర్లో తొలిసారి ఓ పెద్ద అవకాశం, అది కూడా మెగాస్టార్తో కావడంతో లక్ష్మీభూపాల తన టాలెంట్ చూపిస్తే ఇన్నేళ్లలో రానంత గుర్తింపు రావడం, ఆయన కెరీర్ మరో స్థాయికి చేరడం ఖాయం. ఈ చిత్రానికి సీనియర్ రచయిత సత్యానంద్ సైతం రచనా సహకారం అందిస్తుండటం విశేషం. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్స్తో కలిసి ఎన్వీ ప్రసాద్ లూసిఫర్ రీమేక్ను నిర్మిస్తున్నారు.
This post was last modified on January 21, 2021 9:24 am
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…