లక్ష్మీ భూపాల.. తెలుగు సినిమా రంగంలో ఉన్న మంచి రచయితల్లో ఒకరు. కాకపోతే ఆయన ప్రతిభకు తగ్గ పేరు రాలేదు. పెద్ద సినిమాలు, కమర్షియల్ ఎంటర్టైనర్లకు పని చేయకపోవడం వల్ల ఆయన టాలెంట్ ఏంటన్నది అందరికీ తెలియలేదు. మీడియాలో కూడా ఈ పేరు పెద్దగా నానలేదు. అలా మొదలైంది, కానీ చందమామ, మహాత్మ, కళ్యాణ వైభోగమే, నేనే రాజు నేనే మంత్రి, ఓ బేబీ.. ఈ సినిమాల వరుస చూస్తే, అందులోని డైలాగులు గుర్తు తెచ్చుకుంటే లక్ష్మీ భూపాల ఎంత మంచి రచయిత అనే విషయం అర్థమవుతుంది.
ఎక్కువగా నందిని రెడ్డి సినిమాలతో పేరు సంపాదించిన లక్ష్మీ భూపాలకు ఎట్టకేలకు కెరీర్కు పెద్ద బూస్టప్ ఇచ్చే అవకాశం అందింది. ఇప్పటిదాకా ఏ పెద్ద హీరోతో సినిమా చేయని లక్ష్మీ భూపాల ఒకేసారి ఏకంగా మెగాస్టార్ సినిమాకు మాటలు రాసే అవకాశం అందుకున్నారు.
చిరంజీవి హీరోగా బుధవారం లూసిఫర్ రీమేక్ ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంభాషణలు అందించనున్నది లక్ష్మీ భూపాలనే. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. తెలుగు వాడే అయిన తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. లూసిఫర్ను ఉన్నదున్నట్లు దించేయకుండా కొన్ని మార్పులు చేర్పులు కూడా చేస్తున్నాడు మోహన్ రాజా. స్క్రిప్టు చర్చల్లో భాగస్వామి అయిన లక్ష్మీ భూపాల సంభాషణలు కూడా అందిస్తున్నాడు.
కెరీర్లో తొలిసారి ఓ పెద్ద అవకాశం, అది కూడా మెగాస్టార్తో కావడంతో లక్ష్మీభూపాల తన టాలెంట్ చూపిస్తే ఇన్నేళ్లలో రానంత గుర్తింపు రావడం, ఆయన కెరీర్ మరో స్థాయికి చేరడం ఖాయం. ఈ చిత్రానికి సీనియర్ రచయిత సత్యానంద్ సైతం రచనా సహకారం అందిస్తుండటం విశేషం. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్స్తో కలిసి ఎన్వీ ప్రసాద్ లూసిఫర్ రీమేక్ను నిర్మిస్తున్నారు.
This post was last modified on January 21, 2021 9:24 am
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…